ELR: ఫీజులు కట్టని టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్స్ ఇవ్వని విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఎ) ఏలూరు జిల్లా కార్యదర్శి జి. అఖిల్ డిమాండ్ చేశారు. ఆగిరిపల్లిలో ఆయన మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ.. పంటలు సక్రమంగా పండని రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారని అన్నారు.
ELR: ఫీజులు కట్టని టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్స్ ఇవ్వని విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఎ) ఏలూరు జిల్లా కార్యదర్శి జి. అఖిల్ డిమాండ్ చేశారు. ఆగిరిపల్లిలో ఆయన మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ.. పంటలు సక్రమంగా పండని రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారని అన్నారు.
NTR: పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నెదర్లాండ్స్కు చెందిన వాగెనింగెన్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం సందర్శించింది. RySS ఆధ్వర్యంలో అమలు చేస్తున్న APCNF కార్యక్రమాన్ని పరిశీలించిన బృందం, మిర్చి ప్రకృతి వ్యవసాయ మోడల్, ATM మోడల్ను రైతులతో కలిసి అధ్యయనం చేసింది.
కోనసీమ: మండపేట మండలం ద్వారపూడిలో రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తీర్థ కావడి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సుమారు 600 మంది మహిళలు తీర్థ బిందెలు ధరించగా, 200 మంది స్వాములు కావడి ఉత్సవంలో పాల్గొన్నారు. రథంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
ATP: రాప్తాడు నియోజకవర్గం పాపంపేటలో ఈనెల 12న నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల పోస్టర్లను ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం ఆవిష్కరించారు. HYD బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్య బృందం ఈ శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఖరీదైన పరీక్షలను మన ప్రాంతంలోనే ఉచితంగా అందిస్తున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
KRNL: ఆదోని పట్టణంలో బంగారు వ్యాపారుల మోసాలపై బాధితులు ఎమ్మెల్యే డా. పార్థసారధిని కలిసి ఇవాళ ఫిర్యాదు చేశారు. కౌతాళం మండలం తోవి గ్రామానికి చెందిన దేవేంద్రప్ప బంగారం తాకట్టు వ్యవహారంలో మోసపోయినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ పూర్తి విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
TPT: ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడుపేటలో పర్యటించి టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలిస్తూ హెలిప్యాడ్, సభా స్థలాలను అధికారులు తనిఖీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కోనసీమ: ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే అని, ఆమె ఆశయాలకు పునారంకితం కావాలని దళిత చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజోలులో సావిత్రీబాయిఫూలే వర్థంతి కార్యక్రమాన్ని దళిత చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు లిఖితపూడి బుజ్జి అధ్యక్షతన నాయకులు నిర్వహించారు. తొలుత సావిత్రీబాయిఫూలే చిత్ర పటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.
SKLM: స్త్రీ శక్తి సమాజ అభివృద్ధికి మూలం అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను ఎమ్మెల్యే పరిశీలించారు.
KDP: YVU స్నాతకోత్సవాన్ని ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 13న యూనివర్సిటీ బందుకు RSF రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేష్ యాదవ్ పిలుపునిచ్చారు. యూనివర్సిటీలోని వేమన విగ్రహం వద్ద బంద్ పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థుల ఆత్మాభిమానానికి ప్రతీక అయిన స్నాతకోత్సవాన్ని యూనివర్సిటీ ఆవరణలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
W.G: తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం- 3 అంగన్వాడీ కేంద్రంలో పురుషులను భాగస్వామ్యం చేస్తూ ఇవాళ వంటల పోటీలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు డీ.ఎస్తేరు రాణి, శ్రీదేవి మాట్లాడుతూ.. బాల బాలికలను సమానంగా చూడాలన్నారు. ఇరువురిని సమానంగా చదివించాలన్నారు. బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్లో శిక్షణ ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
GNTR: జిల్లాలో ఉల్లాస్ అక్షర ఆంధ్రా పరీక్షలు మార్చి 15న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లాలో మొత్తం 1485 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్ష 150 మార్కులకు నిర్వహించబడుతుంది. ఇందులో చదవడం, రాయడం, అంకెల పరిజ్ఞానం అంశాలపై ప్రశ్నలు ఉంటాయన్నారు.
ప్రకాశం: దళితులకు స్మశాన భూములు కేటాయించాలని దళిత నేత నీలం నాగేంద్ర మార్కాపురం జేసీ శ్రీనివాసులను కోరారు. మంగళవారం జేసీను కలిసి దళితుల ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆమోదించిన కోనేరు రంగారావు కమిటీ జీవోలను అమలు చేయాలని, దళిత భూములను ఇతరులు ఆక్రమించి అమ్ముకుంటున్నారన్నారు.
అనంతపురంలో RTIH ఆధ్వర్యంలో ‘ఇగ్నైట్’ నైపుణ్యాభివృద్ధి శిక్షణను విభిన్న ప్రతిభావంతుల సంస్థ ఛైర్మన్ గడుపూటి నారాయణస్వామి మంగళవారం ప్రారంభించారు. ‘ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త’ పథకంలో భాగంగా దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతుందని తెలిపారు.
అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా భారత న్యాయవాదుల సంఘం (ఐ.ఏ.ఎల్.) ఆధ్వర్యంలో రాయచోటిలో మహిళా న్యాయవాదులను ఘనంగా సన్మానించారు. కడప–అన్నమయ్య జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆనందకుమార్ ఆధ్వర్యంలో రాయచోటి బార్ అసోసియేషన్కు చెందిన పలువురు మహిళా న్యాయవాదులను సత్కరించారు.