ఎండాకాలంలో పైనాపిల్ను మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో 85% నీరు ఉండటం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. అయితే ఇది స్వల్పంగా వేడిని పెంచుతుంది కాబట్టి, అసిడిటీ రాకుండా మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా, పుష్కలమైన ‘విటమిన్-C’ కూడా అందుతుంది.
వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ వేడి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ముఖ్యంగా గొడుగు, టోపీ లేదా ముఖానికి కాటన్ రుమాలు చుట్టుకోవడం వల్ల సూర్యరశ్మి నేరుగా చర్మంపై పడకుండా ఉంటుంది. కళ్ల రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ వాడాలి. ఈ చిన్నపాటి రక్షణ కవచాలు వడదెబ్బ తగలకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మ్యూజిక్ థెరపీ ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇచ్చే ఉత్తమ మార్గం. మెలోడీలు లేదా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వింటే మెదడులో ఆల్ఫా వేవ్స్ ప్రేరేపితమై, మనసు ప్రశాంతంగా మారుతుంది. రక్తపోటు తగ్గుతుంది. ఇది ఆందోళన, డిప్రెషన్ను దూరం చేసి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. నిద్రపోయే ముందు స్మూత్ సంగీతం వింటే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. సంగీతం మనసుకి మంచి ఔషధంలా పనిచేస్తుంది.
తులసి ఆకులు సహజమైన యాంటీ బయోటిక్గా పనిచేస్తాయి. రోజూ ఉదయం 2-3 ఆకులు తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, రక్తాన్ని శుద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
భోజనం తర్వాత సోంపు తినడం కేవలం నోటి తాజాదనం కోసమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు. దీనిలోని కార్మినేటివ్ లక్షణాలు జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి, ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా సోంపు తీసుకోవడం మంచి అలవాటు అని నిపుణులు చెబుతున్నారు.
వేసవి ఎండల తీవ్రత వల్ల పిల్లలు డీహైడ్రేషన్కు గురికాకుండా రోజంతా తగినంత మంచి నీరు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఇస్తుండాలి. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉండే ఉ.10 నుంచి సా.4 గంటల వరకు పిల్లలను బయట తిరగనివ్వకూడదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే టోపీ లేదా గొడుగు వాడాలి. ఆయిల్ ఫుడ్ కాకుండా పెరుగు, మజ్జిగ వంటి చలువ చేసే ఆహారాన్ని అందించడంతో వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
అరిటాకులో భోజనం కేవలం సంప్రదాయమే కాదు, ఒక అద్భుత ఆరోగ్య రహస్యం. ఇందులో ఉండే పాలీఫినాల్స్ సహజ యాంటీ ఆక్సిడెంట్లను అందించి ఆహారాన్ని శుద్ధి చేస్తాయి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హానికర బ్యాక్టీరియాను చంపి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తూ ఆకలిని పెంచుతాయి. రసాయనాలు లేని ఈ పర్యావరణహిత పద్ధతి సంపూర్ణ ఆరోగ్యానికి సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు కనీసం 10 నిమిషాలు మెట్లెక్కితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్త ప్రసరణ మెరుగుపడి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. వేగంగా క్యాలరీలు ఖర్చయి బరువు తగ్గుతారు. కాళ్లు, తుంటి, పొత్తికడుపు కండరాలు దృఢంగా మారుతాయి. శక్తి సామర్థ్యం పెరుగుతుంది. ఎముకల సాంద్రత పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. క్రమం తప్పకుండా మెట్లెక్కడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
TG: HYD నగరవాసులు ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆన్లైన్ జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ వెజ్ వీక్, నో అవుట్ సైడ్ ఫుడ్ వంటి కొత్త పద్ధతులను పాటిస్తున్నారు. ముఖ్యంగా యువత ఇంటి భోజనానికే ప్రాధాన్యతనిస్తోంది. ఆఫీసుల్లో సహోద్యోగులందరూ కలిసి హోమ్ ఫుడ్ డేస్ నిర్వహించడం ఇప్పుడు నగరంలో ఒక సరికొత్త ఫిట్నెస్ ట్రెండ్గా మారింది.
చాలామందికి కాఫీతోనే రోజు ప్రారంభమవుతుంది. కాఫీ వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచి అలసటను తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి బ్లాక్ కాఫీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మెటాబాలిజాన్ని పెంచి శరీరంలో నిల్వైన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
జిమ్కి వెళ్లలేకపోయినా రోజుకు 20 నిమిషాలు ఇంట్లోనే వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీనివల్ల ఎండార్ఫిన్లు విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి.. మధుమేహం వంటి వ్యాధుల ముప్పును తగ్గించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. శారీరక దృఢత్వంతో పాటు మెరుగైన మూడ్ సొంతమవుతుంది.
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు నౌకాసనం ఉత్తమమైనది. నేలపై వెల్లకిలా పడుకుని గాలి పీలుస్తూ కాళ్లు, ఛాతి భాగాన్ని ఒకేసారి గాలిలోకి లేపి చేతులను మోకాళ్లకు సమాంతరంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పొట్ట కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగి అక్కడ పేరుకున్న కొవ్వు కరుగుతుంది. ఇది బరువు తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వెన్నెముకను దృఢంగా మార్చడంలో కూడా తోడ్పడుతుంది.
కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్.. *చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.
వ్యాధి రాకుండా ముందుగా వేసుకునేది వ్యాక్సిన్. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్లతో పోరాడుతుంది. అదే ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత నయం చేయడానికి వాడేవి మందులు. టీకాలను వైరస్ లేదా బ్యాక్టీరియా జన్యువుల నుంచి తయారు చేస్తారు. మెడిసిన్స్ను రసాయనాలతో రూపొందిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యాక్సిన్ నిరోధిస్తుంది, మెడిసిన్ చికిత్స చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఉదయం టీ/కాఫీలో చక్కెర బదులు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవడం లేదా దాల్చిన చెక్క పొడి కలిపిన నీళ్లు తాగడం మంచిది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపించడం ద్వారా ఉబ్బరం, గ్యాస్, అజీర్ణాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.