• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

అలోవెరా జెల్‌తో మెరిసే చర్మం

చలికాలంలో అలోవెరా జెల్‌ చర్మానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలోవెరా పెరుగు ఫేస్ ప్యాక్‌తో చర్యం మెరుస్తుంది. ముఖాన్ని నీళ్లతో కడిగిన తర్వాత ఈ ఫేస్ మాస్క్‌ను అప్లై చేసి 15-20 నిమిషాలు ఉంచాలి. అనంతరం నీటితో కడగాలి. అలోవెరా, ఆల్మండ్ ఆయిల్ ఫేస్ మాస్క్‌ వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అలోవెరా, నిమ్మరసం ప్యాక్ చర్మంపై మచ్చలను తగ్గిస్తుంది.

December 22, 2024 / 10:39 AM IST

వైద్యారోగ్య శాఖలో పలువురికి ప్రమోషన్‌లు

విశాఖ, అనకాపల్లి జిల్లాలో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురికి ప్రమోషన్లు కల్పిస్తూ ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరిని కేజీహెచ్ సీఎస్ఆర్ఎమ్ఓగా బదిలీ చేశారు. జిల్లా డీఐఓ జీవన్ రాణిని విజయనగరం డీఎంహెచ్ఐగా పదోన్నతి కల్పించారు.

December 22, 2024 / 09:01 AM IST

ఉద‌యాన్నే 2 ఖ‌ర్జూరాలు, గ్లాస్ పాలు తాగితే..?

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో రెండు ఖర్జూరాలు, గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మలబద్ధకం ఉండదు. జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉ...

December 22, 2024 / 06:59 AM IST

సీఎం సహాయనిధి నుంచి 21 మందికి సాయం

ఒంగోలు నియోజకవర్గంలో 21 మందికి సీఎం సహాయనిధి నుంచి రూ.54 లక్షల మంజూరయ్యాయి. ఒంగోలులోని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనారోగ్య కారణాల రీత్యా ఆసుపత్రులలో వైద్యం పొందుతు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నవారికి వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందన్నారు.

December 22, 2024 / 06:18 AM IST

జోరు వానలో విశాఖ పోర్ట్ కార్మికుల నిరసన

VSP: పోర్టు హాస్పిటల్ లోపలికి ఎవరు వచ్చినా తరిమి కోడతామని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహారావు అన్నారు. పోర్టు హాస్పిటల్‌ను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోర్టు హాస్పిటల్ వద్ద 82వ రోజు నిరసన దీక్ష వర్షం సైతం లెక్కచేయకుండా కొనసాగింది. 40 వేల మంది కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ప్రైవేట్ వారికి అప్పగించడం సరైనది కాదని తెలిపారు.

December 22, 2024 / 04:40 AM IST

అనీమియా కేసులు తగ్గుదల కొనసాగాలి: కలెక్టర్

PPM: అనీమియా కేసులు ఇకపై ప్రతీ నెలా తగ్గుదల కొనసాగాలని వైద్యాధికారులు, ANM లకు పార్వతీపురం జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ స్పష్టం చేసారు. గర్భిణుల్లో రక్తహీనత ఉండకూడదని, కనీసం 11 శాతంకు తగ్గకుండా చూడాలని, లక్ష్యసాధనలో నిర్లక్ష్యం వహించిన, గర్భిణీలో రక్తహీనత ఉన్నట్లు నిర్ధారణ అయితే స్థానిక వైద్యాధికారి, ఏఎన్‌ఎం, అంగన్వాడీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

December 22, 2024 / 04:33 AM IST

నేడు ఊడిముడిలో మెగా మెడికల్ క్యాంపు

E.G: కె.గంగవరం మండలం ఊడిమూడిలో మెగా మెడికల్ క్యాంపును ఆదివారం నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకుడు తాడాల వీర వెంకట సత్యనారాయణ శనివారం తెలిపారు. కాకినాడ, వైజాగ్ నుంచి డాక్టర్లు వస్తారని, సమీప గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, జనసేన ఇన్‌ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ సంయుక్తంగా మెడికల్ క్యాంప్ ప్రారంభిస్తారన్నారు.

December 22, 2024 / 04:24 AM IST

డ్రాగన్ ఫ్రూట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

డ్రాగన్ ఫ్రూట్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ తింటే 60 క్యాలరీలు లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఆహారం. దీన్ని తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఫ్లూ జర్వం తగ్గుతుంది. ఈ పండు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వయస్సు మీద పడే వృద్ధ...

