కప్పింగ్ థెరపీ అనేది ఒక పురాతన ప్రత్యామ్నాయ వైద్య విధానం. ఇందులో చర్మంపై ప్రత్యేక కప్పులను ఉంచి ‘సక్షన్’ సృష్టిస్తారు. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి. క్రీడాకారులు శారీరక దృఢత్వం కోసం దీనిని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తుంది. ఇందులో డ్రై, వెట్ (హిజామా) అనే రెండు పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయి.
జీవితంలో అప్పు, అగ్ని, శత్రువు, వ్యాధి.. ఈ నాలుగింటిని సగం వదిలేయకూడదని, పూర్తిగా నిర్మూలించాలని విదురుడు హెచ్చరించాడు. వీటిలో ఏ కొద్ది భాగం మిగిలినా మళ్లీ విజృంభిస్తాయి. అప్పు వడ్డీతో పెరుగుతుంది, నిప్పు రాజుకుంటుంది, శత్రువు పగ తీర్చుకుంటాడు, వ్యాధి ప్రాణాలు తీస్తుంది. కాబట్టి ఈ నాలుగింటిని ఎప్పుడూ సమూలంగా నాశనం చేయాలని విదుర నీతి సారాంశం.
ఆయుర్వేదంలో ‘అమృతవల్లి’గా పిలిచే తిప్పతీగ కషాయం తాగడం వల్ల రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక జ్వరాలను తగ్గించడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ మితంగా తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించడంతో పాటు రక్తం కూడా శుద్ధి అవుతుంది.
ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా శక్తి, మెరుగైన జ్ఞాపకశక్తి, స్థిరమైన జీవక్రియ లభిస్తాయి. ఇది బరువు నియంత్రణలో ఉంచడమే కాకుండా, గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. 8 నుంచి 10 గంటలలోపు ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని (ఇడ్లీ, మొలకలు, గుడ్లు, ఓట్స్) తీసుకోవడం చాలా ఉత్తమం.
కటిచక్రాసనం (నడుము తిప్పే ఆసనం) వెన్నెముక వశ్యతను పెంచడం, నడుమునొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉదర అవయవాలను మసాజ్ చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. నడుము చుట్టూ ఉన్న కండరాలను టోన్ చేయడం, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం పూట ఈ ఆసనం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. పిల్లల ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది.
ఫ్యాటీ లివర్ ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. ఇది కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఉత్పన్నమవుతుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే, మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శరీరంలో విషపదార్థాల స్థాయిలు పెరుగుతాయి. నారింజ, నిమ్మకాయ, బత్తాయి, కమలాఫలం వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాలేయాన్ని విష పదార్థాల నుంచి రక్షిస్తాయి.
రోజువారీ ఆహారంలో అల్లం చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరంలోని మంటను తగ్గించే ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే, వికారం, అజీర్ణం వంటి సమస్యలను నిమిషాల్లో తగ్గిస్తుంది. ముఖ్యంగా అల్లం టీ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, జలుబు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
కరివేపాకు కేవలం పోపులో వేసే ఆకు మాత్రమే కాదు, ఇది పోషకాల గని. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, రేచీకటి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇందులోని ఐరన్, ఫోలిక్ యాసిడ్ అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే, కరివేపాకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి బరువు తగ్గడానికి సహకరిస్తుంది.
భారత కార్పొరేట్ సంస్థల్లో ఉన్నత పదవుల విషయంలో పురుషులు, మహిళల మధ్య వ్యత్యాసం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పురుషులు కోర్ బిజినెస్ పాత్రల్లో ఉంటే, మహిళలు ఎక్కువగా సహాయక విభాగాలకే పరిమితమవుతున్నారట. దీంతో ప్రమోషన్లలో మహిళలు వెనుకబడుతున్నారని, ఈ సమస్య వ్యక్తిగత ప్రతిభది కాదని, సంస్థాగత విధానాలదని చెబుతున్నారు. సమాన అవకాశాల కల్పనతో ఈ పరిస్థితుల మార్చవచ్చని అంటున్నారు.
ఉసిరికాయలో నారింజ కంటే 20 రెట్లు ఎక్కువగా ఉండే విటమిన్-C శరీర రోగనిరోధక శక్తిని అమాంతం పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. రోజూ ఒక ఉసిరికాయను తీసుకోవడం వల్ల రోగాల నుంచి రక్షణ పొందవచ్చు.
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం జూన్ 2026లో ముగియనుంది. దీంతో అగార్కర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే, హర్భజన్ సింగ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అగార్కర్ చీఫ్ సెలెక్టర్గా ఉన్న సమయంలో భారత జట్టు 2024 T20 WC, 2025 CT గెలుచుకుంది. అలాగే, 2023 ODI WCలో ఫైనల్కు చేరింది.
కొన్ని చిట్కాలతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. కప్పు ఆముదంలో టీస్పూన్ రోజ్మేరీ ఆయిల్ కలిపి రోజూ రాత్రి కుదుళ్లకు పట్టించాలి.కొబ్బరి పాలు, ఆర్గన్ ఆయిల్ మిశ్రమాన్ని రాసి, షవర్ క్యాప్ పెట్టుకుని స్నానం చేస్తే జుట్టు మృదువుగా మారుతుందివారానికి రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దన చేసి, మరుసటి రోజు గాఢత తక్కువ షాంపూతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక నీరసం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి, సాయంత్రం వేళ అతిగా తినే ప్రమాదం ఉంది. ఇది బరువు పెరగడానికి, జీర్ణక్రియ మందగించడానికి దారితీస్తుంది. కాబట్టి సమయానికి మితంగా ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. పండ్లు లేదా మొలకలైనా తింటే మంచిది.
సాధారణ నడక కంటే ఎనిమిది ఆకృతిలో నడవడం (సిద్ధ నడక) వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకే సరళరేఖపై రెండు వస్తువులను ఉంచి, వాటి చుట్టూ 8 అంకె ఆకారంలో నడవడమే ఈ పద్ధతి. ఇది శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఏకాగ్రత పెరగడానికి, ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మెదడు చురుగ్గా మారుతుంది.
బిర్యానీ ఆకు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మధుమేహ బాధితుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బిర్యానీ ఆకు కీలక పాత్ర పోషిస్తుంది.