T20 WC: భారత బౌలర్ వరుణ్ గత 4 మ్యాచుల్లో ఆశించినట్లుగా రాణించలేకపోతున్నాడు. 16 ఓవర్లలో 4 వికెట్లే తీసి ఏకంగా 186 రన్స్ సమర్పించుకున్నాడు. వరుణ్లో కాన్ఫిడెన్స్ లోపించడమే ఇందుక్కారణమని మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. తానే కెప్టెన్ అయితే వరుణ్ని ఈ 2 రోజులు ప్రాక్టీస్, ఆటకు దూరంగా ఉంచి నేరుగా ఫైనల్లో దించుతానని పేర్కొన్నాడు.
T20 WC ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ నామినీలుగా ICC 8 మంది పేర్లను ప్రకటించింది. ఈ రేసులో సంజూ శాంసన్తో పాటు విల్ జాక్స్(ENG), షాహిబ్దాదా ఫర్హాన్(PAK), లుంగి ఎంగిడి(SA), మార్క్రమ్(SA), రచిన్ రవీంద్ర(NZ), వాన్ స్కాల్క్విక్(USA), టిమ్ సీఫర్ట్(NZ) ఉన్నారు. అసోసియేట్ జట్ల నుంచి ఎంపికైన స్కాల్క్విక్ ఈ టోర్నీలో ఇప్పటికీ టాప్ వికెట్ టేకర్(13)గా ఉన్నాడు.
సెమీస్లో ఇంగ్లండ్పై విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ T20 WCలో అత్యధింగా 4 సార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. ఇక అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన జట్ల లిస్టులో శ్రీలంక-పాక్(3) రెండో స్థానంలో ఉన్నాయి. అలాగే పాక్(2007 & 2019), లంక(2012 & 2014) తర్వాత వరుసగా రెండో సారి ఫైనల్స్కు చేరిన జట్టుగానూ భారత్(2025 & 2026 నిలిచింది.
T20 WCలో తన స్థాయి ఆట ఆడలేకపోతున్న అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ మద్దతుగా నిలిచాడు. న్యూజిలాండ్తో ఆదివారం జరిగే టైటిల్ పోరులో విధ్వంసం సృష్టిస్తాడేమో.. ఎవరికి తెలుసని పేర్కొన్నాడు. సాధారణంగా తొలి బంతి నుంచే బౌండరీలు బాదే అభిషేక్.. ఈ టోర్నీ తొలి 3 ఇన్నింగ్స్ల్లో డకౌట్ అయ్యాడు. నిన్న సెమీస్లోనూ 9 పరుగులకే వెనుదిరిగాడు.
ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్లో భారత్ టాస్ ఓడింది. అటు టాస్ నెగ్గిన కంగారూల కెప్టెన్ ఆలీసా హేలీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆమెకు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే చివరి మ్యాచ్. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటికే T20, వన్డే సిరీస్లు కోల్పోయిన హర్మన్ సేన.. ఇందులోనైనా విజయం సాధించాలని భావిస్తోంది.
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్(SPMCL)లో 3 సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు. BE/BTechలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల 35 ఏళ్ల లోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి నెలకు రూ.50 వేల జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం వెట్సైట్: https://www.spmcil.com/en/discover-spmcil/
T20 WC సెమీస్లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడని భారత్, ఇంగ్లండ్ కెప్లెన్లు సూర్య, బ్రూక్ కితాబిచ్చారు. చక్కగా బ్యాటింగ్ చేస్తున్న ప్రత్యర్థిని కట్టడి చేయడంలో బుమ్రా రాణించాడని.. ఇతర బౌలర్లూ ఇంగ్లండ్ గెలవకుండా చేశారని సూర్య అన్నాడు. బుమ్రా అత్యుత్తమ బౌలర్ అని బ్రూక్ పేర్కొన్నాడు. ముఖ్యంగా అక్షర్ పట్టిన తన క్యాచ్ తాను చూసినవాటిల్లో బెస్ట్ అని చెప్పాడు.
