కుండ నీరు శరీరానికి చలువ చేస్తాయి. మట్టి కుండలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా గాలి ప్రసరించి, నీరు సహజంగానే చల్లబడుతుంది. ఇక ఈ నీరు తాగడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో మంట, అజీర్తి సమస్యలతో బాధపడేవారికి మట్టి కుండ నీరు గొప్ప వరం. శరీరంలోని మెటబాలిజం రేటు పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.