కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాదాపు 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సాదారణ తనిఖీల్లో భాగంగా కర్నూలు మున్సిపల్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేయటం జరిగిందని ఏసిబి అధికారులు తెలిపారు. పలు రికార్డులను సోదా చేయటం జరిగిందన్నారు.
ELR: ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో గెడ్డం రమేష్ బాబుకు వడదెబ్బ తగిలింది. వెల్లమిల్లి గ్రామంలో ఇంటి పన్నులు వసూలు చేసే క్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంలో ఇది చోటుచేసుకొంది. వడదెబ్బతో వాంతులు చేసుకొని నీరసించి పోయారు. ప్రాథమిక చికిత్సలు చేసి ఆయనను ఇంటికి పంపారు. ఎంపీడీవో మనోజ్, సూపర్డెంట్ ఆంజనేయ బాబు, మరో డిప్యూటీ ఎంపీడీవో ముత్తయ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ELR: ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో గెడ్డం రమేష్ బాబుకు వడదెబ్బ తగిలింది. వెల్లమిల్లి గ్రామంలో ఇంటి పన్నులు వసూలు చేసే క్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంలో ఇది చోటుచేసుకొంది. వడదెబ్బతో వాంతులు చేసుకొని నీరసించి పోయారు. ప్రాథమిక చికిత్సలు చేసి ఆయనను ఇంటికి పంపారు. ఎంపీడీవో మనోజ్, సూపర్డెంట్ ఆంజనేయ బాబు, మరో డిప్యూటీ ఎంపీడీవో ముత్తయ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
SKLM: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రి అనిత నిర్వహించిన వీసీలో జేసీ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో సమీక్షా సమావేశాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
SKLM: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రి అనిత నిర్వహించిన వీసీలో జేసీ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో సమీక్షా సమావేశాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
NLR: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోనీ కల్చరల్ సెంట్రల్లో ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.
KKD: కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన డెడికేటెడ్ కెమికల్ పార్కులపై వివరణ ఇవ్వాలని కాకినాడ MP సాన సతీశ్ రాజ్యసభలో కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ పార్కుల ఏర్పాటు విధానం, రాష్ట్రాల ఎంపిక ప్రక్రియ గురించి ప్రశ్నించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఈ పార్కుల కేటాయింపు వివరాలు తెలియజేయాలని రాజ్యసభలో డిమాండ్ చేశారు
TPT: స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ సమయానికే క్యూలైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. సోమవారం నుంచి ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపింది. భక్తులు ముందుగానే వచ్చి ఇబ్బంది పడకుండా, తమకు కేటాయించిన సమయానికే చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ATP: గుంతకల్లు మండలం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగమ సలహాదారులు, వైదిక కమిటీ సూచనల మేరకు పాత ఆలయాన్ని తొలగించి, నూతన నిర్మాణ పనులు చేపట్టారని పేర్కొంది. తప్పుడు వీడియోలతో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
E.G: గోకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపు ఉదయం 11 గంటలకు HPV వ్యాక్సిన్ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్లు సామాజిక ఆరోగ్య కేంద్ర ప్రధాన వైద్యులు డా. తిరన్ తెలిపారు. 14 ఏళ్లు నిండిన ప్రతి బాలిక ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
అన్నమయ్య: రాజంపేట మున్సిపాలిటీలో సమన్వయంతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేయాలని నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు వార్డుకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
KKD: YCP ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు వేలకోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. మంగళవారం CM చంద్రబాబును కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ కొన్ని ఆస్పత్రులు దోపిడి చేస్తున్నాయన్నారు. వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ కోసం రూ. 4500 కోట్లు విడుదల చేసిందన్నారు.
VZM: ప్రతి వేతనదారునికి ఏడాదికి 125 రోజుల పని కల్పించడమే లక్ష్యమని బాడంగి MPDO రామకృష్ణ తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో బాడంగిలో ఇవాళ వికసిత్ భారత్ పోస్టర్ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. పని పూర్తయిన 15 రోజుల్లోనే నగదు జమ చేస్తామన్నారు. జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా కార్డు ఇవ్వని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు.
W.G: గ్యాస్, ఆయిల్ నిల్వలు ఉన్నాయంటూ హోటల్స్ కమర్షియల్ గ్యాస్ నిలుపుదల చేయడం విడ్డూరంగా ఉందని సీపీఎం పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా మంగళవారం ప్రజాసంఘాల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. భారతదేశ స్థితిగతులను పరిశీలించి పాలన చేయాలని, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయరాదన్నారు.