సత్యసాయి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు. పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 39.9 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు ఉన్నాయని విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. నైరుతి దిశ నుంచి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.