భారత్పై సెంచరీతో ఆకట్టుకున్న జాకబ్ బెథెల్(105) అరుదైన ఘనత సాధించాడు. ICC వైట్ బాల్ నాకౌట్స్లో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా మార్టిన్ గప్టిల్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ODI WC నాకౌట్స్లో గప్టిల్(2015లో 237*) టాప్ స్కోరర్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో గంగూలీ(2000లో 141*)-సచిన్(1998లో 141). T20 WC నాకౌట్స్లో బెథెల్దే రికార్డ్.
ఇంగ్లండ్తో T20 WC సెమీస్లో చివరి ఓవర్ వేసేది తానే అని తెలిసినప్పడు కొంత భయమేసిందని శివమ్ దూబే పేర్కొన్నాడు. సెమీస్లో చివరి ఓవర్ అంటే సవాలేనని, మ్యాచ్ ఫలితాన్ని మార్చగల తొలి 2 బంతులపై చాలా ఫోకస్ చేశానని తెలిపాడు. ఇక 30 పరుగులను డిఫెండ్ చేసే క్రమంలో దూబే వేసిన తొలి బంతికే.. నిలదొక్కుకుని ఆడుతున్న బెథెల్ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ భారత్ సొంతమైంది.
తొలి T20 WC ట్రోఫీ కోసం న్యూజిలాండ్ రేపు భారత్తో తలపడనుంది. INDతో T20ల్లో 18-11తో వెనకబడినా.. T20 WCలో తలపడిన 3 సందర్భాల్లోనూ ఆ జట్టుదే విజయం. పైగా కెప్టెన్ శాంట్నర్, రచిన్, సోధితో IND కంటే బలమైన స్పిన్ అటాక్ కివీస్ సొంతం. టోర్నీలో IND బ్యాటింగ్ సగటు 27.31 అయితే NZది 41.68. ఇంకా IND ప్లేయర్లు 11 సార్లు డకౌట్ కాగా NZ బ్యాటర్లు 2 సార్లే అలా వెనుదిరిగారు.
భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. 96/3 స్కోరుతో తొలి రోజు ఆట ముగించిన ఆసీస్.. ఇంకా 102 రన్స్ వెనకబడి ఉంది. క్రీజులో పెర్రీ(43), అనాబెల్(20) ఉన్నారు. అటు తొలి ఇన్నింగ్స్లో హర్మన్ సేన 198 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్ చేయకుండా ప్రత్యర్థిని నిలువరించాలంటే.. ఇవాళ భారత్ ధాటిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
AP: తిరుమలలో బిగ్బాస్ ఫేమ్ తనూజ బర్తడే సందర్భంగా కేక్ కట్ చేయడంతో రేగిన వివాదంపై దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వివరణ ఇచ్చారు. తిరుమలలో కేక్ కట్ చేయకూడదనే విషయం తమకు తెలియదని, తనూజతో తాము ఎగ్లెస్ కేక్నే కట్ చేయించామని పేర్కొన్నారు. తామే కేక్ తెచ్చామని, ఇందులో తనూజ పాత్ర ఏ మాత్రం లేదని తెలిపారు.
➤ 1983 ODI WC, 2007 T20 WCలో ZIM చేతిలో AUS ఓడింది.. IND టైటిల్ నిలిచింది. ఇప్పుడూ AUS అంతే ఓడింది ➤ 2011 ODI WCలో SA చేతిలో ఓడిన IND టైటిల్ గెలిచింది. ఇప్పుడూ IND ఓడింది. ➤ సొంతగడ్డపై ODI WC గెలిచిన జట్టుగా IND 2011లో నిలిచింది. స్వదేశంలో ఎవరూ గెలవలేకపోయిన T20 WCకి ఇప్పుడు INDనే హోస్ట్. ➤ T20 WC 2024లో ENGపై సెమీస్, ఆపై […]
అంచనాలకు తగ్గట్టుగా భారత్ మళ్లీ T20 WC ఫైనల్కు చేరి, రేపు న్యూజిలాండ్తో తలపడేందుకు సిద్ధమైంది. అయితే టోర్నీలో ఇప్పటివరకు డిఫెండింగ్ ఛాంపియన్ కానీ, ఆతిథ్య జట్టు కానీ టైటిల్ గెలవలేదు. ఈ సారి భారత్ డిఫెండింగ్ ఛాంపియన్, అలాగే టోర్నీ ఆతిథ్య జట్టు. ఈ నేపథ్యంలో రేపటి తుదిపోరులో సూర్యసేన గెలిస్తే.. 19 ఏళ్ల T20 WC చరిత్రలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఈ 2 ఘనతలను అందుకుంటుంది.
