E.G: మంత్రి కందుల దుర్గేష్ సోమవారం నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు పెరవలి మండలం నడుపల్లికోటలో ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణ శంకుస్థాపన చేస్తారు. 10 గంటలకు పెరవలి మండలం మల్లేశ్వరంలో పశువైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. 11 గంటలకు నిడదవోలు మండలానికి మంజూరైన ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు