కృష్ణా: గన్నవరం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం కండిషనల్ బెయిల్ నిబంధనల ప్రకారం హాజరై సంతకాలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్దిష్ట కాలవ్యవధిలో పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేయాల్సి ఉండగా, వల్లభనేని వంశీ వాటిని పూర్తి చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
KDP: చాపాడు(M పరిధిలోని పెన్నానదిలో ఫిల్టర్లు వేసుకుని వాటి నుంచి వచ్చే నీటి ఆధారం రజకులు జీవనం సాగిస్తున్నారు. తిప్పిరెడ్డిపల్లె,రాజుపాలెం,నరహరిపురం, వెదురూరుకు చెందిన రజకులు దుస్తులను పెన్నానదిలో ఫిల్టర్ల నీటి ఆధారంగా శుభ్రం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో దోబి ఘాట్ ఏర్పాటు చేస్తే సమస్యలు ఉండవని రజకులు కోరుతున్నారు.
NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం విడవలూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించనున్న వీపీఆర్ నేత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
పార్వతీపురం మండలం సంగంవలసలో ఈనెల 21 నుంచి శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. బ్రహ్మశ్రీ పుల్లే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. 21న విఘ్నేశ్వర పూజ, గ్రామ ప్రదక్షిణ, జలాధివాసం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి.
CTR: చిత్తూరు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు నేతృత్వంలో పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారులపై ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వాహన పత్రాలు, హెల్మెట్, మద్యం సేవించి డ్రైవింగ్పై తనిఖీలు చేస్తూ నేరాల నివారణకు చర్యలు చేపడుతున్నారు.
కోనసీమ: వేసవి శెలవుల్లో 18 ఏళ్లునిండిన విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఇందుకు వారి తల్లితండ్రులు పూర్తి సహకారం అందించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఆదివారం విజ్ఞప్తిచేశారు. parivahan.saradhi.gov.in లెర్నింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. DTO కార్యాలయంలో పరీక్షకు హాజరై లెర్నింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు.
ATP: రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.2.50 లక్షల వ్యయంతో నిర్మించిన త్రాగునీటి శుద్ధి జలకేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, MLA లు కాలవ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బందికి పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం అత్యంత ముఖ్యమని అన్నారు.
AKP: దేవరాపల్లి మండలం కె.ఎం.పాలెంలో తమరాన అప్పారావు(77) పురుగుమందు తాగి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సంతానం లేక మానసిక ఆవేదనతో బాధపడుతూ.. మద్యానికి అలవాటు పడ్డాడని ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం పొలంలో అపస్మారక స్థితిలో కనిపించగా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వెల్లడించారు.
TPT: బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో భారతీయ జనతా పార్టీ సంఘటన పర్వలో భాగంగా మండల అధ్యక్షుని ఎన్నిక జరిగింది. ఎన్నికల అధికారిగా జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్. ముని సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునికృష్ణయ్య తదితరుల సమక్షంలో కంచనపుత్తూరు గ్రామానికి చెందిన దాస్ గురునాథ్ను ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
GNTR: అరండల్పేటలోని వస్త్ర దుకాణంలో పని చేస్తున్న రాజస్థాన్కు చెందిన కిషన్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. ఇది హత్యేనని, యజమాని దానిని ఆత్మహత్యగా చూపిస్తున్నారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మెడపై ఉరి గుర్తులు లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
KRNL: ఇవాళ APలో ఎండలు బెంబేలెత్తించాయి. కర్నూలు(D) నగరడోనలో 45.4, కడప(D) ఖాజీపేటలో 44.5 డిగ్రీలు, చాలా చోట్ల 40 డిగ్రీల పై ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.
VZM: రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె. పట్టాభిరామ్ జిల్లా పర్యటనలో భాగంగా చీపురుపల్లి, రాజాం పట్టణాల్లో పర్యటించారు. ముందుగా చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
KDP: ముద్దనూరులో రౌడీ షీటర్లకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సి.ఐ నగేష్ ఆధ్వర్యంలో వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
W.G: తణుకులో వేంచేసిన కపర్దేశ్వర స్వామి వారిని ప్రముఖ చిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు తమన్ ఆదివారం దర్శించుకున్నారు. తణుకులో ప్రసిద్ధిగాంచిన కపర్దేశ్వర స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన దేవాలయాన్ని దర్శించుకోవడం ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నారు. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన తణుకు పట్టణానికి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
NDL: ఆళ్లగడ్డ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాతం బాల చెన్నయ్య (65) వడదెబ్బతో ఆదివారం మరణించాడు. గ్రామంలోని మామిడి తోటలో ఆయన కూలీగా పనిచేస్తూ జీవనం సాగించే వాడు. ఆదివారం పనులు చేసుకుని ఇంటికి వస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.