ఏలూరులో బుధవారం ఐ.ఎఫ్.టి.యు నగర కమిటీ సమావేశం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. మున్సిపల్ ఆప్కాస్ ఉద్యోగులను పంజాబ్ తరహాలో పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును గౌరవించి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ, తక్షణమే వాటిని తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు.