TPT: స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ సమయానికే క్యూలైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. సోమవారం నుంచి ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపింది. భక్తులు ముందుగానే వచ్చి ఇబ్బంది పడకుండా, తమకు కేటాయించిన సమయానికే చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.