మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చే 9 చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకతితో సమయం గడపడం, వ్యాయామం చేయడం, డీప్ బ్రీత్ తీసుకోవడం, నచ్చిన వారితో సమయం గడపటం, రోజులో కనీసం గంటపాటు ఫోన్కు దూరంగా ఉండటం, క్రియేటివ్ వర్క్ చేయడం, జీవితం మీకు లభించిన వాటిపై కృతజ్ఞత చూపించడం, ప్రశాంతంగా నిద్రపోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
వాటర్ ఫాస్టింగ్ అనేది 24 నుంచి 72 గంటల పాటు ఎలాంటి ఆహారం లేదా కాలరీల పానీయాలు తీసుకోకుండా కేవలం నీటినే తీసుకునే పద్ధతి. ఇటీవల కాలంలో ఇది ఒక ప్రముఖ ఆరోగ్య ట్రెండ్గా మారింది. బరువు తగ్గడం, మెటబాలిజం మెరుగుపరచడం కోసం చాలా మంది ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.
వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే చలవ చేసే పానియమే ఈ మారేడు పానకం. దీన్ని ఒడిశా ప్రజలు తమ సంవత్సరాది రోజున చేసుకుని తింటారు. పండిన మారేడు పండు లోపలి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకుని.. తగినన్ని నీళ్లు పోసి, చేతితో బాగా పిసికి 15-20min నానబెట్టాలి. పిసికిన మిశ్రమాన్ని వడపోయాలి. ఈ రసంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసి కరిగే వరకు కలుపుకుని సర్వ్ చేసుకోవచ్చు.
చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనానికి ముందు చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత, బాత్రూంకి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు కడగాలి. నిత్యం తాకే కీబోర్డు, మౌస్, డోర్ హ్యాండిల్స్ వంటి వస్తువులపై కంటికి కనిపించని ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి. కేవలం చేతులు కడగడం ద్వారా 50% వరకు అంటువ్యాధులను అడ్డుకోవచ్చు.
ఏకపాద శీర్షాసనం అనేది యోగాలో కష్టతరమైన, అధునాతనమైన భంగిమ. ఇది తలకిందులుగా ఉంటూ, ఒక కాలును తల వెనుకకు ఉంచే ఆసనం. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది భుజాలు, చేతులు, మెడ, వెన్నెముక కండరాలను బలపరుస్తుంది. పొత్తికడుపుపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ముఖానికి రక్తప్రసరణ పెరగడం వల్ల ముఖం మీద కాంతి పెరుగుతుంది.
ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్గా కనిపిస్తుంది. అయితే రోజూ పొద్దున్నే కరివేపాకు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తం శుద్ది, జుట్టు ఆరోగ్యం, చెడు కొలెస్ట్రాల్, రోగనిరోధక వ్యవస్థ, బరువు తగ్గడం, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కరివేపాకు ఉపయోగపడుతుంది.
కోసి ఉంచిన పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పండ్లను కోసిన వెంటనే గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి వాటిలోని కీలక పోషకాలు నశిస్తాయి. అంతేకాకుండా, ఎక్కువ సేపు బయట ఉంచిన ముక్కలపై బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ ముందే కోసి పెట్టుకోవాలనుకుంటే, వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి భద్రపరచుకోవడం ఉత్తమం.
కేక్ అతిగా తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదముంది. కేక్లో ఉండే మైదా, చక్కెరతో పాటు అదనపు క్రీమ్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట కేక్ తినడం తగ్గించాలి. పార్టీల్లో అప్పుడప్పుడు తిన్నా.. మితంగా తింటేనే ఆరోగ్యానికి మేలు.
వేసవి ఎండల నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి ఐస్ క్యూబ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. సాధారణ నీటికి బదులు పచ్చిపాలను ఐస్ క్యూబ్స్గా మార్చి చర్మంపై రుద్దితే చల్లదనంతో పాటు తేమ అంది చర్మం తాజాగా మారుతుంది. అలాగే ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ మిశ్రమంతో చేసిన క్యూబ్స్ వాడితే ఎండ వల్ల కలిగే ట్యాన్ తగ్గి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. రాత్రి పడుకునే ముందు వీటిని వాడటం మంచిది.
చాలామందికి జీతం పెరిగినప్పుడు దానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరిగిపోతుంటాయి. ఆర్థిక పరిభాషలో దీన్ని ‘లైఫ్ స్టైల్ క్రీప్’ అంటారు. అంటే మన ఆదాయం పెరిగే కొద్దీ, మనకు తెలియకుండానే మన జీవనశైలి ఖరీదైనదిగా మారిపోతుంది. పెరిగిన ఆదాయంతో ఖరీదైన ఫోన్లు, విలాసవంతమైన వస్తువుల మీద మొగ్గు చూపుతారు. ఈ అలవాట్లే క్రమంగా అవసరాలుగా మారి, పొదుపును అడ్డుకుంటాయి.
అధికంగా చెమట పట్టడం వల్ల డీహైడ్రేషన్ ముప్పు ఉంటుంది. అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. పచ్చిమిర్చి, మసాలాలు శరీర వేడిని పెంచుతాయి. కాబట్టి వీటిని తగ్గించాలి. టీ, కాఫీల్లోని కెఫీన్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. వీటిని నియంత్రించాలి.ఒత్తిడి తగ్గించుకోవాలి.గాలి తగిలేలా వదులైన కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం.
2023 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల మంది కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు ది లాన్సెట్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీ జర్నల్ తెలిపింది. ఈ సంఖ్య 1990తో పోలిస్తే 143 శాతం పెరిగినట్లు చెప్పింది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఊబకాయం వంటి కారణాలు దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. ఈ సమస్య కేవలం పెద్దల్లోనే కాకుండా యువతుల్లోనూ కనిపిస్తుందటం ఆందోళన కలిగించే అంశం.
వ్యక్తిగత విజయానికి స్పష్టమైన లక్ష్యం ముఖ్యం. లక్ష్యం లేని జీవితం దిశలేని నావలాంటింది. లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇలా ప్రయత్నించండి. లక్ష్యానికి కారణం ఏమిటి? అని ప్రశ్నించుకోండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో దానిని కాగితంపై రాసుకోండి. తర్వాత లక్ష్యాల సాధనను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అవసరమైతే సవరించుకోండి.
క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని బీటా-కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచగా, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇది రక్తపోటును నియంత్రించడమే కాకుండా శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
గుంజీలు కేవలం వ్యాయామం మాత్రమే కాదు. కూర్చోవడం, నిలబడడం, మెట్లెక్కడం వంటి కదలికలకు మూలాధారం. నిత్యం గుంజీలు తీస్తే కాళ్ల బలం మూడురెట్లు పెరుగుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెరస్థాయిలు మెరుగుపడటంతో పాటు ఎముకల సాంధ్రత పెరుగుతుంది. 10 ఏళ్లపాటు నిర్వహించిన రెండు అధ్యాయాల్లో శక్తివంతమైన కాళ్లు కలిగినవారి మెదడు ఆరోగ్యకరంగా, చురుగ్గా ఉంటుందని తేలింది.