యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ను వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కర్కు సూచించాడు. ‘అజిత్.. తర్వాతి సిరీస్లోనే వైభవ్ ఆడాలి. నిజానికి అతడు టీ20 ప్రపంచకప్ జట్టులోనే ఉండాల్సింది. బుమ్రా వంటి బౌలర్లనైనా అలవోకగా ఎదుర్కోగల సత్తా ఆ కుర్రాడికి ఉంది’ అని వ్యాఖ్యానించాడు.
IPL 2026 సీజన్లో ఇప్పటివరకు ఐదు సెంచరీలు నమోదయ్యాయి. ఢిల్లీపై సంజూ శాంసన్ (115*), పంజాబ్పై క్వింటన్ డికాక్ (112*), ఢిల్లీపై అభిషేక్ శర్మ (135*), గుజరాత్పై తిలక్ వర్మ (101*) సెంచరీలు సాధించగా.. నిన్న ముంబైపై సంజూ శాంసన్ (101*) మరో అద్భుత సెంచరీ బాదాడు. విశేషమేమిటంటే, ఈ సీజన్లో సెంచరీ చేసిన బ్యాటర్లంతా నాటౌట్గా నిలవడం గమనార్హం.
MIతో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేయడంతో సంజూ శాంసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబైపై సెంచరీ చేసిన తొలి CSK బ్యాటర్గా సంజూ నిలిచాడు. అంతేకాకుండా, ఒక IPL సీజన్లో 2 సెంచరీలు చేసిన CSK ప్లేయర్గానూ రికార్డు సృష్టించాడు. ఇక IPLలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో KL రాహుల్(5 సెంచరీలు)తో కలిసి సంజూ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
CSKతో జరిగిన మ్యాచ్లో ముంబై ఘోర పరాభం పాలైంది. తాజాగా ఈ అంశంపై MI హెడ్ కోచ్ మహేలా జయవర్దనే స్పందించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్తో రాణించాడని, సీజన్ మొదటి కొన్ని మ్యాచ్లలో బౌలింగ్లో కూడా రాణించాడని గుర్తు చేశాడు. ప్రత్యర్ధులపై ప్రభావం చూపడంలో జట్టు మొత్తం వైఫల్యం చెందిందని పేర్కొన్నాడు. ప్లేయర్లంతా త్వరలోనే రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ఓటములకు పాండ్యానే బాధ్యుడిని చేస్తూ, అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ముంబై కెప్టెన్సీ పగ్గాలను మరోసారి ‘హిట్ మ్యాన్’కు అప్పగించాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో MI యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
తండ్రి కూలీ, ఇంట్లో కనీస వసతులు లేవు. ఒకప్పుడు విరిగిన హాకీ స్టిక్ను గుడ్డతో కట్టుకుని ఆడిన నౌషీన్ నాజ్.. ఇవాళ దేశం గర్వించేలా ఎదుగుతోంది. మధ్యప్రదేశ్కు చెందిన ఈ 15 ఏళ్ల బాలిక, జాతీయ స్థాయిలో 9 గోల్స్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’ అవార్డు గెలుచుకుంది. పేదరికాన్ని, విమర్శలను దాటుకుంటూ జపాన్లో జరిగే అండర్-18 ఆసియా కప్కు ఎంపికయ్యే దిశగా దూసుకుపోతోంది.
ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెథెల్ ఇవాళ RCB తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2026 సీజన్ ప్రారంభం నుంచి ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ వంటి ఓవర్సీస్ ఆటగాళ్ల మధ్య పోటీ ఉండటంతో బెథెల్కు ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే ఇవాళ గుజరాత్తో జరగనున్న మ్యాచ్లో షెపర్డ్ స్థానంలో బెథెల్కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఫిఫా రీసేల్ సైట్లో కేవలం నాలుగు ప్రత్యేక టికెట్లు అమ్మకానికి రాగా.. వాటి ధర ఒక్కో టికెట్ ధర 2.3 మిలియన్ డాలర్లు(రూ.21 కోట్లు)గా ఉండటంతో SMలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు.. ‘ఇది టికెటా లేక విల్లా ధరనా?’ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
చెన్నైతో జరిగిన మ్యాచ్లో ముంబై కంకషన్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ జరుగుతుండగా MI ప్లేయర్ శాంట్నర్ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా శార్దూల్ ఠాకుర్ను జట్టులోకి తీసుకుంది. అయితే, IPL నిబంధనల ప్రకారం ఆటగాడి తల, మెడకు గాయమైనప్పుడే కంకషన్ సబ్స్టిట్యూట్ వర్తిస్తుందని నెట్టింట విమర్శలు వస్తున్నాయి.
నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్లో CSK అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అకీల్ హోసేన్ తన స్పిన్ మాయాజాలంతో 4/17 అద్భుతంగా రాణించి.. ముంబై పతనాన్ని శాసించాడు. అయితే, యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఈ మ్యాచ్ తర్వాత మొత్తం 14 వికెట్లతో మళ్లీ పర్పుల్ క్యాప్ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే అకీల్ హోసేన్ ఆ క్యాప్ను అన్షుల్ కాంబోజ్కు అందజేసి అభినందించాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు సందర్భంగా బీసీసీఐ స్పెషల్ విషెస్ తెలిపింది. 664అంతర్జాతీయ మ్యాచ్లు, 34,357 పరుగులు, 100 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ అని పేర్కొంది. టీమిండియా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2011 విజయ యాత్రలో సభ్యుడు, దిగ్గజ సచిన్ టెండూల్కర్కు శుభాకాంక్షలు అని ‘X’ వేదికగా రాసుకొచ్చింది.
ముంబైపై విజయం అనంతరం CSK స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను జట్టు కోసమే ఆడితే సెంచరీ రివార్డ్గా లభించిందని తెలిపాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యమని స్పష్టం చేశాడు. తనకున్న అనుభవంతో ఆటను అర్థం చేసుకున్నానని అన్నాడు. తమది యువ జట్టు.. కానీ వరుసగా మూడు ఓటముల తర్వాత తమ టీమ్ చూపించిన పోరాటం అద్భుతం అని కొనియాడాడు.
చెన్నెతో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలవడంపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘పవర్ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్లో వెనుకబడిపోయాం. CSK అద్భుతంగా బ్యాటింగ్తో 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. మేమే ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. మా స్పిన్నర్లు కూడా బాగానే బౌలింగ్ చేశారు. కానీ సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’ అని తెలిపాడు.
IPL 2026లో ముంబై పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా 4 ఓటముల తర్వాత GTపై గెలవడంతో గాడిలో పడింది అనుకున్నారు కానీ ఏం మారలేదు. ఇవాళ చెన్నై చేతిలో ఏకంగా 103 రన్స్ తేడాతో IPL చరిత్రలోనే ఘోర ఓటమిని చవిచూసింది. సూర్య(36), తిలక్(37) మినహా ఎవరూ 7+ పరుగులు చేయలేదంటేనే జట్టు ఆటతీరును అర్థం చేసుకోవచ్చు. రోహిత్ నాయకత్వంలో ఇలాంటి ప్రదర్శనను ఎప్పుడూ చూడలేదని కామెంట్ చేస్తున్నారు.