ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో భాగంగా 105/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన భారత్ 149 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ముందు 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతీకా రావల్(63) ఒంటరి పోరాటం చేసింది. స్మృతి మంధాన(2), జెమీమా(14), షెఫాలీ(5), హర్మన్ప్రీత్(11), దీప్తి(9) విఫలమయ్యారు.
➤ T20 WC 2007: కివీస్ 190 రన్స్ చేయగా.. ఛేదనలో ధోనీసేనకు గంభీర్-సెహ్వాగ్ శుభారంభం అందించారు. కానీ వెటోరీ బౌలింగ్ ధాటికి భారత్ 10 రన్స్ తేడాతో ఓడింది. ➤ T20 WC 2016: ప్రత్యర్థిని 126/7కే కట్టడి చేసిన ధోనీసేన.. ఛేదనలో చేతులెత్తేసి 47 రన్స్ తేడాతో ఓడింది. ➤ T20 WC 2021: ఒక్కరూ 30 రన్స్ చేయకపోవడంతో కోహ్లీసేన 110/7కే పరిమితం కాగా ప్రత్యర్థి 8 వికెట్ల తేడాతో గెలిచింది.
T20 వరల్డ్ కప్ టైటిల్ కోసం ఇవాళ భారత్-న్యూజిలాండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ హైఓల్టేజ్ పోరుకు వర్షం ముప్పేమీ లేదు. ఒకవేళ వర్షం లేదా మరో కారణంగా మ్యాచ్ ఇవాళ సాధ్యం కాకుంటే, రిజర్వ్ డే అయిన రేపు నిర్వహిస్తారు. ఫలితం కోసం కనీసం 5 ఓవర్ల ఆట ఆడే పరిస్థితి లేకుంటే.. భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
భారత్ vs ఆస్ట్రేలియా ఏకైక టెస్ట్ 3వ రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్లో 105/6 స్కోరుతో 2వ రోజు ఆట ముగించిన హర్మన్ సేన.. ఇంకా 20 రన్స్ వెనకబడి ఉంది. క్రీజులో ప్రతిక(43), స్నేహ్ రాణా(14) ఉన్నారు. ఇప్పటికే T20, ODI సిరీస్లు కోల్పోయిన నేపథ్యంలో.. ఈ టెస్టు కాపాడుకోవాలంటే వీరిద్దరూ నిలబడి పోరాడాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 198, ఆసీస్ 323 చేశాయి.
T20 WC 2024 విజయం తర్వాత రోహిత్ నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న సూర్య జట్టును అద్భుతంగా నడిపించాడు. అయితే T20 WCలో పెద్ద జట్లపై అతనికి చెప్పుకోదగ్గ స్కోర్స్ లేవనే విమర్శలున్నాయి. పైగా ఇవాళ్టి ఫైనల్ తర్వాత రిటైర్ అవుతాడనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘సారథిగా బెస్ట్ ఇన్నింగ్స్ ఆడేందుకు సూర్యకు ఇదే బెస్ట్ ఛాన్స్, అదే అతని బాధ్యత’ అని సూచించాడు.
న్యూజిలాండ్ సీనియర్ బౌలర్ లీ తహుహు వన్డేలకు వీడ్కోలు పలికింది. వన్డేల్లో దేశానికి 100+ సార్లు ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ ఊహించలేదని, ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోడానికి ఇది సమయమని ఆమె పేర్కొంది. అయితే ఈ ఏడాది జూన్-జూలైలో వరల్డ్ కప్ టైటిల్ను డిఫెండ్ చేసేందుకు లీ T20ల్లో కొనసాగనుంది. ఇక 15 ఏళ్ల కెరీర్లో లీ 103 వన్డేల్లో 125, 98* T20ల్లో 95 వికెట్లు తీసింది.
ఆస్ట్రేలియా మహిళా జట్టుతో ఏకైక టెస్టులో భారత్ ఓటమి అంచున నిలిచింది. రెండో రోజు ఆట ముగిసేసరికి 2వ ఇన్నింగ్స్లో భారత్ 105/6 స్కోరుతో 20 రన్స్ వెనకబడి ఉంది. ఇప్పటికే T20, ODI సిరీసులు కోల్పోయి నేపథ్యంలో.. ఈ టెస్ట్ అయినా గెలవాలంటే క్రీజులో ఉన్న ప్రతికా రావల్(43), స్నేహ్ రాణా(14) నిలబడి పోరాడితేనే సాధ్యం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 198, ఆస్ట్రేలియా 323 స్కోర్ చేశాయి.
భారత్ షట్లర్ లక్ష్యసేన్ ఇవాళ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2026 టైటిల్ పోరులో లిన్ చున్(కెనడా)తో తలపడనున్నాడు. టోర్నీచరిత్రలో అతనికి ఇది రెండో ఫైనల్ కాగా.. 2022లో రన్నరప్గా నిలిచాడు. దీంతో ఈ సారైనా టైటిల్ కొట్టాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నాడు. భారత్ తరఫున చివరిసారిగా పుల్లెల గోపీచంద్ 2001లో ‘ఆల్ ఇంగ్లండ్’ టైటిల్ను గెలుచుకున్నాడు.
హైదరాబాద్ వేదికగా ఇవాళ్టి నుంచి మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ టోర్నీ జరగనుంది. ఇందులో భాగంగా ఇవాళ భారత జట్టు ఉరుగ్వే తలపడనుంది. ఈ ఏడాది ఆగస్ట్ 14-30 తేదీల్లో బెల్జియం-నెదర్లాండ్స్లో జరిగే వరల్డ్ కప్లో మొత్తం 16 జట్లు తలపడనుండగా.. ఇప్పటికే 9 బెర్తులు ఖాయమయ్యాయి. ఈ క్వాలిఫైయర్స్లో తొలి 3 స్థానాల్లో నిలిచిన జట్లు టోర్నీకి అర్హత సాధిస్తాయి.
భారత్-న్యూజిలాండ్ మధ్య ఇవాళ జరిగే T20 WC ఫైనల్కు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లను కంగారు పెట్టే పిచ్లలో ఇది ముందుంటుంది. ఏ రోజు ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టం. IND vs SA సూపర్ 8 మ్యాచ్లో అదే జరిగింది. అయితే ఇవాళ్టి మ్యాచ్ కోసం ఎర్ర, నల్ల మట్టి కలిపిన పిచ్ ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.
T20 WC 2026 తుది దశకు చేరుకుంది. ఇవాళ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ మ్యాచ్కు ముందు అట్టహాసంగా ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. వేడుకల్లో గ్లోబల్ పాప్ సూపర్ స్టార్ రికీ మార్టిన్తో పాటు భారతీయ ప్రముఖ గాయకులు ఫాల్గుణి పాఠక్, సుఖ్ బీర్ సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2026లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లాడు. ఇవాళ సెమీఫైనల్లో కెనడాకు చెందిన విక్టర్ లైపై లక్ష్యసేన్ 21-16, 18-21, 21-15 స్కోరుతో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. రేపు జరిగే ఫైనల్లో తైవాన్ ఆటగాడు లిన్ చున్-యితో లక్ష్య సేన్ తలపడనున్నాడు.
క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్, పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో ట్రోఫీ కోసం తలపడనుంది. అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోరును స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లేదా JioHotstar యాప్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
‘విజయ్-రష్మిక నన్ను మీ పెళ్లికి ఎందుకు పిలవలేదు?’ అంటూ ఓ చిన్నారి అడిగిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై విజయ్ స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘బుజ్జితల్లి.. నిన్ను ఇంటికి లంచ్కు పిలుస్తాను. నీకు ఇష్టమైన ఫుడ్, స్వీట్స్ చెబితే అన్నీ ఇంట్లోనే చేయించుకుని తిందాం’ అంటూ ఆ వీడియో కింద కామెంట్ చేశాడు. చిన్నరి పట్ల విజయ్ చూపిన ఈ ఆప్యాయతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
న్యూజిలాండ్తో జరగనున్న ఫైనల్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. మ్యాచ్కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్య మాట్లాడుతూ.. తొలుత బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోరు చేస్తామనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అన్నాడు. అయితే గతంలో తమ జట్టు 250 పైచిలుకు భారీ స్కోర్లను సాధించినట్లు గుర్తు చేశాడు.