• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

గంటల తరబడి.. కూర్చొని పనిచేస్తున్నారా..?

గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే పనిగా కూర్చొని పనిచేయడం వల్ల ఆరోగ్యం హరించుకుపోతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, అధిక బరువు ఇలా చాలా సమస్యలు చుట్టుముడతాయి. అన్నింటికీ మించి గుండె ఆరోగ్యం చతికిలపడుతుందని, గుండెపోటు ముప్పు కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

December 15, 2024 / 06:01 PM IST

పచ్చి బెండకాయలు తింటున్నారా?

కొంతమందికి పచ్చికూరగాయలు తినే అలవాటు ఉంటుంది. పచ్చి బెండకాయలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బెండకాయలోని పోషకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె సమస్యలు దరిచేరవు. బెండకాయలో తక్కువ కెలరీలు ఉంటాయి. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది.

December 15, 2024 / 03:33 PM IST

గుడ్లు ఉడికించిన నీళ్లు పారబోస్తున్నారా?

కోడిగుడ్డు మాత్రమే కాదు వాటిని ఉడికించిన నీళ్లతో కూడా చాలా ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు పెంకులో సోడియం, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు ఉంటాయి. గుడ్డును ఉడకబెట్టినప్పుడు అవన్నీ నీటిలో కలిసిపోతాయి. ఆ నీరు మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది. విత్తనాలు, మొక్కలు నాటేప్పుడు, సూర్యరశ్మి అందని మొక్కలకు ఈ నీటిని ఉపయోగించవచ్చు. పూల మొక్కలకు ఈ నీరు తెగుళ్లను ఎదుర్కొనే శక్త...

December 15, 2024 / 02:50 PM IST

రేగు పండ్ల‌తో ఆరోగ్య ప్రయోజనాలు

రేగు పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డయబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. పొట్ట దగ్గర కొవ్వు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. ఈ పండ్లలో న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి. దీంతో నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల ఆందోళన, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రిపూట నిద్ర చక్కగా పడుతుంది.

December 15, 2024 / 02:29 PM IST

కంటి ఆపరేషన్ థియేటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల

గద్వాల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కంటి ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ అన్నారు. ఆదివారం గద్వాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో కంటి ఆపరేషన్ థియేటర్ను ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ ప్రారంభించారు.

December 15, 2024 / 01:07 PM IST

నేటి నుంచి ఉచిత మెగా వైద్య శిబిరం

KMM: దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఇవాళ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రాచలంకి చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా వైద్య శిబిరాన్ని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

December 15, 2024 / 01:02 PM IST

ఇలా ఫేస్‌వాష్ చేస్తున్నారా?

చర్మ రక్షణకు వాడే ఉత్పత్తులే కాదు.. ముఖం శుభ్రపరచుకునే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. వాటర్‌ప్రూఫ్ మేకప్ నూనె ఆధారిత రిమూవర్లను వాడి తొలగించిన తర్వాత చల్లని నీటితో ముఖం తప్పనిసరిగా కడగాలి. రోజూ స్క్రబ్‌ని వాడకూడదు. ఫేషియల్ చేయించుకున్నాక, పీల్‌ఆఫ్ మాస్కులు వాడిన తర్వాత 6గంటల వరకు ముఖం కడగకూడదు. ఫేస్‌వాష్ చేసిన ప్రతిసారీ సబ్బుతో కాకుండా చల్లని...

December 15, 2024 / 09:05 AM IST

చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగితే..?

చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. జలుబు, ఫీవర్ వంటివి దూరమవుతాయి. అజీర్తి, కడుపులో ఉబ్బరం వంటివి తగ్గుతాయి. అధిక రక్తపోటు, అధిక బరువు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉషోగ్రతలను సమతుల్యం చేస్తుంది.

December 15, 2024 / 08:10 AM IST

భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగుతున్నారా..?

భోజనం చేసేటప్పుడు చాలామంది నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే బరువు పెరిగే అవకాశం ఉంది. భోజనం చేసే సమయంలో సోడాలు, కూల్‌డ్రింక్స్ వంటివి తాగకూడదు. అయితే భోజనం చేయడానికి అరగంట ముందు నీళ్లు తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

December 14, 2024 / 01:40 PM IST

టీని ఎక్కువసేపు మరిగిస్తున్నారా..?

ఎక్కువసార్లు టీని మరిగించి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. గుండె, కాలేయ ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. అజీర్తి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఎముకలు , దంతాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శరీరంలో ఐరన్, కాల్షియం లోపం తలెత్తుతుంది. శరీరం పోషకాలు గ్రహించడంలో ఆటంకం కలుగుతుంది.

December 14, 2024 / 11:29 AM IST

చలికాలంలో ఔషధంలా పనిచేస్తున్న బొప్పాయి

చలికాలంలో బొప్పాయి ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాడీని వెచ్చగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డెంగ్యూ రోగులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. లివర్ సమస్యలను నివారిస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

December 14, 2024 / 08:47 AM IST

రేపు ఒయాసిస్ హాస్పిటల్లో ఉచిత వైద్యశిబిరం

ఒంగోలులోని ఆంజయ్య రోడ్లో గల ఒయాసిస్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సంతానోత్పత్తి కేంద్రంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ యామిని చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ శిబిరంలో మహిళలకు సంతాన సమస్యలపై వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు.

December 14, 2024 / 07:13 AM IST

గుమ్మడి విత్తనాలతో ప్రయోజనాలు

1. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.2. మధుమేహం, గుండె సమస్యలను తగ్గిస్తాయి.3. నాడీ వ్యవస్థ తీరును మెరుగుపరుస్తాయి.4. చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.5. నిద్రలేమి సమస్యలకు చెక్ పెడుతుంది.6. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.7. కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా చేస్తాయి.

December 13, 2024 / 09:17 AM IST

నారింజ తొక్కలని పడేస్తున్నారా?

నారింజ పండు తిని తొక్కలని పడేస్తుంటారు. కానీ ఆ తొక్కలతో చాలా లాభాలున్నాయి. ఆరెంజ్ తొక్కల పొడిలో తేనె, పెరుగు కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటే.. చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. నారింజ తొక్కలు, 4 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క వేసి మరిగించిన నీరు.. రూమ్ స్ప్రేగా ఉపయోగపడుతుంది. వెనిగర్‌లో రెండు వారాల పాటు ఈ తొక్కల్ని నానబెట్టి తర్వాత వడకట్టిన నీటితో కిచెన్ గట్టు, స్టవ్ క్లీన్ చేస్తే మరకలు క్షణాల్లో తొ...

December 12, 2024 / 07:30 PM IST

ఫేషియల్ అక్కర్లేదు.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి!

ముఖం మెరిసిపోవాలంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేస్ క్లీన్, ఫేషియల్ వంటివి చేయించుకుంటారు. కానీ బొప్పాయి ఫేస్ ప్యాక్‌తో ముఖ ఛాయను పెంచుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి గుజ్జు, కలబంద, తేనె కలిపి మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మచ్చలు, ట్యాన్ తగ్గిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా, బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. వారానికి 2సార్లు ఈ ప్యాక్ వేసుకు...

December 12, 2024 / 11:25 AM IST