అన్నమయ్య: రాజంపేట మున్సిపాలిటీలో సమన్వయంతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేయాలని నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు వార్డుకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.