KMR: ఎర్రకందులైనా.. తెల్ల కందులైనా మద్దతు ధర కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలని FPO ఛైర్మన్ గోపాల్ రైతులకు సూచించారు. శుక్రవారం మద్నూర్ మార్కెట్ యార్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. NCCF ద్వారా మద్నూర్ FPO ఆధ్వర్యంలో కొనసాగుతున్న మద్దతు ధర కేంద్రంలో కంది పంటను అమ్ముకుని క్వింటాలుకు రూ.8000 మద్దతు ధర పొందాలని సూచించారు.