• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

కుష్టు వ్యాధి నివారణపై రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం

NLR: రాష్ట్రంలో క్షయ వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా అడిషనల్ DMHO, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ జిల్లా సిబ్బందితో హాజరయ్యారు. క్షయ సర్వే ద్వారా బయటపడుతున్న కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష జరిగింది.

December 18, 2024 / 11:17 AM IST

నెల్లూరులో జికా వైరస్ కలకలం

నెల్లూరులో జికా వైరస్ కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడుకి జికా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దాంతో ఆ బాలుడిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైరస్ నిర్ధారణ తర్వాత బాలుడిని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

December 18, 2024 / 09:37 AM IST

లవంగాలు తింటే కలిగే లాభాలు

1. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.2. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.3. గ్యాస్, అసిటిడీ వంటి సమస్యలను దూరం చేస్తాయి.4. కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తాయి.5. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.6. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.7. కండరాల నొప్పులు, పంటి సమస్యలు తగ్గుతాయి.8. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

December 18, 2024 / 08:30 AM IST

చలికాలం పపాయ తింటే ఎంతో మేలు

చలికాలం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే బొప్పాయి పండు తింటే మంచిది. పపాయను ఈ సీజన్‌లో తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదు. పరిగడుపున దీన్ని తినడవ వల్ల సంపూర్ణ పోషణ అందుతుంది. మలబద్దకం, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, జ్వరం, దగ్గను ధరిచేరనీయదు.

December 18, 2024 / 06:45 AM IST

ఈ టిఫిన్స్ తిని టీ తాగుతున్నారా?

ప్రతి రోజు ఉదయం చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. మరికొందరు పరిగడుపునే తాగేస్తుంటారు. అయితే కొన్ని రకాల టిఫిన్స్ తిన్న తరువాత వీటిని తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. పరాఠాలు తిన్న వెంటనే టీ, కాఫీ తాగవద్దు. ఇలా చేయడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. వైట్ బ్రెడ్, అరటి పండ్లు తిన్న వెంటనే వీటిని సేవిస్తే షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

December 18, 2024 / 05:23 AM IST

ఈ సమస్యలు ఉన్న వారికి ఉసిరి విషం!

చలికాలం ఉసిరి తింటే సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ఉంటాం. అయితే షుగర్ లెవల్స్ తక్కువ ఉన్నవారు, లో బీపీ ఉన్నవారు, జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, డీ హైడ్రేషన్ సమస్యలు ఉన్నవారు ఉసిరి అధికంగా తీసుకోవద్దట. అలా చేయడం వల్ల బీపీ, షుగర్ లెవల్స్ మరింత తగ్గడం, మూత్ర విసర్జన అధికంగా జరిగి డీహైడ్రేషన్ భారీనపడటం, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలు అధికమవుతాయట.

December 18, 2024 / 05:03 AM IST

చలికాలంలో ఇలా చేయండి..?

చలికాలంలో పొడిగాలి కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్ వ్యాప్తి చెంది గొంతు నొప్పి పెడుతుంది. గొంతులో గరగర, ఇతర ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. దీన్ని తగ్గించాలంటే.. వేడి టీలో కాసింత తేనె లేదా వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. లేకపోతే గోరువెచ్చని నీటిలో ఉప్పు లేదా బేకింగ్ సోడా కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. రోజూ ఒకటి, రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమలాలి, ఆవిరి పీల్చుకోవాలి.

December 17, 2024 / 09:35 PM IST

వృద్ధాప్యంలో మతిమరుపు రాకూడదంటే..?

మతిమరుపు, పార్కిన్సన్స్ లాంటి నరాల వ్యాధులు వృద్ధాప్యంలో రాకుండా ఉండటానికి ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజిస్ట్ ప్రియాంక సూచనలు చేశారు. ఏ వయసువారైనా బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఖాళీ కడుపుతో ఉండకూడదన్నారు. బ్రేక్ ఫాస్ట్ లేకుంటే రోగనిరోధక శక్తి తగ్గి, తలనొప్పి, ఇతర నరాల సమస్యలు వస్తాయన్నారు. నిద్రలేమి కారణంగా మెదడులో కణాలు క్రమంగా నశిస్తాయని, కనీసం 7-8 గంటలు నిద్రపోవాలని, రోజూ అరగంటపాటు ఆగకుండా నడవాలని సూచించ...

