టీ అంటే ఇష్టం ఉన్న వారు రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తాగుతుంటారు. కొందరు స్ట్రాంగ్ టీని ఇష్టపడే వారు కూడా నాలుగు సార్లు తాగుతారు. పాలతో చేసిన టీని ఎక్కువ సమయం మరిగించడం వల్ల శరీరంలో ఐరన్ పోషణకు ఆటంకం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలలో ఉండే విటమిన్ బి12, సి వంటి పోషకాలు క్షీణిస్తాయి. అంతేకాకుండా ఈ టీని ప్రతిసారి తాగడం వల్ల కాలేయం, గుండెపై ప్రతికూల […]
లవంగాలతో బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఫ్రీరాడికల్స్తో పోరాడి బరువును తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతాయి. జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి.. అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి.&...
ప్రతిరోజు 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో ఇది తోడ్పడుతుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంతో పాటు గుండె సమస్యలు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాలను దృఢంగా చేస్తుంది. తద్వారా బాడీ ఫిట్గా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
VZM: దేశంలో క్షయ వ్యాధి(TB) నిరోధక ఔషధాల కొరత ఏర్పడిందన్న ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. DEC6 నాటికి అన్ని కేంద్రాల్లో 2 నెలలకు పైగా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపింది. మందులను సకాలంలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నామంది. కాగా TB కేసుల్లో దేశం టాప్ ఉంది. 21.69లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
రోజుకూ కనీసం 5 పుట్టగొడుగులను తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రేక్ఫాస్ట్లో తింటే తీవ్రమైన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఉదయం కోడిగుడ్డు ఆమ్లేట్ లేదా ఉప్మాలో కలిపి వీటిని తింటే మంచిదని సూచిస్తున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షించుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాక...
కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు స్విమ్మింగ్ చేస్తే నొప్పి ఎక్కువ అవుతుందని కొందరు భావిస్తుంటారు. కానీ, ఇందులో వాస్తవం లేదని ఫిట్నెస్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఇతర వర్కౌట్లకంటే స్విమ్మింగ్ చేయడం కీళ్ల ఆరోగ్యానికి మంచిదని, నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. ప్రారంభంలో నొప్పిగా అనిపించినా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఉపశమనం లభిస్తుంది.
కొంతమంది నాన్ వెజ్ తినరు. అయితే కొన్ని వెజ్ అనుకుని మనం వాడే పదార్థాలు నాన్ వెజ్ కోవలోకి వస్తాయి. బటర్ నాన్ తయారు చేసేందుకు వాడే పిండిలో ఎగ్ కలుపుతారు. శాండ్ విచ్, పిజ్జాలో వాడే చీజ్లో జంతువుల నుంచి సేకరించిన రెన్నెట్ అనే ఎంజైమ్ ఉంటుంది. ప్యాక్డ్ ఆరెంజ్ జ్యూస్లో చేపల నుంచి తీసిన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. పంచదారలో జంతువుల ఎముకల నుంచి తయారుచేసిన పౌడర్ కలుస్తుంది. చూయింగ్ గమ్, [&h...
బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో జొన్నలను చేర్చుకుంటే మెరుగైన ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జొన్నల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. మలబద్ధకం సమస్య దరిచేరదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. శరీరానికి శక్తి అందుతుంది.
చలికాలంలో వచ్చే పలు అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు కొన్ని ఆహారపదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలని పోషకార నిపుణులు చెబుతున్నారు. చెరుకు రసం, రేగుపండ్లు, చింతపండు, ఉసిరి, నువ్వులు, ఖర్జూరాలు, చిరుధాన్యాలు తీసుకోవాలి. వీటిలోని పోషకాలు కాలేయ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఎముకలు, కీళ్లు బలంగా ఉండేలా చేస్తాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరవు. శరీరానికి వెచ్చదనం అందుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.
పని ఒత్తిడి, రాత్రిళ్లు సరిగా నిద్రపట్టకపోవటం వంటి పలు సమస్యల కారణంగా తలనొప్పి వేధిస్తుంటుంది. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం, నిమ్మరసం సమపాళ్లలో కలిపి రోజులో రెండుసార్లు తీసుకోవాలి. నుదుటిపై రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని చర్మం లోపలికి ఇంకేటట్లు మర్దన చేయాలి. తులసి ఆకులు వేసి మరిగించిన నీరు తాగాలి. ఐస్ ప్యాక్ పెట్టుకున్న...
KMR: సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి MPPS స్కూల్లో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య సహాయ అధికారి హరికిషన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో RBSK డాక్టర్ మారుతి, HM బిల్యానాయక్ పాల్గొన్నారు.
చలికాలంలో శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోయి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వాటి నుంచి బయటపడాలంటే రోగనిరోధకశక్తిని పెంచుకోవటం ముఖ్యం. ఇందుకోసం ఉసిరి టీ చక్కగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెంచా ఉసిరి పొడి, కొద్దిగా అల్లం, రెండు తులసి ఆకులు, చిటికెడు జీలకర్ర పొడి వేసి మరిగించి తాగాలి. లేదా తాజా ఉసిరికాయ గుజ్జుని నీళ్లలో మరిగించి కూడా తాగొచ్చు. ఇలా చేస్తే బీపీ, షుగర్ నియంత్రణలో ఉంటాయి. శ్వా...
మగవారు గడ్డం పెంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గడ్డం ఉండటం వల్ల హానికరమైన యూవీ కిరణాల నుంచి ముఖం కవర్ అవుతుంది. దీని వల్ల చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చర్మం తేమగా ఉండటం కారణంగా మొహంపై పగుళ్లు, మొటిమలు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. గాలిలో ఉండే బ్యాక్తీరియా త్వరగా నోటిలోకి చేరకుండా అడ్డుకుంటుంది. గడ్డం వల్ల స్కిన్ ట్యాన్ అవ్వదు, పొడి చర్మం సమస్య నుంచి బయ...
చాలా మంది బరువు తగ్గడానికి ఆహారపు అలవాట్లు, కష్టమైన వ్యాయామాలు చేస్తుంటారు. కానీ, తేలికగా 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. స్కిప్పింగ్ చేయడం వల్ల హృదయ కండరాలు, ఊపిరితిత్తులు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో క్యాలరీలు బర్న్ అయ్యి.. భుజాలు, పొట్ట, కండరాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. నిత్యం స్కిప్పింగ్ చేస్తే గుండె సమస్యలకు...
ప్రపంచస్థాయిలో ఏటా ప్రజలు ఇష్టంగా తినే ఆహార పదార్థాల వివరాలు సేకరించి, వాటి జాబితాను టెస్ట్ అట్లాస్ అనే సంస్థ విడుదల చేస్తోంది. ఈ జాబితాలో తమిళనాడులో తయారవుతున్న చికెన్ 65 మూడో స్థానంలో నిలించింది. కాగా, 1960లో తమిళనాడులో బుఖారీ అనే ఆహార సంస్థ ఈ చికెన్ 65 తయారీ ప్రారంభించినట్లు సమాచారం. ఈ జాబితాలో చైనాకు చెందిన క్రిస్పీ ఫ్రైడ్ చికెన్, తైవాన్కు చెందిన బాంబకాన్ చికెన్ తదితరాలు కూడా చోటుచేసు...