TPT: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి నివాసంలో గూడూరు జడ్పీటీసీ ఊటుకూరు యామిని మహేందర్ రెడ్డి, జగనన్న సేవా సమితి అధ్యక్షులు మహేందర్ రెడ్డిలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీ స్థితిగతులపై జగన్ వారితో చర్చించినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతమై విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.