RRతో జరుగుతున్న మ్యాచ్లో MI కేవలం 5.1ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. MI స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ డకౌట్గా వెనుదిరగగా.. రికెల్టన్, తిలక్ వర్మ, నమన్ ధీర్ స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం 5.3 ఓవర్లలో 44/4 గా ఉంది. క్రీజులో సూర్యకుమార్(17*), విల్ జాక్స్(5*) గా ఉన్నారు.
IPL-2026లో భాగంగా లక్నో, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్తో సచిన్ కుమారుడు, అర్జున్ టెండూల్కర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ సందర్భంగా సచిన్ కుమార్తె సారా స్పందిస్తూ.. ‘నువ్వు ఈ ప్రపంచంలోని అన్ని సంతోషాలకు అర్హుడివి. నీ కష్టపడే తత్వం, ఒత్తిడిని అధిగమించే నీ నైపుణ్యం, ఈ ప్రయాణంలో నువ్వు చూపించిన ఓపికను చూస్తే నాకు గర్వంగా ఉంది. లవ్ యు తమ్ముడు’ అని రాసుకొచ్చింది.
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో RR పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులకే పరిమితమయింది. అయితే ఈ మ్యాచ్లో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్కు వెళ్తుంది. కానీ MI బౌలర్ల ధాటికి RR బ్యాటర్లు వరుస వికెట్లు కోల్పోయారు. RR స్టార్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వైభవ్ సూర్యవంశీ తక్కువ పరుగలకే వెనుదిరిగారు.
RRతో మ్యాచ్ నేపథ్యంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 29 లక్షల మంది ప్రజలకు సహాయం అందించి వారి జీవితాల్లో మార్పు తెచ్చారు. ఇందులో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. ప్రతి ఏడాది ఆ ఫౌండేషన్ కోసం ఒక మ్యాచ్ ఆడుతాం. మేం కేవలం ఆ పిల్లల కోసం మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం’ అని అన్నాడు.
రాజస్థాన్ రాయల్స్కు మళ్లీ షాక్ తగిలింది. స్వల్ప స్కోర్కే యువ విధ్వంసం వైభవ్ సూర్యవంశీ (4) ఔట్ అయ్యాడు. దీపక్ చాహర్ (4.1వ ఓవర్) వేసిన తొలి బంతికే భారీ షాట్ యత్నించగా.. నమన్ క్యాచ్ అందుకుని పెవిలియన్ చేర్చగా.. రియాన్ పరాగ్ కూడా క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. RR.. 6 ఓవర్లు ముగిసేసరికి 54/3గా ఉంది.
RRతో జరుగుతున్న మ్యాచ్లో MI ప్లేయర్ విల్ జాక్స్ అద్బుత ఫీల్డింగ్తో అదరగొట్టాడు. RR యువ విధ్వంసం వైభవ్ సూర్యవంశీ తొలి బంతిని సిక్స్గా మార్చేందుకు ప్రయత్నించగా.. బౌండ్రి లైన్ వద్ద ఉన్న విల్ జాక్స్ పక్షిలాగా గాల్లోకి ఎగిరి ఆ బాల్ను అడ్డుకున్నాడు. దీంతో సిక్స్ వెళ్లాల్సిన బాల్ కేవలం ఒక్క పరుగుగా మారడంతో వైభవ్ నిరాశ చెందాడు.
వాంఖడే వేదికగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్లో 14 పరుగులతో ఉన్న RR ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ఫ్లేఆఫ్స్కు వెళ్లాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఇప్పటికే IPL-2026 నుంచి ఎలిమినేట్ అయిన ముంబై ఈ మ్యాచ్ గెలిచి విజయంతో టోర్నిని ముగించాలని భావిస్తోంది. మరి విజయం ఎవరిని వరిస్తోందో కామెంట్ చేయండి.
IPL-2026లో భాగంగా ఇవాళ్టి చివరి లీగ్ మ్యాచ్కు ముందు ముంబై జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. గాయపడిన క్వింటన్ డికాక్, రాజ్ అంగద్ బవాల స్థానంలో మహిపాల్ లోమ్రార్, రుచిత్ అహిర్ను జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో వెనుకబడిన ముంబై, చివరి మ్యాచ్లో రాజస్థాన్ను ఓడించి గెలుపుతో టోర్నీని ముగించాలని చూస్తోంది.
IPLలో మ్యాచుకు ముందు సహచర ఆటగాళ్లతో మీటింగ్ పెట్టి వారిని ఒత్తిడికి గురి చేయనని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. కీలక మ్యాచుల్లో జట్టు సభ్యులకు స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కల్పిస్తానని, వారు అతిగా ఆలోచించే అవకాశం కల్పించనని తెలిపాడు. పరాజయాలకు కుంగిపోకుండా జట్టులో సభ్యులను ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ.. సానుకూల విజయాలను సాధిస్తున్నట్లు చెప్పాడు.
IPLలో ఏ జట్టైనా హోమ్ గ్రౌండ్లో చెలరేగిపోతుంది. అద్భుత విజయాలను అందుకుంటుంది. అయితే LSG పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. 2025 నుంచి లక్నోలో LSG 14 మ్యాచులు ఆడగా.. కేవలం 4 విజయాలే నమోదు చేసింది. దీంతో హోమ్ గ్రౌండ్ LSGకి కలసి రావడం లేదని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సీజన్లోనైనా తమ జట్టు ఆటతీరు మారితే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
IPLలో పంజాబ్ ప్లేఆఫ్స్కు చేరాలంటే.. నేడు MIతో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోవాలి. RR గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్కు చేరుతుంది. ఈ తరుణంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘మా ప్లేఆఫ్స్ బెర్తుకోసం మా ఆశలన్నీ MI – RR మ్యాచ్పైనే ఉన్నాయి. మా అభిమానులు ముంబైకి మద్దతివ్వాలని ఆశిస్తున్నా. రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు.
ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. స్పెయిన్ స్టార్ అల్కరాజ్ మణికట్టు గాయంతో టోర్నీనుంచి తప్పుకోగా, వరల్డ్ నంబర్వన్ యానిక్ సినెర్(ఇటలీ)పై అందరి దృష్టి నిలిచింది. తన 25వ టైటిల్ వేటలో ఉన్న జొకోవిచ్ మరోసారి పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల విభాగంలో వరల్డ్ నంబర్వన్ సబలెంకా తన తొలి ఫ్రెంచ్ టైటిల్ను సాధించాలని పట్టుదలగా ఉంది.
సూపర్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొమ్మిదో రౌండ్లో అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో ప్రజ్ఞ గేమ్ను డ్రా చేసుకున్నాడు. మొత్తంగా 4.5 పాయింట్లతో మరో నలుగురు ప్లేయర్లతో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. విన్సెంట్ కెమర్ (జర్మనీ) తొమ్మిదో రౌండ్లో విజయంతో 6 పాయింట్లతో టైటిల్ సాధించాడు.