సాయంత్రం 4-5 గంటల మధ్యలో ఆకలి వేయడం సహజం. ఈ సమయంలో చాలామంది సమోసాలు, బిస్కెట్లు వంటి జంక్ ఫుడ్ తింటారు. దీంతో కొవ్వు, గ్యాస్ సమస్యలు వస్తాయి. వాటికి బదులు బాదం, వాల్నట్స్, వేయించిన శనగలు, పండ్లు తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్లు అందించి ఆకలిని తీరుస్తాయి. ఈ ఆరోగ్యకరమైన అలవాటు బరువును నియంత్రించడమే కాకుండా, రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది.