ఫోన్ ఛార్జ్ చేసేందుకు కంపెనీ ఛార్జర్ అయితే చాలా మంచిది. నాసిరకం ఛార్జర్ ఉపయోగిస్తే ఫోన్ లేదా ఛార్జర్ కాలిపోయే ప్రమాదం ఉంది. తప్పని పరిస్థితుల్లో సాధారణ ఛార్జర్లు ఉపయోగించాల్సి వస్తే.. వాటితో వందశాతం ఛార్జ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే 100 శాతం ఛార్జ్ చేస్తే.. పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వైట్ బ్రెడ్లో గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెరస్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ బ్రెడ్ మంచిది కాదు. ఈ బ్రెడ్ తరచూ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే, వైట్ బ్రెడ్కు బదులుగా బ్రౌన్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ బ్రెడ్ తింటే మంచిది.
చలికాలంలో వ్యాయామం చేసేవారు తప్పనిసరిగా కొన్ని రూల్స్ పాటించాలి. వ్యాయామానికి ముందు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు వార్మప్ చేస్తే గాయాలు కాకుండా నివారించవచ్చు. పొరలు పొరలుగా దుస్తులు ధరించడం, వ్యాయామం చేసేటప్పుడు శరీరం వేడెక్కుతుంది. అందుకే ఉష్ణోగ్రతకు అనుగుణంగా తీసివేయడానికి వీలుగా పలుచని దుస్తులు ధరించాలి. లోపలి పొర చెమటను పీల్చుకునే విధంగా ఉండాలి.
ప్రతి ఏడాది నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డే నిర్వహిస్తారు. డయాబెటిస్ ఉంటే శరీరంలో ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటంటే..తరచుగా మూత్ర విసర్జన, అసాధారణంగా దాహం, ఆకలి, బరువు తగ్గడం, గాయాలు నెమ్మదిగా నయమవ్వడం, అలసట, బలహీనత, దృష్టి మసకబారడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు.
ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టినప్పుడు BPA, థాలేట్స్ వంటి హానికర కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి ఆహారంలో కలిసి శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యలు వస్తాయి. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. జీర్ణ, శ్వాసకోశ, పునరుత్పత్తి వ్యవస్థలపై ప్రభావం పడుతుంది.
వైట్ బ్రెడ్ను అతిగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తరచూ తింటే టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతారు. అధిక బరువు పెరుగుతారు. ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు మలబద్ధకం, జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే వైట్ బ్రెడ్ను మితంగా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కళ్లు తిరగడం, బలహీనపడటం వంటి సమస్యలు వస్తాయి. మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల మధ్యాహ్నం భోజనం అధికంగా తినడం వల్ల బరువు పెరిగే ఛాన్స్ ఉంది. అల్సర్, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. తీవ్రమైన తలనొప్పి, చికాకు, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
ప్రతిరోజు ఉదయం యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం యోగా చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిక్గా ఉంటారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. అధిక రక్తపోటు తగ్గుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి.
చాలామందికి రాత్రి భోజనం చేశాక ఐస్క్రీమ్స్, స్వీట్స్ను ఇష్టంగా తింటారు. అయితే వాటిలో ఉండే చక్కెర, కొవ్వు పదార్థాల వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఫ్రైడ్ఫుడ్స్ తినడం వల్ల గుండెల్లో మంట, అజీర్ణానికి కారణమవుతుందన్నారు. దీంతో నిద్రలేమి సమస్యకు దారి తీస్తుందని, అందుకే ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండాలంటన్నారు.
జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. రోజూ 30 నిమిషాల పాటు ఉదయం, సాయంత్రం యోగా చేయడం ద్వారా షుగర్ నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. యోగా ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను పెంచుతుంది.
లావు తగ్గడానికి కొంతమంది తక్కువగా తింటూ ఆకలితో కడుపు మాడ్చుకుంటారు. కానీ, ఇలా చేస్తే ఫలితం ఉండదు. తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. చిరుతిళ్లను ఇష్టంగా తింటూ ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని భుజించరు. ఇది సరైన పద్ధతి కాదు. సరైన ఆహారాన్ని తీసుకుంటే, శరీరంలో కొవ్వును కరిగిండం సులువవుతుంది.
పెద్ద పేగు క్యాన్సర్ 50-60 ఏళ్ల పైబడినవారికే వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే యువత కూడా ఈ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడి, జన్యు లోపాలు 20 ఏళ్లకే ఈ క్యాన్సర్కు దారితీస్తాయని వివరిస్తున్నారు. ఈ క్రమంలో పేగు సమస్య, అలసట, ఒక్కసారిగా బరువు తగ్గడం జరిగితే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
అల్లం, బెల్లం మిశ్రమాన్ని రోజూ తింటే గొంతు, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో ఉండే కఫం కరిగిపోతుంది. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే, గొంతు సమస్యలు సైతం తగ్గిపోతాయి. గొంతులో నొప్పి, మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ రెండింటి మిశ్రమం శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. చల్లని వాతావరణం, చలికాలంలో ఈ మిశ్రమాన్ని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది.
చలికాలంలో వ్యాయామం చేయడం మానొద్దు. యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయాలి. ఉదయం లేచి ఒక గ్లాసు వేడినీరు తాగాలి. ధ్యానం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీర ఉష్ణోగ్రత, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వృద్ధులు, పిల్లలు చలిని తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో వేడిని ఎక్కువగా కోల్పోకుండా కాపాడుకోవాలి.
✦ ఎక్కువ చదవటం అలవాటు చేసుకోవాలి✦ ఇండెక్స్ ఫండ్లలో దీర్ఘకాల మదుపు చేయాలి✦ మీ నైపుణ్యాల మెరుగుదలకు ఖర్చు పెట్టాలి✦ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి✦ అనుభవ సాధనకు డబ్బు వెచ్చించాలి✦ తరచూ ఇళ్లు మారకుండా ఒకే ఇంట్లో ఎక్కువ కాలం నివసించాలి