TPT: వడమాలపేట మండలంలో 20 కేజీల గంజాయి పట్టుకొని, నలుగురిని అరెస్టు చేసినట్లు పుత్తూరు DSP రవికుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్క్వాడ్, ఇతర సిబ్బంది వడమాలపేట మండలంలోని టీటీడీ స్థలాల సమీపంలో ఒక మోటార్ సైకిల్, స్కూటీని తనిఖీ చేయగా వారి వద్ద 20 కేజీల గంజాయి పట్టుబడినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలియజేశారు.