ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ అరుదైన రికార్డు సాధించాడు. లక్నోపై 39 బంతుల్లో చేసిన 69 పరుగులతో రెండు వేర్వేరు సీజన్లలో (2025, 2026) 500+ పరుగులు చేసిన తొలి ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. కాగా, ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సెంచరీ (101*) చేయడంతో లక్నోపై పంజాబ్ 7 వికెట్లతో గెలిచి, 15 పాయింట్లతో 4వ స్థానానికి చేరింది.