వేడి నీటితో స్నానం చేయడం పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం సహజ తేమ తొలిగిపోయి.. చర్మం పొడిబారిపోతుంది. చికాకు, దురద, పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లతో స్నానం చేస్తే.. గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది. శరీరం బలహీనంగా మారుతుంది. తల తిరిగటం, డీహైడ్రేషన్, వికారం, మూర్ఛ వంటి సమస్యలు వస్తాయట. శరీర ఉష్ణోగ్రత పెరిగి, బీపీ...
చలికాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ఈ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. సీజనల్ వ్యాధుల భారీనా పడకుండా ఉండాలంటే ప్రతి రోజు ఉదయం గోరువెచ్చటి నీటిలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ఉండటమే కాకుండా లివర్ను క్లీన్ చేస్తుందట. అలాగే మలబద్దకాన్ని దూరం చేయడంతో పాటు రోజంతా యాక్టీవ్గా ఉండేలా చేస్తుందని నిపుణ...
చలి నుంచి ఉపశమనం కోసం చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు సాక్సులు వేసుకుంటారు. సాక్సులు వేసుకోవడం వల్ల పాదాలు వెచ్చగా, హాయిగా ఉంటాయి. దీంతో నిద్ర హాయిగా పడుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. అయితే తడి సాక్సులు వేసుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. సాక్సులు తడిగా ఉంటే బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. అందుకే చెమటతో తడిసిన సాక్సులు కూడా వేసుకోకూడదు.
ప్రస్తుతం భారతదేశంలో చాలా కంపెనీల్లో వారానికి 48 గంటల పనివిధానం ఉంది. వారానికి 6 రోజుల పని ఉంటే.. రోజుకు 8 గంటలు పనిచేస్తున్నట్లు. దీనికే ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మరి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పినట్లు వారానికి 70 గంటలు అంటే రోజుకు 12 గంటలు పనిచేయాలి. మరి పర్సనల్ లైఫ్ ఏది? అంటే జీవితాంతం ఉద్యోగం చేయడానికి పుడుతున్నట్లా..? అని త్రినాథ్ బండారు అనే నిపుణుడు అంటున్నారు. మరి మీరేమంటారు..?
✦ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.✦ జీర్ణశక్తి మెరుగుపడుతుంది.✦ శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.✦ గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది.✦ శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది.✦ కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది.✦ ఒత్తిడి, ఆందోళన దూరమవుతుంది.
అందంగా కనిపించేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సౌందర్య ఉత్పత్తులు వాడటం, చికిత్సలు చేయించుకుంటారు. అయితే సహజ పద్ధతుల్లో అందాన్ని పెంపొందించుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు, అధికంగా చాక్లెట్లు తింటే చర్మంపై ముడతలు వస్తాయి. ఆయిల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల మొటిమలు ఏర్పడతాయి. పాస్తా, వైట్ బ్రెడ్, కేక్స్, ఉప్పు వంటివి మిత...
1. ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది.2. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.3. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.4. అధిక బరువును కంట్రోల్ చేస్తుంది.5. డయాబెటిస్ను అదుపులో ఉంచుతుంది.6. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.7. అధిక బరువును నియంత్రిస్తుంది.
MDK: జోగిపేట ఏరియా ఆసుపత్రిలోని వైద్యులు బుధవారం అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. మూడు రోజుల క్రితం కామారెడ్డికి చెందిన కుమ్మరి రాజు బైక్ నడుపుతూ అన్నాసాగర్ వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి ఎడమ మోకాలి వద్ద ఎముక విరిగింది. ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నాయక్ విరిగిన ఎముకను అతికించే శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశామని తెలిపారు.
శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. జలుబు చేసినప్పుడు ముక్కు బ్లాక్ అయిపోయి శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కర్పూరంలో కాస్త కొబ్బరినూనె కలిపి వాసన చూడాలి. ఆరోమా ఆయిల్స్ లేదా విక్స్ బామ్ వేడినీటిలో వేసి ఆవిరి పట్టాలి. యూకలిప్టస్ ఆయిల్ కూడా ముక్కుదిబ్బడ సమస్యను తగ్గిస్తుంది. చిన్నపాటి శ్వాస సంబంధిత వ్యాయామాల...
మెదక్ జిల్లా వైద్యశాలలో దివ్యాంగులకు ఈనెల 20వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 9 మంది అనుభవజ్ఞులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో వారికి చెప్పడం జరిగిందన్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NZB: మోస్రా మండల కేంద్రానికి చెందిన శారదకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు.108 సిబ్బంది అంబులెన్సులో తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రసవించింది. అంబులెన్సు సిబ్బంది ప్రసవం చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. తల్లి బిడ్డలను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు టెక్నీషియన్ లలిత తెలిపారు.
నల్ల శనగలను ఉడకబెట్టి రోజుకూ కప్పు మోతాదులో తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. సాయంత్రం స్నాక్స్ రూపంలో తింటే రాత్రి ఆహారం తక్కువగా తింటారు. కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో శరీరానికి చేరే క్యాలరీల శాతం తగ్గుతుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారికి నల్ల శనగలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. షుగర్ ఉన్న వారికి ఇవి చక్కని ఆహారం అని ...
ఇటీవల కాలంలో చిన్న వయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న పని ఒత్తిడి, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ముడతలని తగ్గించాలంటే పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్ A, C, E, K.. మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూరను తినాలి. అవకాడో, పప్పుధాన్యాలని ఆహారంలో భాగం చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగి.. మచ్...
కొందరు పిల్లలు సరిగా చదవరు. మరికొందరికి చదివింది సరిగా గుర్తుండదు. ఒత్తిడి, మానసిక అలసట దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే తులసి పొడిని స్మూతీస్ లేదా వేడి పాలలో కలిపి పిల్లల చేత తాగిస్తే ఏకాగ్రత పెరుగుతుందని సూచిస్తున్నారు. పెప్పర్ మింట్లు, మింట్ ఆయిల్, పుదీనా ఆకులు చదివింది మరచిపోకుండా ఉపయోగపడతాయట. రోజ్మేరీ ఆయిల్ సువాసన మానసిక అలసటను దూరం చేస్తుంది. అయితే దీన్ని మితంగా వాడాలి.
మెనోపాజ్ దశలో ఎదురయ్యే పలు అనారోగ్యాల్లో దంత సమస్య కూడా ఒకటి. అయితే మెనోపాజ్ దశకు చేరుకున్న 50 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీన్ని అధిగమించాలంటే కాల్షియం, డి-విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడాలి. రోజులో రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరి. నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి.