వాము నీరు గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో మెటబాలిజం పెంచి, కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది. ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించి జలుబు, దగ్గు ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా అవసరమైన శక్తి లభిస్తుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇది నిద్రలో ఉన్న శరీరానికి పోషకాలను అందించి, అలసటను తగ్గించి, గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. రాత్రంతా ఉపవాసం తర్వాత బ్రేక్ఫాస్ట్ మీ శరీరానికి గ్లూకోజ్ సరఫరాను పునరుద్ధరిస్తుంది.
ధనురాసనం వెన్నెముకను బలోపేతం చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి అద్భుతమైన యోగాసనం. పొట్ట భాగంపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ఇది ఛాతీని తెరిచి, లోతైన శ్వాసను ప్రోత్సహించడం ద్వారా ఆందోళన, అలసటను తగ్గిస్తుంది. భుజాలు, ఛాతీని సాగదీయడం ద్వారా, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చునే వారిలో వచ్చే భుజాల వంపులను తగ్గిస్తుంది.
రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలలోని ‘ట్రిప్టోఫాన్’, ‘మెలటోనిన్’ నిద్రలేమిని తగ్గిస్తాయి. అయితే భోజనం చేసిన వెంటనే కాకుండా, కనీసం 45 నిమిషాల నుంచి గంట గ్యాప్ ఇచ్చి పాలు తాగడం మంచిది. గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారు తాగకపోవడమే మంచిదంటున్నారు.
ఒక బంధం ముగిసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం, కానీ జీవితం అక్కడితో ఆగిపోదు. బ్రేకప్ బాధ నుంచి కోలుకోవాలంటే ముందుగా వారి జ్ఞాపకాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఖాళీగా ఉండకుండా మీకు నచ్చిన పనుల్లో నిమగ్నమవ్వడం, స్నేహితులతో సమయం గడపడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. గతాన్ని వదిలేసి, మీ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెడితే కొత్త జీవితం ఉత్సాహంగా మొదలవుతుంది.
చేతులు శుభ్రంగా కడిగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి ముందు చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. నిత్యం తాకే కీబోర్డు, మౌస్, డోర్ హ్యాండిల్స్ వంటి వస్తువులపై కంటికి కనిపించని ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి. కేవలం చేతులు కడగడం అనే చిన్న అలవాటు ద్వారా మనం 50% వరకు అంటువ్యాధులను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.
ఎక్కువ వేడి, తేమ వల్ల శరీరంలోని చెమట గ్రంథులు మూసుకుపోయినప్పుడు చెమటకాయలు వస్తాయి. చెమట బయటకు రాలేక చర్మం లోపలే ఆగిపోవడం వల్ల ఎర్రటి కురుపులు, దురద ఏర్పడతాయి. ముఖ్యంగా బిగుతైన బట్టలు వేసుకోవడం, గాలి ఆడకపోవడం వల్ల ఈ సమస్య పెరుగుతుంది. కాబట్టి వేసవిలో వదులైన కాటన్ దుస్తులు ధరించడం, చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం ఉత్తమం.
వేయించిన శనగపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
ఎండకాలంలో వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దాహం వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి. వదులుగా ఉండే కాటన్ బట్టలు ధరించడం మంచిది. పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. బయటకు వెళ్తే గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ తప్పక వాడాలి.
బిగుతైన జీన్స్ వల్ల మహిళల జననేంద్రియాల వద్ద గాలి ఆడదు. దీనివల్ల చెమట పట్టడం, ఆ ప్రాంతం తేమగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా దురద, మంట, ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పురుషుల్లో వృషణాల చుట్టూ వేడి పెరుగుతుంది. ఇది వీర్య కణాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా, వాటి కదలికను కూడా దెబ్బతీస్తుంది.
చాలా మంది బ్రేక్ఫాస్ట్లో భాగంగా బోండాలు తింటుంటారు. గోధుమ/బియ్యం పిండి బోండాలతో ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదు కానీ మైదా పిండితో చేసినవాటికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. మైదాలో పోషకాలే ఉండవని, పైగా పేగులకు చుట్టుకుని జీర్ణవ్యవస్థ పనితీరు మందగించేలా చేస్తుందని చెబుతున్నారు. పోషక లోపం, బరువు, డయాబెటిస్, గుండె సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే థైరాయిడ్ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, అధిక నీరసం, జుట్టు రాలడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ కలిగిన ఉప్పును తగినంత మోతాదులో తీసుకోవాలి. ఏవైనా మార్పులు గమనించినప్పుడు వెంటనే రక్త పరీక్ష చేయించుకుని డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం శ్రేయస్కరం.
వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రావడం సహజం. కానీ సరైన జాగ్రత్తలతో వీటిని అరికట్టవచ్చు. ఎముకలు బలంగా ఉండాలంటే శరీరానికి విటమిన్-డి, కాల్షియం ఎంతో అవసరం. ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో ఉండటం ద్వారా విటమిన్-D లభిస్తుంది. అలాగే పాలు, పెరుగు, రాగులు, ఆకుకూరల ద్వారా శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. వీటితో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉండవచ్చు.
గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే భోజనానికి, నిద్రకు మధ్య కనీసం రెండు గంటల విరామం ఉండేలా చూసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సులభమవుతుంది. ప్రతిరోజూ ఆహారంలో పెరుగు లేదా మజ్జిగ చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రాత్రి వేళల్లో తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం.
మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం వల్ల కిడ్నీ సమస్యలు అధికమవుతున్నాయి. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ కనీసం 3-4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి. అలాగే, ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా, డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడటం కిడ్నీలకు ప్రమాదకరమని గుర్తించాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలతో మీ కిడ్నీలను పదిలంగా కాపాడుకోవచ్చు.