కృష్ణా: విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం కోడూరు మండలం బడేవారిపాలెంకు చెందిన సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ బడే కిషోర్ బాబు రూ. 7లక్షలు వ్యయంతో బడేవారిపాలెం జడ్పీ హైస్కూల్, ఉల్లిపాలెం జడ్పీ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్లను ప్రారంభించారు.