• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

బియ్యం కడిగిన నీటితో గ్లాసీ స్కిన్

బియ్యం కడిగిన నీళ్లతో గ్లాసీ స్కిన్‌ను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బియ్యం కడిగిన నీళ్లను చర్మానికి పట్టించి కడగటం వల్ల కాంతివంతంగా మారుతుంది. ఈ నీళ్లను ఫేస్‌వాష్‌గా ఉపయోగిస్తే.. చర్మం తేమగా, హైడ్రేట్‌గా ఉంటుంది. ఎగ్జిమా, మొటిమలు, దద్దుర్లు వంటివి తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేసి ముఖంపై యవ్వన ఛాయలను పెంచుతుంది.

December 25, 2024 / 12:35 PM IST

చుండ్రుకు చెక్ పెట్టేయండిలా!

శీతాకాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హెన్నా పొడిలో నిమ్మరసం, పెరుగు వేసి తలకి పట్టించాలి. ఆరిన తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. హెన్నా పొడిలో మందార ఆకులు, పువ్వుల పొడి.. ఉసిరి పొడి, మెంతి పొడి కలిపి వెంట్రుకలకు పట్టించాలి. ఈ ప్యాక్ వల్ల చుండ్రుతో పాటు జుట్టు రాలటం కూడా తగ్గుతుంది.

December 25, 2024 / 12:16 PM IST

ఉదయం ఇలా చేస్తే ఒత్తిడి దూరం!

మారుతున్న జీవనశైలి వల్ల డిప్రెషన్ బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందులో సగానికి పైగా మహిళలే ఉంటున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే డిప్రెషన్ తగ్గించటానికి నడకే మంచి మార్గమని పరిశోధకులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం నడవటం వల్ల నిరాశ, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగుపడి, నాడీవ్యవస్థ బలంగా మారుతుంది. సూర్యరశ్మిలో నడిస్తే నిద్ర సమస్యలు కూడా దూరమవుతాయి.

December 25, 2024 / 08:22 AM IST

ఈ సమస్య ఉన్నవారు ఉసిరికాయలు తినొద్దు?

అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరికాయలను తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొందరికి అసిడిటీ సమస్య, పొట్ట ఉబ్బరంగా కడుపులో మంటగా ఉంటుంది. అయితే విటమిన్ సి ఎక్కువగా ఉన్నందువల్ల ఈ సమస్యలు ఉన్నవారు ఉసిరికాయను తినకూడదు. తింటే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు పరగడుపున అసలు తినొద్దు. అలాగే జ్యూస్ కూడా తాగకూడదు. రక్త సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా తినొద్దు.

December 24, 2024 / 08:19 PM IST

దానిమ్మ జ్యూస్‌తో బోలెడు ప్రయోజనాలు

1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.2. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది.3. గుండె సమస్యలను దూరం చేస్తుంది.4. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.5. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.6. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.

December 24, 2024 / 05:53 PM IST

చ‌లికాలంలో ఆకుకూర‌లు తింటే లాభాలు!

చలికాలంలో ఆకుకూరలు తింటే అనేక లాభాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పాలకూర, గోంగూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరానికి పోషకాలు సైతం అందుతాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి.

December 24, 2024 / 03:58 PM IST

పీరియడ్స్ టైంకు రావట్లేదా?.. కారణం ఇదే!

ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్యల్లో పీరియడ్స్ ఒకటి. అయితే కొన్నిసార్లు సరైన సమయంలో పీరియడ్స్ రావు. ఇలా అవ్వడానికి జీవన శైలిలో చేసే పొరపాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా ఈ సమస్య వస్తుంది. ఇది పీరియడ్స్ చక్రాన్ని నిర్వహించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా ఇందుకు కారణమట. ఐరన్, విటమిన్ డి లోపం వల్ల సరైన సమయంలో పీరియడ్స్ రావు.

December 24, 2024 / 03:03 PM IST

పిల్లలకు తినేటప్పుడు ఫోన్ ఇస్తున్నారా?

