అన్నమయ్య: సుండుపల్లి మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మడితాడులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రూబీనా ఆధ్వర్యంలో మలేరియా నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, పరిసరాల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దోమతెరలు వినియోగించడం, వేపాకు పొగ వాడడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.