లోకంలో కొందరు ఎప్పుడూ ఎదుటివారిలో తప్పులు వెతకడానికే ప్రయత్నిస్తుంటారని విదురుడు చెప్పారు. ఒక దుర్మార్గుడు ఇతరులలో ఉన్న ఆవగింజ అంత చిన్న తప్పును కూడా భూతద్దంలో చూసి విమర్శిస్తాడు. కానీ, తనలో ఉన్న మారేడు కాయ అంత పెద్ద తప్పును కూడా ఏమాత్రం గమనించడు, తెలిసినా అంగీకరించడు. ఎప్పుడూ పక్కవారి లోపాలు ఎత్తిచూపే వారు తమను తాము ఎప్పటికీ సరిదిద్దుకోలేరని విదుర నీతి సారాంశం.