December 17, 2024 / 09:18 PM IST

వాము నీటితో బోలెడు లాభాలు

1. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.2. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.3. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.4. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.5. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.6. మహిళలకు పీరియడ్ పెయిన్ నుంచి రిలీఫ్ కలిగిస్తుంది.7. శ్వాసకోశ సమస్యల నుంచి కాపాడుతుంది.

December 17, 2024 / 03:30 PM IST

వేడివేడిగా ఆహారం తీసుకుంటున్నారా?

తీరిక లేదని కొంతమంది హడావిడిగా వేడివేడి టీ, కాఫీలు తాగటం.. ఫుడ్ తినటం వంటివి చేస్తుంటారు. ఇలా చేసేవారిలో ఎక్కువగా మహిళలే ఉంటారు. అలా చేయటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి ఆహారాలను తిన్నప్పుడు అన్నవాహికపై ప్రభావం పడి కాలుతుంది. అది కాస్తా ఇన్‌ఫ్లమేషన్‌కి దారి తీస్తుంది. దీర్ఘకాలం కొనసాగితే క్యాన్సర్‌కి కారణమవుతుందని పరశోధనలో తేలింది. కాబ్టటి పొగలు కక్కే ఆహారం, పానీయాల...

December 17, 2024 / 03:12 PM IST

ప్రసవానంతరం పొట్ట తగ్గాలంటే?

గర్భంతో ఉన్న సమయంలో బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట సాగుతుంది. ప్రసవానంతరం పొట్ట మాములు స్థితిలోకి రావాలి కానీ కొంతమందికి ఎత్తుగా ఉంటుంది. అయితే కొన్ని సహజపద్ధతుల ద్వారా పొట్ట తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ పరగడుపున గోరువెచ్చని నీళ్లు, గ్రీన్ టీ తాగాలి. మూడు లవంగాలు, దాల్చిన చెక్క ముక్కను నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించి తయారు చేసిన మిశ్రమాన్ని వరుసగా 40 రోజులు తాగాలి. యాపిల్ పండు తిన...

December 17, 2024 / 02:18 PM IST

స్ట్రాబెర్రీలతో బోలెడు లాభాలు

స్ట్రాబెర్రీలతో బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మానసిక ఒత్తిడిని, శరీరంలో వాపుని తగ్గిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం నుంచి మలినాలను, బ్యాక్టరియాను తొలగిస్తాయి. స్ట్రాబెర్రీలోని పీచు, పోషకాలు ఆకలిని నియంత్రిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు.

December 17, 2024 / 01:25 PM IST

పొడిబారిన చర్మానికి ఈ ఫేస్ ప్యాక్స్!

చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. కొన్ని ఫేస్ ప్యాక్స్ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు గుజ్జులో తేనె, పెరుగు కలిపి చర్మంపై అప్లై చేసుకుని 20-30 నిమిషాలు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. శనగపిండిలో టమాటా రసం, కాస్త రోజ్‌వాటర్ కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఇది స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై మృతకణాలని తొలగిస్తుంది. చర్మానికి తేమ అందించి...

December 17, 2024 / 09:20 AM IST

పచ్చి బఠాణీలతో పలు సమస్యలకు చెక్

పచ్చి బఠాణీలను తినడం వల్ల పలు సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మెరుగైన జీర్ణక్రియకు ఇవి సహాయపడుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చి బఠాణీలు ఉపయోగకరంగా ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయపడుతాయి. కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. కండరాల బలాన్ని పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.

December 17, 2024 / 09:10 AM IST

ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

ఒకప్పుడు వయసు పైబడిన వారికి మధుమేహం వచ్చేది. కానీ ఇటీవల కాలంలో వయసు సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఉదయం పూట మనలో కనిపించే కొన్ని లక్షణాల వచ్చే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ లేవగానే వికారం, వాంతులు వచ్చినట్లు అనిపించటం.. నిద్ర లేచాక కూడా కళ్లు సరిగా కనిపించకపోవటం, నిద్రలేచే సమయానికి నోరు తడారిపోవటం, ఎక్కువగా దాహం వేస్తే వెంటనే షుగర్ లెవల...

December 17, 2024 / 08:15 AM IST