E.G: గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకుడు వేగివాడ బాబీకి చెందిన పొలంలోని వాటర్ ట్యాంక్ ట్రాక్టర్, గెస్ట్ హౌస్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ హోం మంత్రి తానేటి వనిత బుధవారం బాబీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.