SKLM: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రి అనిత నిర్వహించిన వీసీలో జేసీ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో సమీక్షా సమావేశాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.