గొప్పగా ఎదగాలనుకునేవాళ్లు అవకాశం రాగానే ఆగిపోరు. వాళ్లకు వాళ్ల ఊహే హద్దుగా ఉంటుంది. ఇతరులు ‘అసాధ్యం’ అనుకునే అడ్డుగోడలు, నిజానికి వాళ్ల సొంత భయాలు, ఆలోచనలే. మీరు ఏదైనా ఒక పనిని చేయలేమని అనిపించినప్పుడు, ‘ఎందుకు చేయలేము? అని ప్రశ్నించడం మొదలుపెట్టండి. మీ పురోగతి అక్కడి నుంచే మొదలవుతుంది. ప్రతి అడ్డంకినీ ప్రశ్నించండి, అదే విజయానికి తొలి మెట్టు.
TG: రాష్ట్ర ప్రజలు తినే ఫుడ్లో 67 శాతం అన్నమే ఉంటుందని ఓ అధ్యయనం తేల్చింది. నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం రోజూ 2 వేల క్యాలరీల ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కేవలం 50 శాతం లోపు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం మొత్తం ఫుడ్లో 70 శాతం మేర కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయని వెల్లడించింది. దీంతో షుగర్, గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిపింది.
బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని నైట్రేట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే, శారీరక శక్తిని పెంచడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. ఈ జ్యూస్లోని బీటాలైన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్రం చేయడంలో, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.
పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని జమ్మి చెట్టుపై వాళ్లు దాచిన ఆయుధాలను తీసుకొని వచ్చేటప్పుడు దసరా రోజు వారికి మొదట పాలపిట్ట కనిపించిందట. ఆ తర్వాత కౌరవులతో జరిగిన యుద్ధంలో పాండవులు గెలుపొందుతారు. అందుకే దసరా పర్వదినం రోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేసి అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకుంటారు.
మనం ఒక చిన్న మార్పుతో బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు వంటల్లో వాడే సాధారణ ఉప్పుకు బదులు ఉప్పు ప్రత్యామ్నాయాలను వాడాలి. అంటే సోడియం క్లోరైడ్ స్థానంలో పోటాషియం క్లోరైడ్ ఉపయోగించాలని పరిశోధకులు చెబుతున్నారు. దీంతోపాటు BP ఉన్నవారు తులసి, ఒరేగానో, జీలకర్ర, పసుపు, మిరపకాయ వంటివాటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగించాలి. నిమ్మ, నారింజ రసం ఎక్కువగా తాగాలి.
సద్దుల బతుకమ్మ రోజు రెండు బతుకమ్మలు చేస్తారు. ఎందుకంటే.. ఆడబిడ్డకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేటప్పుడు తోడుగా మరొకరిని పంపుతారు. అచ్చు అలాగే బతుకమ్మని కూడా సాగనంపుతారు. అంతేకాకుండా పెద్ద బతుకమ్మను తల్లిగా, చిన్న బతుకమ్మను కూతురుగా భావించి పాటలు పాడుతూ పండుగను జరుపుకుంటారు.
W.G: పెనుమంట్రలో ఇవాల ఎన్సీడీ 4.0 కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ వ్యాధుల లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారికి పలు వైద్య పరీక్షలు చేసి ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే తమని సంప్రదించాలని ఏఎన్ఎం భాగ్య కుమారి సూచించారు. మీకు ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య ఉన్న మాకు తెలియాపర్చాలని భాగ్య కుమారి తెలిపారు.
గ్రీన్ యాపిల్స్లో అనేక పోషకాలు ఉంటాయని, రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది. డయేరియా నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది.
W.G: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో పూలపల్లి నుంచి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్స్ ఉదయ మోహన్, అహమ్మద్ మాట్లాడుతూ.. ప్రజలందరూ హృదయ సంబంధం వ్యాధుల నివారణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతిమనిషి రోజుకు 10 వేల అడుగులు వేయడం వలన గుండె వ్యాధులను అరికట్టవచ్చన్నారు.
ఉదయం 7 నుంచి 11గంటల మధ్యలోనే హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశముందని పలు అధ్యయానాల్లో వెల్లడైంది. అయితే ఉదయం నిద్రలేచినప్పుడు బ్లడ్ ప్రెజర్ ఒక్కసారిగా పెరుగుతుంది. స్ట్రెస్ హార్మోన్గా పిలుచే కార్టిసాల్ కూడా ఉదయం పూట ఎక్కువగా విడుదలవుతుంది. ఈ హార్మోన్ విడుదలయ్యే కొద్దీ బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో గుండెకి రక్త సరఫరా జరగక హార్ట్ ఎటాక్ వస్తుంది.
చాలా మంది మార్కెట్కు వెళ్లిన ప్రతిసారీ తమకు ఇష్టమైన కాయగూరలను మాత్రమే కొనుక్కొని వస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందాలంటే అన్ని రకాల కూరగాయలనూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక మీదట మీరు మార్కెట్కు వెళ్లినప్పుడు ఇంతవరకూ రుచి చూడని కాయగూరలను ఇంటికి తెచ్చుకోండి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన బ్రకోలీ ఇటలీకి చెందిన క్యాబేజీ వంటి ఆకుకూర. దీనిని అక్కడ 2000 సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. బ్రకోలీలో ఉండే సహజసిద్ధమైన సల్ఫోరాఫేన్ సమ్మేళనం క్యాన్సర్ కణితులపై పోరాడుతోంది. అంతేకాకుండా బ్రకోలీలో అధికస్థాయిలో ఉండే సీ, కే విటమిన్లు రోగనిరోధకశక్తిని అందించడంతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఒత్తిడిని దూరం చే...
ముఖంపై పిగ్మంటేషన్, ముడతలతో ఇబ్బంది పడేవారు రాత్రి పడుకునే ముందు బాదం ఆయిల్తో ముఖానికి మసాజ్ చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారడంతో పాటు చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. బాదం నూనెలోని జింక్ మొటిమలను తగ్గిస్తుంది. దీనిని ఫేస్ప్యాక్, మాస్క్లో కూడా కలిపి వాడొచ్చు. అయితే అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాను పాటించకపోవడమే మంచిది.
శొంఠి పొడి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ సిక్నెస్తో బాధపడేవారు రోజూ శొంఠి టీ తాగితే మంచిది. మహిళల నెలసరి నొప్పులకు చెక్ పెడుతుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇమ్యూనిటినీ పెంచుతుంది. కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.