మంచం మీద కూర్చొని భోజనం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు ఇది కడుపులో భారం, యాసిడ్ రిఫ్లక్స్కు కారణమవుతుంది. అలాగే నిద్రను ప్రభావితం చేస్తుంది. అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. బరువు వేగంగా పెరుగుతారు. ఆహారం మంచం మీద పడి స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
నిద్రలేమి, టీవీ, కంప్యూటర్ వాడకం, అధిక ఒత్తిడి కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు వస్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటించి వీటిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. టీ బ్యాగ్స్ని కాసేపు ఫ్రిజ్లో పెట్టి, పావుగంట కళ్లపై పెట్టుకోవాలి. టమాటా, నిమ్మరసం కలిపి కళ్ల కింద రాసుకోవాలి. రాత్రి పడుకునే ముందు బాదం నూనె అప్లై చేసుకోవాలి. ఆహారంలో ఉప్పుని తగ్గించి తీసుకోవాలి.
SS: కొత్తచెరువు మండలం కేశాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో వైసీపీ ఎన్నారై ముర్రెడ్డి ఆదిశేషారెడ్డి తండ్రి రిటైర్డ్ హిందీ పండిట్ నాగిరెడ్డి జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 28 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైద్య శిబిరం ఉంటుందని శంకర్ నేత్రాలయం కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు.
✦ కాలేయంలో కొవ్వు శాతం పెరగకుండా ఉంటుంది.✦ మానసిక సమస్యలు దూరమవుతాయి.✦ శ్వాసకోశ సమస్యలున్న వారికి మేలు చేస్తుంది.✦ శరీరంలోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.✦ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.✦ జుట్టు సమస్యలు దరిచేరవు.✦ చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చలికాలంలో కొంతమంది శరీర ఉష్ణోగ్రతను పెంచుకునేందుకు వేడి నీళ్లు తాగుతుంటారు. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు వేడి నీటిని తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎసిడిటీ, అల్సర్, కిడ్నీ, గుండె సమస్యలున్న వారు, జ్వరంతో ఉన్నప్పుడు వేడి నీళ్లు తాగకూడదు. గర్భిణుల్లో బిడ్డపై చెడు ప్రభావం పడుతుంది. పొట్టలో ఆమ్లతత్వం పెరిగి జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి గోరువెచ్చని నీటినే తాగాలి.
పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావటం సాధారణం. కానీ కొంతమంది తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. అయితే భరించలేనంత నొప్పికి డిప్రెషన్ కారణమని ఓ అధ్యయనంలో తేలింది. డిప్రెషన్కి కారణమయ్యే జన్యువుల్లో కొన్ని పీరియడ్స్ నొప్పిని కలిగిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. భావోద్వేగాల్లో మార్పు నొప్పిని పెంచుతుందట. నిద్రలేమి సమస్య ఈ నొప్పిని మరింత ఎక్కువ చేస్తుందట.
నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటేషన్లపై పనిచేస్తున్న 9 మంది వైద్యులు, 15 మంది వివిధ క్యాటగిరీ సిబ్బంది తక్షణమే వారి వారి స్థానాలకు వెళ్లాలని DMHO వి. సుజాత ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా జిల్లాలోని వివిధ PHCలలో పని చేసే అన్ని రకాల కేటగిరి సిబ్బంది డిప్యూటేషన్లు రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.
ASR: పాడేరు మండలం మినుములూరు పీహెచ్సీని డీఎంహెచ్వో డాక్టర్ జమాల్ భాషా గురువారం తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. అనంతరం పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అన్ని వార్డులు పరిశీలించారు. ఆసుపత్రిలో నిల్వ ఉన్న మందులు పరిశీలించారు. పీహెచ్సీలో సుఖ ప్రసవాలు అధికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నెల్లూరు జిల్లా సర్వజన ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారిగా గురువారం మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఏవోకు ఆసుపత్రి పర్యవేక్షకులు సిద్ధనాయక్, అభివృద్ధి కమిటీ సభ్యులు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.. ఆసుపత్రి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి సౌకర్యాల కల్పనలో ముందు ఉంటామన్నారు.
✦ లివర్ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది.✦ రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.✦ గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.✦ మెదడు కణాలు చురుగ్గా పనిచేస్తాయి.✦ అల్జీమర్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.✦ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ✦ కంటి చూపు మెరుగుపడుతుంది.
1. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.2. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.3. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది.4. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.5. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.6. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.7. గుండె, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.8. ఎముకలను బలంగా మారుస్తుంది.
మహిళలకు పలు దశల్లో హార్మోన్ల అసమతుల్యత, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే ఆహారంలో మనం చేర్చుకునే కొన్ని పదార్థాల వల్ల ఈ సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పాలకూర, ఆపిల్, బొప్పాయి, దోస, జీలకర్ర, అల్లం వంటివి జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. మెనోపాజ్ దశలో వచ్చే మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. రక్తహీనత దరిచేరదు.
VZM: గుర్ల మండలంలో డయేరియా మళ్లీ పడగ విప్పింది. ఈ మండలాన్ని డయేరియా వీడడం లేదు. అధికారక లెక్కల ప్రకారం రెండు నెలల క్రితం డయేరియా బారిన పడి సుమారు 10 మంది మృత్యువాత పడ్డారు. మాజీ సీఎం జగన్, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ సైతం గుర్లలో పర్యటించి బాధితులను పరామర్శించారు. తాజాగా జమ్ము గ్రామంలో ఆరు కేసులు నమోదు కావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
SKLM: రూరల్ మండలం పొన్నం గ్రామ సచివాలయ ప్రాంగణంలో గురుగు లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం మెడికవర్ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయబడతాయి. కార్యక్రమంలో పంచాయతీ తెలుగుదేశం సీనియర్ నాయకులు దుంగ ఆనందరావు, కోటక్ నాయకులు పాల్గొననున్నారని లక్ష్మణ్ తెలిపారు.
కొంతమంది టీ తాగుతూ స్మోక్ చేస్తుంటారు. వీటి కలయిక ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ రక్తప్రవాహాన్ని పెంచగా.. సిగరెట్లు రక్తంలో ఆక్సిజన్ను నియంత్రిస్తాయి. అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నికోటిన్ నాడీవ్యవస్థను ప్రేరేపించి, ప్రేగుల్లో కదలికలను పెంచుతుంది. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి బారినపడతారు. జీర్ణ సమస్యలు వస్తాయి.