కృష్ణా: గుడ్లవల్లేరులో స్వచ్ఛ రథం నిరంతరం తిరుగుతూ ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తోంది. గ్రామ ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి స్వచ్ఛ రథానికి అందించాలని గ్రామపంచాయతీ అధికారులు సూచించారు. వీధులు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా స్వచ్ఛ రథానికి అందించాలన్నారు.