AP: రాష్ట్రంలోని చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం నెలకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500యూ వరకు ఉచిత్ విద్యుత్ అందించనుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 93 వేల చేనేత.. 11,488 పవర్లూమ్ కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు వెచ్చించనుంది.