చలికాలంలో బోన్ సూప్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మటన్ బోన్స్ను బాగా ఉడికించి ఆ సూప్ను తాగుతుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎముకలు, మజ్జ, టెండాన్లు, చర్మం, లిగమెంట్లను ఎక్కువ సమయంపాటు ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు బయటకు వస్తాయి. అలాంటి సూప్ తాగితే మనకు పోషకాలు లభిస్తాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మం పగలకుండా చూ...
కారణం ఏదైనా జుట్టు రాలే సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. దీనికి జామాకుతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. జామాకుల్లోని విటమిన్-సి జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. లీటరు నీటిలో జామాకులు వేసి 20 నిమిషాలు మరిగించి, ఆ నీటిని కుదుళ్లకు పట్టించాలి. రెండు గంటలు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే వెంట్రుకలు మృదువుగా మారతాయి. ఈ ఆకులతో హెయిర్ ప్యాక్ వేసుకుంటే చుండ్రు సమ...
దొండకాయలను నిత్యం తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు దొండకాయలను తింటే ఫలితం ఉంటుంది. మూత్రాశయ వ్యాధులు తగ్గుతాయి. దొండ ఆకులను పేస్టులా చేసి వాటితో ట్యాబ్లెట్లను తయారు చేసి వాడితే బ్యాక్టీరియాతో ఏర్పడే చర్మ సమస...
పంచ భూతాలు భూమి, అగ్ని, ఆకాశం, నీరు, గాలి లేనిదే ఈ ప్రపంచం మనుగడ సాధించలేదు. అయితే ఇవి మనకు మనుగడ ఇవ్వడంతో పాటు కొన్ని గుణాలను నేర్పిస్తాయి. ★ భూమి: ఓర్పు, ప్రేమ★ గాలి: కదలిక★ అగ్ని: సాహసం, వెలుగు★ ఆకాశం: సమానత★ నీరు: స్వచ్ఛత
కొంతమంది ఫేషియల్ హెయిర్తో ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు రకరకాల చిట్కాలు పాటిస్తారు. గోధుమపిండికి పావుచెంచా పసుపు, కాస్త వెన్న లేదా నెయ్యి, తగినన్ని పాలు కలిపి ముద్దలా చేసుకుని దానితో ముఖంపై మర్దనా చేస్తారు. గోధుమపిండి, పసుపు స్క్రబ్లా పనిచేసి, అవాంఛిత రోమాలను తొలగిస్తాయి. అయితే సున్నిత చర్మం కలవారు తరచూ ఇలా చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దురద, అలర్జీ, యాక్నే మరింత పెరగవచ్చని నిపు...
సరైన ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా చూడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోకపోతే కిడ్నీలపై ప్రభావం అధికంగా చూపుతుంది. అలాగే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, నీరు సరైన మోతాదులో తీసుకోవాలి. వీటితో పాటు ధూమపానానికి దూరంగా ఉండాలి. ధూమపానం అలవాటు ఉన్నవారిలో రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. దీనికారణంగా కిడ్నీలపై భారం పడి కిడ్నీలకు కేన్సర్ వచ్చే అవకాశా...
గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే పనిగా కూర్చొని పనిచేయడం వల్ల ఆరోగ్యం హరించుకుపోతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, అధిక బరువు ఇలా చాలా సమస్యలు చుట్టుముడతాయి. అన్నింటికీ మించి గుండె ఆరోగ్యం చతికిలపడుతుందని, గుండెపోటు ముప్పు కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
కొంతమందికి పచ్చికూరగాయలు తినే అలవాటు ఉంటుంది. పచ్చి బెండకాయలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బెండకాయలోని పోషకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె సమస్యలు దరిచేరవు. బెండకాయలో తక్కువ కెలరీలు ఉంటాయి. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది.
కోడిగుడ్డు మాత్రమే కాదు వాటిని ఉడికించిన నీళ్లతో కూడా చాలా ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు పెంకులో సోడియం, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు ఉంటాయి. గుడ్డును ఉడకబెట్టినప్పుడు అవన్నీ నీటిలో కలిసిపోతాయి. ఆ నీరు మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది. విత్తనాలు, మొక్కలు నాటేప్పుడు, సూర్యరశ్మి అందని మొక్కలకు ఈ నీటిని ఉపయోగించవచ్చు. పూల మొక్కలకు ఈ నీరు తెగుళ్లను ఎదుర్కొనే శక్త...
రేగు పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డయబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. పొట్ట దగ్గర కొవ్వు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. ఈ పండ్లలో న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి. దీంతో నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల ఆందోళన, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రిపూట నిద్ర చక్కగా పడుతుంది.
గద్వాల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కంటి ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ అన్నారు. ఆదివారం గద్వాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కంటి ఆపరేషన్ థియేటర్ను ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ ప్రారంభించారు.
KMM: దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఇవాళ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రాచలంకి చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా వైద్య శిబిరాన్ని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
చర్మ రక్షణకు వాడే ఉత్పత్తులే కాదు.. ముఖం శుభ్రపరచుకునే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. వాటర్ప్రూఫ్ మేకప్ నూనె ఆధారిత రిమూవర్లను వాడి తొలగించిన తర్వాత చల్లని నీటితో ముఖం తప్పనిసరిగా కడగాలి. రోజూ స్క్రబ్ని వాడకూడదు. ఫేషియల్ చేయించుకున్నాక, పీల్ఆఫ్ మాస్కులు వాడిన తర్వాత 6గంటల వరకు ముఖం కడగకూడదు. ఫేస్వాష్ చేసిన ప్రతిసారీ సబ్బుతో కాకుండా చల్లని...
చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. జలుబు, ఫీవర్ వంటివి దూరమవుతాయి. అజీర్తి, కడుపులో ఉబ్బరం వంటివి తగ్గుతాయి. అధిక రక్తపోటు, అధిక బరువు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉషోగ్రతలను సమతుల్యం చేస్తుంది.
భోజనం చేసేటప్పుడు చాలామంది నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే బరువు పెరిగే అవకాశం ఉంది. భోజనం చేసే సమయంలో సోడాలు, కూల్డ్రింక్స్ వంటివి తాగకూడదు. అయితే భోజనం చేయడానికి అరగంట ముందు నీళ్లు తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.