మధ్యాహ్న భోజనం అమితంగా కాకుండా మితంగా, పోషకాలతో నిండి ఉండాలి. భోజనానికి అరగంట ముందు, తిన్న గంట తర్వాతే నీళ్లు తాగాలి. అన్నంలో కూరగాయలు, పప్పు ఉండేలా చూసుకోవాలి. తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. టీ, కాఫీలకు దూరంగా ఉండి, మజ్జిగ తీసుకోవడం ఉత్తమం. సరైన సమయంలో భోజనం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.