నెల రోజులుగా క్రికెట్ ప్రపంచానికి వినోదం పంచిన T20 వరల్డ్ కప్ తుదిదశకు చేరుకుంది. వరుసగా 2వ సారి ఈ టైటిల్ సొంతం చేసుకునేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ రేపు అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. టైటిల్ నిలుపుకోవాలని సూర్యసేన.. T20 ఫార్మాట్లో తొలి ICC టైటిల్ సాధించాలని శాంట్నర్ నేతృత్వంలోని కివీస్ భావిస్తున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
T20 WCలో టీమిండియాకు బలంగా మారతాడనుకున్న అభిషేక్ శర్మ.. పెద్ద తలనొప్పిగా మారాడు. పసికూన జింబాబ్వేపై 55 మినహా.. ప్రదర్శన అంతా పేలవం. పదేపదే ప్రత్యర్థి వ్యూహానికి దొరికిపోతున్నాడు. దీంతో రేపు న్యూజిలాండ్తో జరిగే టైటిల్ పోరు నుంచి అతణ్ని తప్పించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే రింకూ కూడా రాణించలేకపోతుండటంతో ఫైనల్లో అభిషేక్నే ఆడించే అవకాశాలు ఎక్కువ.
AP: రాష్ట్ర రాజధాని అమరావతిపై చిన్నజీయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఏర్పడిన అమరావతి రాజధానిని మధ్యలో కొందరు తరలించాలని చూశారన్నారు. అయితే స్వామి కృపతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని పేర్కొన్నారు. ఇక 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి అమరావతి రాజధాని పనులను వేగవంతం చేసింది. ఈ క్రమంలో చిన్నజీయర్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధన్యత సంతరించుకున్నాయి.
గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గానూ ఈనెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు కేంద్ర క్రీడాశాఖ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ నిర్వహించనుంది. కేంద్ర క్రీడాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత ఒలింపిక్ సంఘం, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఛత్తీస్గఢ్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. రాయ్పూర్, జగ్దల్పూర్, సర్గుజాలో పోటీలు నిర్వహించనున్నారు.
T20 WC నిర్వాహకులపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరోసారి మండిపడ్డాడు. ఓవర్ మధ్యలో DJ ప్లే చేయడం వల్ల ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డాడు. గతంలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లోనూ అనవసరంగా లేజర్ షో ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశాడు. కాగా, ఇంగ్లండ్తో మ్యాచ్లో బుమ్రా బౌలింగ్ వేస్తుండగా, ఓవర్ మధ్యలోనే డీజే ప్లే చేయడంపై అసహనం వ్యక్తం చేశాడు.
T20 WC ఫైనల్ మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా నిలిచిపోతే, రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే, రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అయితే, ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. కాగా, అహ్మదాబాద్ వేదికగా ఈనెల 8న భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే తుది పోరులో వర్షం పడే అవకాశమే లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) కొత్త కమిటీపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారులు ప్రాథమిక విచారణను ప్రారంభించారు. HCA కొత్త కమిటీపై నిధుల దుర్వినియోగంతో పాటు పలు అక్రమాలకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. CID విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
T20 WC ఫైనల్ అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా జరగనుండటం భారత అభిమానులను కలవరపెడుతోంది. ఎందుకంటే, ఇదే స్టేడియంలో భారత్ 2023 ODI WC ఫైనల్లో ఓడింది. అలాగే, ప్రస్తుత T20 WC S-8 దశలో కూడా సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. గత 30 ICC మ్యాచ్ల్లో భారత్ ఓడిన 2 మ్యాచ్లు కూడా ఇదే స్టేడియంలో కావడం గమనార్హం. మొత్తంగా ఈ స్టేడియంలో 10 మ్యాచ్లు ఆడితే.. 7W, 3L.