KDP: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ కడప RDO కార్యాలయం వద్ద AITUC ఆధ్వర్యంలో నిరసన జరిగింది. అమెరికా,ఇజ్రాయిల్ దాడుల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందన్నారు. దౌత్య మార్గాల ద్వారా శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేశారు.
TPT: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి నివాసంలో గూడూరు జడ్పీటీసీ ఊటుకూరు యామిని మహేందర్ రెడ్డి, జగనన్న సేవా సమితి అధ్యక్షులు మహేందర్ రెడ్డిలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీ స్థితిగతులపై జగన్ వారితో చర్చించినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతమై విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
TPT: వడమాలపేట మండలంలో 20 కేజీల గంజాయి పట్టుకొని, నలుగురిని అరెస్టు చేసినట్లు పుత్తూరు DSP రవికుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్క్వాడ్, ఇతర సిబ్బంది వడమాలపేట మండలంలోని టీటీడీ స్థలాల సమీపంలో ఒక మోటార్ సైకిల్, స్కూటీని తనిఖీ చేయగా వారి వద్ద 20 కేజీల గంజాయి పట్టుబడినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలియజేశారు.
E.G: నన్నయ యూనివర్సిటీ డీన్ అకడమిక్ అఫైర్స్ ఆధ్వర్యంలో మంగళవారం డిగ్రీ బోర్డు ఆఫ్ స్టడీస్(BOS) సమావేశం నిర్వహించారు. VC ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ హాజరై BOS చైర్మన్లు, సభ్యులకు దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పెంచుతూ అన్ని డిగ్రీ కోర్సుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020, రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలన్నారు.
CTR: కుప్పం మండలం కృష్ణదాసన పల్లెకు చెందిన షణ్ముగం భార్య సునీత(40) బైక్ నుంచి జారిపడి మృతి చెందింది. సోమవారం భార్యాభర్తలు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లికి వెళుతుండగా గుడిపల్లి మండలం శ్రీనివాసపురం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తు సునీత బైక్ నుంచి జారీ కింద పడింది. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందారు.
PLD: చిలకలూరిపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 18 నుంచి ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు నుంచి తప్పుకోనుంది. పురపాలక సంఘం పాలనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి వరకు ఈమె బాధ్యతలు చేపట్టనున్నారు.
KKD: కమలాపురం మండలం కోగటం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 422 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ మోహన్, ఎస్సై విద్యాసాగర్ మీడియా సమావేశంలో తెలిపారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు.
ASR: అరకులోయ కేజీబీవీలో ఆరు, ఏడు తరగతుల, ఇంటర్మీడియట్ సీట్ల భర్తీకి ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి తెలిపారు. ఆరవ తరగతిలో 40, ఏడవ తరగతిలో 1, ఇంటర్ మొదటి ఏడాదిలో 40, ద్వితీయ ఇంటర్లో 11 సీట్లు ఉన్నాయన్నారు. అర్హులైన వారు ధరఖాస్తులను ఏప్రిల్ 1 లోగా అరకులోయ కేజీబీవీ ఆఫీసులో అందించాలని పేర్కొన్నారు.
BPT: బల్లికురవ మండలం వల్లాపల్లి గ్రామంలో చోటుచేసుకున్న భార్య హత్య కేసులో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన సంతమాగుళూరు సీఐ కె. వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడు గుంటుపల్లి వీరాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. భార్యను హత్య చేసిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
PPM: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గిరిజన పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుమ్మలక్ష్మిపురం మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.
SKLM: బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన అంతరాష్ట్ర నిందితుడిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివేకానంద ఇవాళ తెలిపారు. నెల్లూరుకు చెందిన గొల్ల బెనర్జీ హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి జిల్లాకు చెందిన పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: మొవ్వ మండలం కూచిపూడి గ్రామ సచివాలయం పరిధిలో ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమం కొనసాగుతోందని పంచాయతీ సెక్రెటరీ అంకబాబు అన్నారు. గ్రామంలో AO శివరామకృష్ణ, ఎంపీడీవో త్రినాధ్ సమక్షంలో ఇంటి పన్నుల వసూళ్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం మొత్తం రూ.6,79,136 నగదు చెక్కుల రూపంలో వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామ అభివృద్ధి సహకరించాలని కోరారు.
W.G: ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేయడం అంటే కాలపురుషుడైన శ్రీమహావిష్ణువును పూజించడమేనని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. గునుపూడిలోని దాసాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ పుస్తకాలను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాంగ శ్రవణానికి, రైతులకు విడదీయలేని బంధం ఉందన్నారు.
VSP: వేసవిని దృష్టిలో ఉంచుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పీ. విష్ణుకుమార్ రాజు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా GVMC జోన్-5 కార్యాలయంలో ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా పునర్వినియోగం చేయగల నీటి బాటిళ్లను అధికారులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్తె శ్యామల దీపిక, తదితరులు పాల్గొన్నారు.
PPM: గుమ్మలక్ష్మి పురం మండలంలోని లక్కగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న పెర్కోలేషన్ ట్యాంక్ (భూగర్భ జల రీఛార్జ్ కుంట) పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ సీ.యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాణ్యతలో రాజీ పడకూడదన్నారు.