ASR: అరకులోయ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల (PTG) పాఠశాలను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు వంతల దేవదాసు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వసతి గృహాలు, వంటశాల, భోజన మెనూను పరిశీలించారు. విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లు, పల్లీ చీక్కీలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.