వేసవి ఎండలతో కిడ్నీలకు ముప్పు పొంచి ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల శరీరం చల్లబడటానికి రక్తం చర్మం వైపు మళ్లుతుంది, దీనివల్ల కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గి (రీనల్ హైపోపెర్ఫ్యూజన్) అవి దెబ్బతింటాయి. డీహైడ్రేషన్తో విషతుల్యాలు పేరుకుపోయి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు (CKDu) దారితీయవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, ఎండలో పనిచేసేవారు, మధుమేహం ఉన్నవారు అప్రమత్తంగా ఉండి తగినంత నీరు తాగాలి.