NLR: దగదర్తి మండలం చెన్నూరు సమీపంలోని కావలి కాలువలో ఈతకు వెళ్లిన ముగ్గురిలో ఒకరు గల్లంతైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఈత కొట్టేందుకు కాలువలోకి దిగిన ముగ్గురిలో, ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.