• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మలేరియా నివారణకు అవగాహన ర్యాలీ

అన్నమయ్య: సుండుపల్లి మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మడితాడులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రూబీనా ఆధ్వర్యంలో మలేరియా నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, పరిసరాల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దోమతెరలు వినియోగించడం, వేపాకు పొగ వాడడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 25, 2026 / 06:26 PM IST

‘ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలి’

CTR: గుడిపాలలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సంఘమిత్రులతో సమావేశమై ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మండలంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, సమస్యలు ఉంటే తెలియజేయాలని అన్నారు. అనంతరం సంఘమిత్రలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

April 25, 2026 / 06:26 PM IST

మహంకాళి అమ్మవారి లక్ష విరాళం

PLD: నరసరావుపేట మండలం, ఇస్సపాలెం గ్రామంలో మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన తమ్మిశెట్టి పెద్ద శ్రీనివాసరావు, దేవి కుమారుడు దినేష్ వెంకట సాయి మానస దంపతులు కలిసి రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్‌, ఈవో మాధవిదేవికి అందజేశారు.

April 25, 2026 / 06:26 PM IST

స్వీయ గణనపై అవగాహనకు 5K రన్

E.G: జనగణన–2027లో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘స్వీయ గణన’ ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏప్రిల్ 26న వై.జంక్షన్ వద్ద నుంచి 5K రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా సమగ్ర కుటుంబ సర్వేను ప్రజలే తమ ఇళ్ల నుంచే ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే విధానం ఉందన్నారు.

April 25, 2026 / 06:25 PM IST

తిరువూరులో ప్రపంచ మలేరియా దినోత్సవం

NTR: తిరువూరులో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ రేష్మా బేగం ఆధ్వర్యంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా, డయేరియా నివారణకు పరిశుభ్రత కీలకమని సూచించారు. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెట్లు పొదలు శుభ్రం చేయాలని తెలిపారు.

April 25, 2026 / 06:20 PM IST

తిరువూరులో ప్రపంచ మలేరియా దినోత్సవం

NTR: తిరువూరులో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ రేష్మా బేగం ఆధ్వర్యంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా, డయేరియా నివారణకు పరిశుభ్రత కీలకమని సూచించారు. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెట్లు పొదలు శుభ్రం చేయాలని తెలిపారు.

April 25, 2026 / 06:20 PM IST

‘సహకార సంఘాల నిర్వహణలో ఎకౌంటింగ్ విధానం కీలకం’

అల్లూరి: సహకార సంఘాల నిర్వహణలో ఎకౌంటింగ్ విధానం కీలకమని సహాయక రిజిస్టర్ మరిడయ్య పేర్కొన్నారు. శనివారం పాడేరులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ ఆధ్వర్యంలో జిల్లా డీసీసీబీ సిబ్బంది, పీఏసీఎస్ సీఈవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎకౌంటింగ్ విధానాల్లో పాటించాల్సిన మెళకువలపై శిక్షణ అందించారు. పనిలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా పనితీరు మెరుగుపడుతుందన్నారు.

April 25, 2026 / 06:20 PM IST

పట్టణంలోకి భారీ వాహనాలు నిషేధం

ఏలూరు పట్టణంలోకి భారీ మరియు రవాణా వాహనాలకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతులు లేవని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు తెలిపారు. అనుమతుల లేకుండా భారీ వాహనాలు పట్టణంలోకి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు.

April 25, 2026 / 06:16 PM IST

‘పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’

SKLM: టీడీపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. జలుమూరు మండలం రామదాసుపేటలో నాయకులు కార్యకర్తలతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలని, సంక్షేమ పథకాలు చేరవేయాలని తెలిపారు.

April 25, 2026 / 06:13 PM IST

నియోజకవర్గ ముఖ్య నేతలతో మంత్రి భేటి

NDL: నంద్యాలలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చించారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా అధికారులతో సమన్వయం చేయాలని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.

April 25, 2026 / 06:12 PM IST

‘స్వీయ జనగణన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి’

బాపట్ల టౌన్ హాల్‌లో ‘ఫోరం ఫర్ బెటర్ బాపట్ల’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీయ జనగణన సహాయక కేంద్రాన్ని శనివారం మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలు తమ కుటుంబ, గృహ వివరాలను వాలంటీర్ల సహాయంతో ఆన్‌లైన్‌లో సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సౌకర్యం ఈనెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు.

April 25, 2026 / 06:12 PM IST

ముగిసిన గుమ్మనూరు మెగా క్రికెట్ టోర్నమెంట్

ATP: గుత్తి మండలం రజాపురం గ్రామంలో శనివారం జరుగుతున్న గుమ్మనూరు మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయరాం తనయుడు గుత్తి, పామిడి మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్‌ను ఆడారు. ఈశ్వర్ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఉత్తేజాన్ని ఇస్తాయన్నారు. గెలుపు, ఓటములు సహజమన్నారు.

April 25, 2026 / 06:11 PM IST

మార్కాపురం నుంచి బ్రహ్మంగారిమఠంకి RTC సర్వీసులు

ప్రకాశం: కడప జిల్లా పోరుమామిళ్లలో జరుగుతున్న బ్రహ్మంగారిమఠం ఆరాధనల సందర్భంగా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మార్కాపురం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. డిపో నుంచి మఠం వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ వెల్లడించారు. బస్సుల సమయాలు, ఇతర వివరాల కోసం ఎంక్వయిరీ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

April 25, 2026 / 06:09 PM IST

స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యం: MLA

KDP: దేవరాజుపల్లిలో స్వచ్ఛ రథాన్ని కమలాపురం MLA పుత్తా చైతన్య రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేన్ రెడ్డి కలిసి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

April 25, 2026 / 06:09 PM IST

జనగణన అవగాహనకు తెనాలిలో 5K రన్

GNTR: జనగణన–2027లో భాగంగా స్వీయ నమోదు (Self Enumeration)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ఉదయం 7:30 గంటలకు తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో “Census 5K Run” నిర్వహించనున్నారు. పురపాలక సంఘ కార్యాలయం నుంచి వైకుంఠపురం వరకు రన్ కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు, యువత పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

April 25, 2026 / 06:09 PM IST