KKD: YCP ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు వేలకోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. మంగళవారం CM చంద్రబాబును కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ కొన్ని ఆస్పత్రులు దోపిడి చేస్తున్నాయన్నారు. వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ కోసం రూ. 4500 కోట్లు విడుదల చేసిందన్నారు.