ప్రస్తుత కాలంలో పిల్లలు తినేటప్పుడు ఫోన్ ఎక్కువగా చూస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఫోన్ చూస్తూ తినడం వల్ల పోషకాహార లోపంతో పాటు ఊబకాయ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీర్ణక్రియ బలహీనపడుతుంది. కంటిపై ప్రభావం పడుతుంది. అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. పిల్లల పెరుగుదల, సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. మానసిక సమస్యలు తలెత్తుతాయి.

December 24, 2024 / 12:39 PM IST

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి ఉండేలా చూసుకోవాలి!

టిఫిన్‌ అనగానే చాలా మంది ఏదో ఒకటి తినేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ, బ్రేక్‌ఫాస్ట్‌లో పోషక విలువలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే మొదట తీసుకునే ఆహారంలో పీచు(fibre) అధికంగా ఉండేలా చూసుకోవాలి. పీచు తర్వాత తప్పనిసరిగా తీసుకోవాల్సినవి మాంసకృత్తులు. వీటితో పాటు శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి.

December 24, 2024 / 08:00 AM IST

ఈ ఆకు జ్యూస్‌తో పలు సమస్యలు పరార్‌

బొప్పాయి ఆకుల జ్యూస్‌తో చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ జ్యూస్ తాగితే మంచిది. గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయి. మహిళల్లో రుతుక్రమ సమస్యలు దూరమవుతాయి. క్యాన్సర్, గుండె సమస్యలను ఇది నివారిస్తుంది.

December 22, 2024 / 01:47 PM IST

అలోవెరా జెల్‌తో మెరిసే చర్మం

చలికాలంలో అలోవెరా జెల్‌ చర్మానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలోవెరా పెరుగు ఫేస్ ప్యాక్‌తో చర్యం మెరుస్తుంది. ముఖాన్ని నీళ్లతో కడిగిన తర్వాత ఈ ఫేస్ మాస్క్‌ను అప్లై చేసి 15-20 నిమిషాలు ఉంచాలి. అనంతరం నీటితో కడగాలి. అలోవెరా, ఆల్మండ్ ఆయిల్ ఫేస్ మాస్క్‌ వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అలోవెరా, నిమ్మరసం ప్యాక్ చర్మంపై మచ్చలను తగ్గిస్తుంది.

December 22, 2024 / 10:39 AM IST

వైద్యారోగ్య శాఖలో పలువురికి ప్రమోషన్‌లు

విశాఖ, అనకాపల్లి జిల్లాలో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురికి ప్రమోషన్లు కల్పిస్తూ ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరిని కేజీహెచ్ సీఎస్ఆర్ఎమ్ఓగా బదిలీ చేశారు. జిల్లా డీఐఓ జీవన్ రాణిని విజయనగరం డీఎంహెచ్ఐగా పదోన్నతి కల్పించారు.

December 22, 2024 / 09:01 AM IST

ఉద‌యాన్నే 2 ఖ‌ర్జూరాలు, గ్లాస్ పాలు తాగితే..?

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో రెండు ఖర్జూరాలు, గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మలబద్ధకం ఉండదు. జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉ...

December 22, 2024 / 06:59 AM IST

సీఎం సహాయనిధి నుంచి 21 మందికి సాయం

ఒంగోలు నియోజకవర్గంలో 21 మందికి సీఎం సహాయనిధి నుంచి రూ.54 లక్షల మంజూరయ్యాయి. ఒంగోలులోని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనారోగ్య కారణాల రీత్యా ఆసుపత్రులలో వైద్యం పొందుతు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నవారికి వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందన్నారు.

December 22, 2024 / 06:18 AM IST

జోరు వానలో విశాఖ పోర్ట్ కార్మికుల నిరసన

VSP: పోర్టు హాస్పిటల్ లోపలికి ఎవరు వచ్చినా తరిమి కోడతామని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహారావు అన్నారు. పోర్టు హాస్పిటల్‌ను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోర్టు హాస్పిటల్ వద్ద 82వ రోజు నిరసన దీక్ష వర్షం సైతం లెక్కచేయకుండా కొనసాగింది. 40 వేల మంది కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ప్రైవేట్ వారికి అప్పగించడం సరైనది కాదని తెలిపారు.

December 22, 2024 / 04:40 AM IST