జీవితంలో ఆనందం, సంతృప్తి, ఆరోగ్యం పొందడానికి ఎలాంటి ప్రత్యేక ప్రతిభ అవసరం లేని కొన్ని పనులు ఉన్నాయి. ఇతరుల పట్ల దయగా ఉండటం, నిజాయితీతో జీవించడం, మనస్ఫూర్తిగా నవ్వడం, స్నేహితులతో గడపడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరిగా నిద్రపోవడం, ఆటలాడటం.. ఈ పనులను చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వీటిని పాటించిన వారికి ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి గ్యారంటీగా దక్కుతాయి.
బంగాళాదుంపలు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సమస్యలతోపాటు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అయితే, బంగాళాదుంపలను ఫ్రై లాగా వండుకుని తినడం.. అదేవిధంగా చిప్స్లా తినడం అంత మంచిది కాదు. దీనివల్ల అధిక రక్తపోటు, బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు వీటిని తినకపోవడం ఉత్తమం.
దొండకాయలను తింటే పొటాషియం అధికంగా లభిస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. హైబీపీ ఉన్నవారికి దొండకాయలు ఎంతో మేలు చేస్తాయి. రక్తహీనత తగ్గుతుంది. గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. నీరసం, అలసట తగ్గిపోతాయి. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఇవి పనిచేస్తాయి. దొండకాయలను రోజూ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
చలికాలంలో ఎక్కువగా జలుబు, ఫ్లూ వస్తుంటాయి. కొన్ని టిప్స్ వాడడంతో వాటిని దూరం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. జలుబు, గొంతు నొప్పి వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి రిలాక్స్ అవ్వాలంటే.. గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి రోజుకు మూడు సార్లు గార్గిలింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు తగ్గడంతో పాటు వైరస్లు చనిపోయే అవకాశాలు ఉన్నాయి.
మఖానా ఉదయాన్నే తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం అధికంగా ఉంటాయి. రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తక్షణ శక్తిని అందిస్తాయి. కొవ్వు తక్కువగా, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉండటంతో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.2. గుండె జబ్బులను దూరం చేస్తుంది.3. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.5. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.6. కంటి చూపును మెరుగరుస్తుంది.7. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
చలికాలంలో చర్మ సమస్యలను తగ్గించుకోవడం కోసం కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. సువాసనగల సబ్బులు వాడటం తగ్గించాలి. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండటం కోసం మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పెదవులకు లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. అంతేకాదు రోజుకు సరిపడా నీరు త్రాగాలి. పండ్లు, కూరగాయలు తినాలి.
బాత్రూమ్లో స్నానం చేసేటప్పుడు లైట్ ఆఫ్ చేసుకోండి. అంటే చీకట్లో స్నానం చేయడం అన్నమాట. దీన్నే ‘డార్క్ షవరింగ్’ అంటారు. చీకటిగా ఉన్నప్పుడు చుట్టూ ఏమున్నాయన్న స్పష్టత ఉండదు. ట్యాప్లు, సబ్బు అన్నింటినీ తడిమి చూసుకోవాల్సిందే. దృష్టంతా స్నానం మీదే ఉంటుంది. ఇక వేరే ఆలోచనలకు తావుండదు. అంటే మైండ్ ఫుల్గా స్నానం చేస్తామన్నమాట. ఈ క్రమంలో ఒత్తిడి దూరమవుతుందట.
సాధించిన దానితో సంతృప్తిపడటం అనేది చేతకానివారి పని. మనిషి ఇంకా సాధించాలనే పట్టుదలతో పనిచేయాలి. జీవితంలో చివరి రోజు వరకూ అదే పట్టుదల కొనసాగాలి. ఆకాశానికి హద్దు ఎలా ఉండదో మన లక్ష్యాలూ అలాగే ఉండాలి. అవి సాధించేందుకు అడ్డదారులు తొక్కకూడదు. మంచి ఆలోచనలు, సామర్థ్యంతో శ్రమించాలి.
బీర్ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మితంగా తాగేవారిలో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని, రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నాయి. బీరులో ఉండే డైటరీ సిలికాన్ ఎముకలను బలోపేతం చేస్తాయని తేలింది. అలాగే, ఇది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొన్నాయి.
డార్క్ చాక్లెట్స్ను క్రమం తప్పకుండా మోతాదులో తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఒత్తిడి తగ్గించి మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. శరీర నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో అల్పాహారం తీసుకోవాలి. ఉదయం 10 తర్వాత అల్పాహారం తినకుండా ఉండాలి. ఉదయం భోజనం శరీరానికి రోజంతా పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల మధ్య భోజనం చేయాలి. అల్పాహారం, భోజనం మధ్య 4 గంటల విరామం ఉండాలి. దీనివల్ల మొదటి భోజనం సరిగ్గా జీర్ణమవుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఏమీ తినకూడదు. తిరిగి రాత్రి 6 నుంచి 8 గంటల మధ్య తినడం […]
రాస్ బెర్రీస్లో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. మెదడు, కంటి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
జామపండును ఖాళీ కడుపుతో తింటే దాని ఫైబర్, సహజ ఎంజైములు పేగులను శుభ్రం చేస్తాయి. పేగు కదలికను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఉదయం క్రమం తప్పకుండా జామపండు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. రోగ నిరోధకశక్తిని బలపరుస్తుంది. జలుబు, ఫ్లూ, అలసట వంటి కాలానుగుణ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
రాగి పాత్రలో నీళ్లను తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కిడ్నీ సమస్యలను దూరం చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. అయితే రాగి పాత్రలో నీటిని 6-7 గంటలపాటు నిల్వ చేసి తాగితే మంచిది.