TPT: పేదలకు సేవలే లక్ష్యంగా పనిచేస్తున్న C.R ఫౌండేషన్కు గూడూరు సమీపంలో చావా వాసుదేవ రావు ఎకరా భూమిని విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కె. నారాయణ, అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గూడూరులో ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.
VZM: ఎస్.కోట పరిధిలోని లచ్చన్నదొరపాలెం గ్రామానికి చెందిన ఎన్. జమ్ములమ్మ పెళ్లి కాలేదనే మనస్థాపంతో గత నెల 30న గడ్డి మందు తాగింది. గమనించిన తోటి ఉద్యోగి ఆమెను మెరుగైన చికిత్స కోసం వైజాగ్ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పార్వతీపురం మండలం మాసికవలస గ్రామంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి జ్వర సర్వే చేపట్టినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. భాస్కర రావు తెలిపారు. జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు నాటు వైద్యం, అనధికార వైద్యులపై ఆధారపడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు పొందాలని సూచించారు.
CTR: పుంగనూరు ప్రభుత్వ ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్గా సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో తిరుపతి ప్రభుత్వ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
SKLM: ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎరువుల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.
విజయనగరం టీడీపీ నాయకులు బుధవారం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. టౌన్ పార్టీ అధ్యక్షులు గంటా రవి మాట్లాడుతూ.. 5 సంవత్సరాలలో ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వని వైసీపీ ఇప్పుడు మాట్లాడటం వింతగా ఉందన్నారు.
NLR: విడవలూరు మండలంలోని ఊటుకూరు, ముదివర్తి గ్రామాలలోని వేరుశనగ పొలాలను కోవూరు ఏడీఏ అనిత బుధవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఊటుకూరులో అధిక యూరియా వాడకం వలన కలిగేటువంటి అనర్ధాలపై రైతులకు అవగాహన చేశారు. పంటకు తగిన మోతాదులోనే ఎరువులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త కిరణ్ కుమార్, ఎంఏఓ లక్ష్మి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
ATP: పెద్దవడుగూరు మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మండల పరిధిలోని జాతీయ రహదారి 67 అప్పేచెర్ల, కృష్ణపాడు మధ్య ప్రాంతాలను బుధవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజాబాబు, ఎస్సై ఆంజనేయులు, ఆర్అండ్బీ జేఈ కోటీశ్వర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సత్యసాయి: పుట్టపర్తిలో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సమస్యలను పరిశీలించారు. కమిషన్ ఛైర్మన్ కే.ఎస్. జవహర్ మాట్లాడుతూ.. దళితుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎస్సీ వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కర్నూలులో బుధవారం చిన్నారుల్లో ఎదుగుదల లోపాలను ముందస్తుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత స్క్రీనింగ్పై జిల్లా స్థాయి శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతతో లోపాలను వేగంగా గుర్తించి సకాలంలో వైద్య, పోషకాహార సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. జూన్ 5 నుంచి 10 వరకు మండల స్థాయిలో అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు.
కోనసీమ: వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ మాజీ సీఎం జగన్ను రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. ఈ భేటీలో పిఠాపురం నియోజకవర్గ నాయకులు, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వడిశెట్టి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ పదవీ విరమణ పొందిన, మరణించిన హోమ్గార్డుల కుటుంబాలకు ‘చేయూత’ నిధుల చెక్కులను అందజేశారు. హోమ్గార్డులు స్వచ్ఛందంగా ఒక రోజు డ్యూటీ అలవెన్సును సమకూర్చి నాలుగు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. అలాగే మరణించిన హోమ్గార్డు దుర్గాప్రసాద్ భార్యకు కారుణ్య నియామకంగా ఉద్యోగం కల్పించారు.
BPT: అద్దంకిలో వైసీపీ కార్యాలయంలో బుధవారం బూత్ లెవెల్ ఏజెంట్లకు ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR)పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఓటర్ల జాబితా అత్యంత కీలక పాత్ర పోషించనుందని, ప్రతి బూత్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, అక్రమ తొలగింపులను అడ్డుకునేల పనిచేయాలని నేతలు చెప్పుకొచ్చారు.
W.G: పాలకోడేరు మండలంలోని మైప గ్రామంలో బుధవారం ఎక్సైజ్ అధికారులు జరిపిన దాడుల్లో బెల్ట్ షాపు నిర్వాహకుడు ఎన్. శ్రీనివాస్ను అరెస్టు చేసినట్లు సీఐ బలరామరాజు తెలిపారు. అతని వద్ద నుంచి 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్సైలు పి. ఉమామహేశ్వరరావు, పి. సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
VSP: ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ను వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.