వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా యవ్వనంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర తప్పనిసరి. ఎండలో వెళ్లేటప్పుడు సన్స్క్రీన్ వాడాలి. ఒత్తిడి తగ్గించుకుని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగి చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి.
ఏప్రిల్ వచ్చేసింది. వస్తూ వస్తూ ఎప్పటిలాగే భయంకరమైన ఎండలను తీసుకొచ్చింది. అయితే ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగులుతోందని.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఉప్పు వేసిన నిమ్మరసం, గ్లూకోజ్ వాటర్ వంటివి తాగాలి. దాహం కావట్లేదని నీళ్లు తాగకుండా ఉండొద్దు. ఫ్రై చేసిన ఫుడ్ తినొద్దు. డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ తీసుకొవద్దు.
వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. నూనె, మసాలాలు తగ్గించి.. పండ్లు, మజ్జిగ వంటి చలవ చేసేవి తీసుకొవాలి. వదులైన కాటన్ బట్టలు ధరించాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎండలో వెళ్లకపోవడమే మంచిది. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, సన్ గ్లాసెస్ వాడాలి.
కాకరకాయ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, డయాబెటిస్ బాధితులకు సహజ ఇన్సులిన్లా పనిచేస్తుంది. ఉదయం పరగడుపున దీనిని తాగడం వల్ల బరువు తగ్గడం, కాలేయ శుద్ధి, మెరుగైన జీర్ణక్రియ వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, రక్తాన్ని శుద్ధి చేసి మొటిమలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉదయం నిద్రలేవగానే కొన్ని పనులు చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. 10 నిమిషాల యోగా లేదా స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేస్తే శరీరానికి శక్తినిస్తాయి. నిద్రలేచిన తర్వాత గంట సేపు మొబైల్ చూడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆ రోజు చేయాల్సిన పనులను ఒకసారి గుర్తుచేసుకోవాలి.
స్వస్తికాసనం (శుభ భంగిమ) ధ్యానం, ప్రాణాయామం కోసం కూర్చుని చేసే యోగాసనం. ఇది వెన్నెముకను నిటారుగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. తుంటి, మోకాళ్లు, చీలమండల వశ్యతను మెరుగుపరుస్తుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు, లోపలి పేగులపై ఒత్తిడి వల్ల జీర్ణరసాల ఉత్పత్తిని ప్రేరేపించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మనం కూరగాయలు తరిగే విధానం మన శరీరం పోషకాలను గ్రహించే తీరుపై ప్రభావం చూపుతుంది. కూరగాయలను సన్నగా తరగడం వల్ల రుచి పెరగడమే కాకుండా, కొవ్వులో కరిగే పోషకాలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. పెద్ద ముక్కలుగా తరగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతూ, కడుపు నిండిన భావనను ఎక్కువ సేపు కలిగిస్తుంది. కాబట్టి, తరిగే పద్ధతిని మార్చుకోవడం ఉత్తమం.
బయటి తిండి కన్నా ఇంట్లో వండుకునే ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బుల వంటి సమస్యల ముప్పు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా బారినపడటాన్ని తగ్గిస్తున్నట్టు తాజాగా బయటపడింది. ఆహారం, శారీరక శ్రమ వంటి జీవనశైలిని మార్చుకోవటం ద్వారా డిమెన్షియా కేసులు 40% వరకూ తగ్గుతున్నాయట.
బరువు తగ్గేందుకు, ఫిట్ నెస్ కోసం జిమ్కు వెళ్తుంటారు. కొందరికేమో అంతటైం ఉండదు. అలాంటప్పుడు మన బిజీ షెడ్యూల్లో ఏడు నిమిషాలు కేటాయిస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు. ఒక్కో ఎక్సర్ సైజ్ను 30 సెకన్లపాటు హై ఇంటెన్స్తో చేస్తే ఫిట్గా ఉంటాం. ఈ ఏడు నిమిషాల్లోనే కార్డియో, అప్పర్ బాడీ, లోయర్ బాడీ, కోర్ మజిల్ ఎక్సర్ సైజ్లు చేయాలి.
రోజు రోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో వేడిని తట్టుకోలేక వీధి కుక్కలు నీడ కోసం కార్లు, పెద్ద వాహనాల కింద తలదాచుకుంటాయి. వాహనదారులు బండి స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి కింద గమనించండి.. లేదా చిన్నగా హారన్ కొట్టండి. అలాగే, మీ ఇంటి బయట చిన్న గిన్నెలో నీళ్లు ఉంచి మూగ జీవాల దాహన్ని తీర్చండి. మనం తీసుకునే ఈ చిన్న సాయం.. ఎన్నో మూగజీవుల ప్రాణాలను రక్షిస్తుంది.
చాలా మంది సెలబ్రిటీలు పరగడుపున నెయ్యి తీసుకోవడం వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరిచి, ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇది పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తూ, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే చాలామంది దీనిని అలవాటు చేసుకుంటున్నారు.
మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతసేపటి వరకు మంచినీళ్లు అస్సలు తాగొద్దు. అలా చేస్తే కడుపు నొప్పి, అసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాకరకాయ తీసుకుంటే వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. మామిడి పండ్లతోపాటు చల్లటి పానీయాలు తీసుకుంటే షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయి. కారం, ఘాటు పదార్థాలు తీసుకుంటే చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
చాలా మంది ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు. అయిేతే, ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపులోని జీర్ణరసాలు పలచబడతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగకపోవడంతో పాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ రుగ్మతలు, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆపిల్ తిన్న తర్వాత 30 నుంచి 60 నిమిషాల వరకు నీళ్లు తాగకపోవడమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి అయితే ఒక గుక్కెడు నీళ్లు మాత్రమే తీసుకోవాలి.
అర్ధ చంద్రాసనం కాళ్లు, వెన్నెముకను బలపరుస్తూ శరీరం యొక్క సమతుల్యతను, వశ్యతను పెంచే యోగా భంగిమ. నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం మెదడు, కండరాల సమన్వయాన్ని బలోపేతం చేస్తుంది. కడుపు అవయవాలను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ భంగిమ ఛాతీ, తుంటి భాగాలను తెరిచి, వాటి వశ్యతను పెంచుతుంది.
ఉదయం పూట రోజంతా ఉత్సాహాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ‘రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన బ్రెడ్, అటుకులు, ఓట్ మీల్ వంటివి తీసుకోవాలి. గుడ్లు, పెరుగు వంటితోపాటు పీచు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. పండ్లు, ఆమ్లెట్, బాదం, అక్రోట్, సోయాపాలు, కాయగూరలు తినాలి. నూనెలో ముంచి తీసే పూరీ, వడ, బోండాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి’ అని వైద్యులు చెబుతున్నారు.