ఇంగ్లండ్తో సెమీస్లో వరుణ్ తన మార్క్ ప్రదర్శన చేయలేకపోగా.. ఏకంగా 64 రన్స్ సమర్పించుకున్నాడు. దీంతో T20 WC ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న భారత్ బౌలర్గా వరుణ్(64/1) నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ జోగిందర్ శర్మ(2007లో 57/0 vs ENG) పేరిట ఉండేది. ఓవరాల్గా USA బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్(65/0 vs IND) అగ్రస్థానంలో ఉన్నాడు.
T20 WC సెమీస్లో రనౌట్ అవ్వడంతో శివమ్ దూబే(43) ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఒకే ఎడిషన్ టోర్నీలో అత్యధికంగా 3 సార్లు రనౌటయిన ఆటగాడిగా నిలిచి, 19 ఏళ్ల నాటి MS ధోనీ రికార్డ్ సమం చేశాడు. ఈ టోర్నీలో దూబే నమీబియా, పాక్, ఇంగ్లండ్ మ్యాచ్ల్లో రనౌట్ కాగా.. 2007 టోర్నీలో ధోనీ న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా మ్యాచ్ల్లో ఇలాగే వెనుదిరిగాడు.
ఇంగ్లండ్పై T20 WC సెమీస్ విజయంతో భారత్ ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా 253/7 స్కోర్ చేసిన సూర్యసేన అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. T20 ఫార్మాట్లో అత్యధికంగా 6 సార్లు 250+ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. గతంలో ఈ రికార్డ్ IPL టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్(5) పేరిట ఉండేది. విండీస్(3)-జింబాబ్వే(3) మూడో స్థానంలో ఉన్నాయి.
భారత్తో T20 WC సెమీస్లో అద్భుత ఇన్నింగ్స్(105) ఆడిన ఇంగ్లండ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన ఫస్ట్ క్లాస్(టెస్ట్ ఫార్మాట్), లిస్ట్-A(వన్డే), T20 సెంచరీలను సాధించిన తొలి- ఏకైక క్రికెటర్గా నిలిచాడు. సాధారణంగా ప్లేయర్లు తమ తొలి సెంచరీ(3 ఫార్మాట్లు)ని డొమెస్టిక్, ఫ్రాంచైజీ క్రికెట్లో నమోదు చేస్తుంటారు.
➤ జాకబ్ బెథెల్ – 105 vs IND (2026 సెమీస్)➤ ఫిన్ ఆలెన్ – 100* vs SA (2026 సెమీస్)➤ తిలకరత్నే దిల్షాన్ – 96* vs WI (2009 సెమీస్)➤ విరాట్ కోహ్లీ – 89 vs WI (2016 సెమీస్)➤ సంజూ శాంసన్ – 89 vs ENG (2026 సెమీస్)☞ ఇందులో 3 ప్రస్తుత టోర్నీలోనే నమోదవడం విశేషం.
టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లండ్పై విజయం సాధించి టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో టీమిండియాపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశంసలు కురిపించారు. భారత్ విజయం మహాద్భుతమని తెలిపారు. ‘సెమీఫైనల్స్లో ఇంగ్లండ్ను ఓడించి.. ఫైనల్స్కు దూసుకెళ్లిన ఇండియా క్రికెట్ జట్టు సభ్యులకు అభినందనలు. ఫైనల్లో ఇండియా విజయం సాధిస్తుంది’ అని పోస్ట్ చేశారు.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత అమ్మాయిలు ఇవాళ్టి నుంచి ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్లో తలపడనున్నారు. మ్యాచ్ పెర్త్ వేదికగా ఉ.10:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 6 సిరీస్ల్లో భారత్ ఒక్కటే గెలిచింది. మరో 2 డ్రా కాగా.. 3 కంగారూల సొంతమయ్యాయి. ఈ పర్యటనలో ఇప్పటికే T20, వన్డే సిరీస్లను కోల్పోయిన భారత్ ఇందులోనైనా రాణించాలని చూస్తోంది.
T20 WC-2026లో భాగంగా టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీ ఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్పై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. కాగా, 2021 టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. అందులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ప్రస్తుతం T20 ఫైనల్లోనూ న్యూజిలాండ్, భారత్ తలపడనున్నాయి.