December 21, 2024 / 09:11 PM IST

ఎక్స్‌పైరీ చికెన్ తింటున్నారా..?

కొంతమంది ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ తింటారు. గడువు ముగిసిన చికెన్‌లో సాల్మొనెల్లా, లిస్టేరియా వంటి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్, అతిసారం, వాంతులు, జ్వరం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మూత్రపిండాలు, కాలేయంపై కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే చికెన్ చెడిపోయి ఉంటే దాని రంగులో మార్పు కనిపిస్తుంది. దాన్ని గమనించాలి.

December 21, 2024 / 07:58 PM IST

చలికాలంలో పెరుగు తింటే జలుబు వస్తుందా?

చలికాలంలో పెరుగు తింటే జలుబుతోపాటు గొంతునొప్పి, జ్వరం వస్తాయని, గొంతులో కఫం పేరుకుపోతుందని చెబుతుంటారు. కానీ ఇవన్నీ అపోహలే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో బ్యాక్టీరియాను ప్రోత్సహించడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో తింటే జలుబు, గొంతు నొప్పి, ఫ్లూవంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే, ఫ్రిడ్జ్‌లో పెట్టిన చల్లని పెరుగు...

December 21, 2024 / 04:43 PM IST

ఇమ్యూనిటీని పెంచే మునగ సూప్!

శీతాకాలంలో చలి తీవ్రతకు వేడివేడిగా ఆహారం తీసుకుంటారు. శరీరానికి వేడిని అందించి వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో మునగ సూప్‌ బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఓ గిన్నెలో మునక్కాడ ముక్కలు, పావుకప్పు ఉల్లిపాయలు, వెన్న, చిన్న అల్లం ముక్క, కాస్త జీలకర్ర, ఉప్పు వేసి పాత్రలో సగానికిపైగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ నీళ్లు సగానికి అయ్యాక పెప్పర్ పౌడర్ చల్లుకుని తాగాలి. ఈ సూప్ నాడీవ్యవస్థను ఆరోగ...

December 21, 2024 / 03:10 PM IST

జామ ఆకుల టీతో ఈ సమస్యలకు చెక్

జామ చెట్టు ఆకుల నుంచి టీ పెట్టుకోవచ్చని చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆ ఆకుల టీ ఆరోగ్యానికి ఏంటో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సీ, లికోపెన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని సంరక్షిస్తాయి. ఈ ఆకుల్లో పొటాషియం ఉండటంతో బీపీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయి ఉన్న చెడు కొవ్వును తగ్గించి గుండె జబ్బులు, ఇతర సమస్యలు ...

December 21, 2024 / 09:04 AM IST

స్నానానికి పసుపు నీటితో ప్రయోజనాలెన్నో!

సాధారణ నీటితో కన్నా పసుపు నీటితో స్నానం చేస్తే ఎన్నో ప్రయోజనాలుంటాని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పసుపులోని గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. చర్మంపై పేరుకుపోయిన మురికి తొలగిస్తాయి. గాయాలు మానుతాయి. చర్మ రంగు మెరుగుపడుతుంది. చర్మం బిగుతుగా మారి, వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది.

December 21, 2024 / 08:35 AM IST

ప్రకృతిలో గడిపితే బోలెడు లాభాలు

ప్రకృతిలో గడపడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆనందంతో పాటు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఉత్సాహంగా ఉంటారు. బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయట. ముఖ్యంగా పిల్లలకు మంచి జరుగుతుంది. పచ్చదనం ఉన్న ప్రాంతాల్లోని పిల్లలు చురుకుగా కనిపిస్తారు. రోగనిరోధక శక్తి పెరిగి పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు.

December 21, 2024 / 07:58 AM IST

శరీర బరువు పెరుగుతోందా?

చలికాలంలో చర్మం పొడిబారటం, జలుబు, దగ్గుతో పాటు బరువు పెరగటం సాధారణ విషయమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. చలికి వ్యాయామం చేసేందుకు బద్దకించటం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. డిన్నర్ తర్వాత మెలకువగా ఉండేవాళ్లు మళ్లీ ఏదో ఒకటి తింటుంటారు. అలా కాకుండా పండ్లు, నట్స్ తీసుకుంటూ.. తగినంత నీటిని తాగితే బరువు అదుప...

December 21, 2024 / 07:40 AM IST