• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం ఆలయ వెబ్‌సైట్ అప్‌డేట్ చేయండి: కమిషనర్

NDL: శ్రీశైలం ఆలయ వెబ్‌సైట్ ఆర్జిత సేవలు, పూజలు, అలంకరణల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఓ ప్రకటనలో ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ విశేషాలు, సౌకర్యాల సమాచారం ఆన్‌లైన్ అందుబాటులో ఉంచాలని ఈవోను ఆదేశించారు. దీనివల్ల సమాచార సేకరణ భక్తులకు మరింత సులభతరం కానుంది.

April 27, 2026 / 08:49 AM IST

ఉపాధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే పరిటాల సునీత

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం ఉదయం వెంకటాపురం గ్రామ సమీపంలో సాగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కూలీల హాజరును ఆమె స్వయంగా నమోదు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న పని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 27, 2026 / 08:47 AM IST

జాగ్రత్తగా ఉండండి: సీఐ

CTR: గ్రామీణ ప్రాంత ప్రజలు ఆన్‌లైన్ మోసాలు, సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కుప్పం రూరల్ CI మల్లేష్ యాదవ్ సూచించారు. ‘ధైర్య స్పర్శ’ కార్యక్రమంలో భాగంగా రామకుప్పం మండలం ముద్దనపల్లిలో ఆదివారం రాత్రి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టం, మహిళలపై నేరాలకు పాల్పడితే ఏ విధమైన శిక్షలు ఉంటాయనేది వివరించారు.

April 27, 2026 / 08:40 AM IST

లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

KDP: పెడ్లిమర్రి(M)లోని చిన్నదాసరపల్లెలో ప్రసిద్ధిచెందిన వేయినూతులకోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పి. నరసింహ హరిప్రసాద్ తెలిపారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

April 27, 2026 / 08:38 AM IST

ఇంధనంపై వదంతులు నమ్మొద్దు: ఎస్పీ

BPT: జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సూచించారు. సోషల్ మీడియా ద్వారా పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. కృత్రిమ సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 27, 2026 / 08:36 AM IST

వెట్టి చాకిరి నుంచి చిన్నారులకు విముక్తి

నెల్లూరు: రాజంపేటకు చెందిన అక్కా, చెల్లెలైన ఇద్దరు చిన్నారులను వింజమూరుకు చెందినవారు మాయమాటలు చెప్పి వింజమూరుకు తెచ్చుకుని వారి వద్ద బాతులు మేపే పని కుదుర్చుకొని వెట్టిచాకిరి చేయించుకున్నారు. సంగం మండలంకు చెందిన ఓ వ్యక్తి వీరి పరిస్థితిని గమనించి ఇద్దరు చిన్నారులను కాపాడి సంగం పోలీసులకు అప్పగించాడు. విచారణ చేస్తామని ఎస్సై రాజేష్ తెలిపారు.

April 27, 2026 / 08:35 AM IST

రేపు కోసిగి మండల సర్వసభ్య సమావేశం

KRNL: కోసిగి ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 28న ఎంపీపీ ఈరన్న అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎస్. మహబూబ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 16 రకాల అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మండలంలోని అన్నీ శాఖల అధికారుల ప్రగతి నివేదికలను ఇవాళ సాయంత్రంలోగా ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.

April 27, 2026 / 08:34 AM IST

రాయచోటి క్రికెటర్‌కు ఏపీఎల్‌లో అవకాశం

అన్నమయ్య: రాయచోటికి చెందిన బౌలర్ మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో కాకినాడ కింగ్స్ జట్టుకు రూ.4 లక్షలకు ఎంపికయ్యారు. టీ20ల్లో 23 మ్యాచ్‌లలో 28 వికెట్లు తీసిన ఆయన, గతంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా ఎంపికయ్యారు. అలాగే లిస్ట్-Aలో 15 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు సాధించారు. ఈ అవకాశంతో ఆయన కెరీర్‌కు మరో మెట్టు ఎక్కినట్లైంది.

April 27, 2026 / 08:28 AM IST

ఒంగోలు పట్టణంలో ఘరానా చోరీ

ప్రకాశం: ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఘరానా చోరీ చోటుచేసుకుంది. పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి చెందిన ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 16 తులాల బంగారాన్ని అపహరించారు. వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్ళిన పూర్ణచంద్రరావు అతని భార్య ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగిందని గమనించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 27, 2026 / 08:28 AM IST

ఒకే ఈతలో నాలుగు మేకపిల్లలు జననం

NDL: జుపాడుబంగ్లా మండలంలోని పోతులపాడు గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి చెందిన మేక ఒకే ఈతలో 4 పిల్లలకు జన్మ నిచ్చింది. గతేడాది కూడా ఇదే మేక మూడుపిల్లలకు జన్మనిచ్చింది. గత ఐదురోజుల కిందట నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన తెలి పారు. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన మేకను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురైతున్నారు.

April 27, 2026 / 08:25 AM IST

1500 గ్రాముల పసుపుతో శ్రీవారి పాదాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నంద్యాలకు చెందిన ఉమాదేవి తన భక్తిని చాటుకుంది. సోమవారం సాయంత్రం ఆలయం వద్దకు శ్రీవారి పాదాలను ప్రతిరూపంగా సుమారు 1500 గ్రాముల పసుపుతో తయారు చేసి పూలతో అందంగా అలంకరించి తీర్చిదిద్దింది. ఆలయ పరిసరాల్లో ఈ అపూర్వ దృశ్యం భక్తులను ఆకట్టుకుని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉజ్వలంగా మార్చింది.

April 27, 2026 / 08:21 AM IST

డీజిల్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

GNTR: మంగళగిరి మండలం ఆత్మకూరులోని పెట్రోల్ బంకులను కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన సరఫరా సమృద్ధిగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. 

April 27, 2026 / 08:20 AM IST

‘ఇంధన సమస్యలపై కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్’

ప్రకాశం: జిల్లాలో ఇంధన సరఫరా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం కలెక్టర్ రాజాబాబు ఫ్యూయల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇంధన కొరత, అధిక ధరలు, నాణ్యత సమస్యలపై ప్రజలు 1077 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలు పనిచేస్తుందని, ఇంధన సమస్యలపై మాత్రమే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు.

April 27, 2026 / 08:20 AM IST

సామాన్యుడిలా బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో గత రాత్రి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మినీ బస్టాండ్‌ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బస్సు షెల్టర్ ప్రారంభించిన అనంతరం సామాన్యుడిలా టికెట్ తీసుకుని ధర్మాజీగూడెం నుంచి ఏలూరు రోడ్ వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణిస్తూ.. ప్రయాణికులను ఆత్మీయంగా పలకరించారు.

April 27, 2026 / 08:14 AM IST

నేడు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు

కోనసీమ: నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటలకు అంబాజీపేట మండలం చిరుతపూడి సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు పి.గన్నవరం మండలం మానేపల్లి వద్ద 1.48 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారు అని తెలిపారు.

April 27, 2026 / 08:13 AM IST