VSP: మార్చి 1 నుంచి మంగళవారం వరకు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించినట్టు విశాఖ రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో మొత్తం 8 కేసులు నమోదు చేసి రూ. 6.35 లక్షల చలానాలు విధించారు. అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం, తదితర మోటారు వాహన చట్ట ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసామన్నారు.
అన్నమయ్య: మదనపల్లిలో మార్చి 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు PM విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్–కమ్–ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు MSME-DFO విశాఖపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ DVSR మూర్తి తెలిపారు. పద్మావతి కళ్యాణ మండపంలో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. 50కు పైగా స్టాళ్లలో సంప్రదాయ వృత్తులకు చెందిన కళాకారుల ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచనున్నారు.
ATP: తాడిపత్రి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు స్పెషల్ ఆఫీసర్ పద్మావతి మంగళవారం తెలిపారు. 6వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో చేరేందుకు విద్యార్థినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని తెలిపారు.
ATP: తాడిపత్రి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు స్పెషల్ ఆఫీసర్ పద్మావతి మంగళవారం తెలిపారు. 6వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో చేరేందుకు విద్యార్థినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని తెలిపారు.
ప్రకాశం: పొన్నలూరు మండలం చెన్నుపాడులో సెనగల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కర్ణ తిరుపతమ్మ మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో క్వింటా శనగలు రూ.5,875 కొనుగోలు చేస్తుండగా బయట మార్కెట్లో వ్యాపారస్తులు రూ.5 వేల లోపే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కందులు సెనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయం అని అన్నారు.
KDP: కడప భాకరాపేట రహదారి రైల్వే గేట్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన శంకర్ (37) మృతి చెందారు. గూడ్స్ రైలు కింద పడటంతో తల, ముఖానికి తీవ్ర గాయాలైన ఆయనను పోలీసులు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శంకర్ ఇవాళ మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
KDP: కడప భాకరాపేట రహదారి రైల్వే గేట్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన శంకర్ (37) మృతి చెందారు. గూడ్స్ రైలు కింద పడటంతో తల, ముఖానికి తీవ్ర గాయాలైన ఆయనను పోలీసులు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శంకర్ ఇవాళ మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 11,316 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు.11,759 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 443 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు తెలిపారు. జిల్లాలో అన్నిచోట్ల పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
VZM: ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.భబిత పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. రాజీ కాదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను గుర్తించి ప్రత్యేక డ్రైవ్ ద్వారా లోక్ అదాలత్లో పరిష్కరించాలని సూచించారు.
KRNL: ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 25 అడుగుల ధ్వజస్తంభ స్థాపన కోసం రూ.2 లక్షల నగదును అడ్డాల రామన్న మనవడు బుదరపు నందకిశోర్ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు నందకిశోర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు.
CTR: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాల్యవివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టం, హెల్ప్లైన్ నంబర్లు, శక్తి యాప్ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 1098 నంబర్లను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.
CTR: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాల్యవివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టం, హెల్ప్లైన్ నంబర్లు, శక్తి యాప్ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 1098 నంబర్లను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.
W.G: పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారులపై ఉందన్నారు. భూ రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
W.G: పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారులపై ఉందన్నారు. భూ రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
ATP: జిల్లా రైతులు ఆధునిక సాంకేతికతతో ఢిల్లీ దోస సాగు చేస్తున్నారు. జిల్లాలో 1,500 ఎకరాల్లో సాగైన ఈ పంటకు రంజాన్ సందర్భంగా ఢిల్లీ, ముంబై నగరాల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. వీటిని విక్రయించే ఒక్కో పెట్టెలో దోస కాయలు 5 చొప్పున 6.5 కిలోలు ఉంటాయి. ప్రస్తుతం పెట్టె ధర రూ.260-400 పలుకుతోంది. రైతులు అధిక లాభాలు గడిస్తున్నారు.