కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తులు చేసిన వివిధ సేవలు ద్వారా రూ.3,24,759 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 389 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 91 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 2276 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.
CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఇంఛార్జ్ పొన్న పుట్టినరోజు వింజం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు దాము, వీర మహిళ విజయ, సీనియర్ నాయకులు యువరాజ్, హేమ కుమార్, సతీష్, తారక్, సంయుక్త కార్యదర్శి మెదవాడ రాఘవ, బీసీ సెల్ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: ధర్మవరం పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని శివానగర్, శాంతినగర్, రామ్నగర్ సహా పలు కాలనీల్లో నీటి సరఫరా సరిగా లేదని, కొన్నిచోట్ల 8 రోజులకు ఒకసారి మాత్రమే నీరు అందుతోందని వివరించారు.
NLR: సంగం పాత చెక్ పోస్ట్ సెంటర్ వద్ద ఉన్న ఎస్సీ కాలనీలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీఐ శ్రీనివాసుల రెడ్డి, ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, 30 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపుగా 25 బైకులు, రెండు ఆటోలు, సీజ్ చేసినట్లు తెలియజేశారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
CTR: పాకాల, ఐరాల మండలాల్లో నిన్న రాత్రి కురిసిన గాలివాన మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. వడగళ్లతో కూడిన వర్షానికి చేతికొచ్చే దశలో ఉన్న మామిడి కాయలు భారీగా నేలరాలాయి. మరో వారం రోజుల్లో కోతకు సిద్ధమైన పంట నేలపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రాలిన కాయలను వ్యాపారులు కిలో కేవలం రూ.2-3 కే కొనుగోలు చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
కోనసీమ: మండల కేంద్రమైన ఆలమూరు నంచి జొన్నాడ వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డుపై మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శరవణ ఫైబర్స్ కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో మండపేట, కొత్తపేట ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది.
కర్నూలు అశోక్ నగర్ నీటి శుద్ధి కేంద్రంలో వాల్వ్ మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని కేఎంసీ కమిషనర్ ఓబులేసు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మపేట, గాంధీ పార్క్, ఖాదక్పురా, అశోక్ నగర్, ఓల్డ్ బస్టాండ్, వన్టౌన్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి. గురువారం నుంచి యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరించబడుతుందిన్ని పేర్కొన్నారు.
ATP: ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. రెండో రోజు సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకుల నుంచి ఆయన స్వయంగా అర్జీలను స్వీకరించారు. వచ్చిన వినతులను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
NTR: వీరులపాడు మండలం పొన్నవరం క్రాస్ రోడ్డులో ఎస్సై అభిమన్యు తన బృందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతని వద్ద 1 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి అల్లూరు గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు.
VSP: దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న గోస్తని గడ్డ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. మురుగునీరు నిలిచిపోవడంతో ఇళ్లలోకి చేరుతున్న సమస్యపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించి యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. వార్డు అధ్యక్షుడు తమ్మిన సూరిబాబు ఆధ్వర్యంలో పూడికతీత పనులు చేపట్టి నీటి ప్రవాహాన్ని ఇవాళ సాఫీ చేశారు.
PPM: రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని గిరిజన శాఖ మాత్యులు సంధ్యారాణి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక GJ కాలేజీలోని మన్యం కళా వేదికలో 2026వ సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో మన్యంకు 4వ సారి స్టేట్ 1st రావటం గర్వకారము అన్నారు.
ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్స్లో ఈ నెల 8వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. SSC, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
BPT: బల్లికురవ మండల కేంద్రంలోని పశు వైద్యశాల పరిధిలోని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న 50 శాతం రాయితీ పశుగ్రాసం పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. డాక్టర్ పీ.మహేశ్వర రావు ఆధ్వర్యంలో బల్లికురవ, చెన్నుపల్లి, కొప్పెరపాలెం, ముక్తేశ్వరం గ్రామాలకు చెందిన పశుపోషకులకు ఈ దాణాను పంపిణీ చేశారు. పశువుల పోషణలో మేలైన దాణా పాత్ర కీలకమని ఆయన అన్నారు.
PLD: చిలకలూరిపేటలో జిల్లా అభివృద్ధికి గుంటూరు టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సామినేని కోటేశ్వరరావు రూ.10 లక్షల సీఎస్ఆర్ నిధులు ప్రకటించారు. టెక్స్టైల్ పార్క్ సందర్శించిన కలెక్టర్ కృతిక శుక్లాకు చెక్కును అందజేశారు. నూలు మిల్లుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
కృష్ణా: ఏపీ దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ను ఈ నెల 19 వరకు న్యాయస్థానం పొడిగించింది. అక్రమాస్తుల కేసులో శాంతి రిమాండ్ నేటితో ముగియడంతో, ఆమెను విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో శాంతి రిమాండ్ను ఈ నెల 19 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.