• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

BREAKING: ఆసక్తికర పోరు.. టాస్ గెలిచిన ముంబై

వాంఖడే వేదికగా చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఆతిథ్య ముంబై జట్టు టాస్ గెలిచింది. దీంతో MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఇరుజట్లూ ఇప్పటికే చెరో 6 మ్యాచ్‌లాడగా.. CSK 2, MI 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇప్పటి వరకు IPLలో ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన MI, CSK జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

April 23, 2026 / 07:01 PM IST

బెతెల్‌ నువ్వు భారత్‌లోనే ఉండు: మాజీ క్రికెటర్

IPL-2026లో ఇంగ్లండ్ ప్లేయర్ బెతెల్‌‌ను RCB కొనుగోలు చేసింది. అతడికి ఇప్పటి వరకు ఆడే అవకాశం రాకపోవడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ స్పందిస్తూ.. ఇంగ్లండ్ వెళ్లిపోవాలని సూచించాడు. కానీ, దీనిపై మరో మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. బెతెల్‌ను ఇక్కడే ఉండమని చెప్పాడు. అంతర్జాతీయ ఆటగాళ్లతో ఉండే అవకాశం IPLతో సాధ్యమని, ఈ విషయంలో కుక్‌కు ఏమీ తెలియదని అన్నాడు.

April 23, 2026 / 05:42 PM IST

ధోనీ అభిమానులకు BAD NEWS

ముంబైతో ఇవాళ జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడతాడని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడట్లేదని క్రీడా వర్గాలు వెల్లడించాయి. గాయం నుంచి కోలుకుంటున్నాడని, ఇవాళ్టి మ్యాచ్‌లో అందుబాటులో ఉండడని పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 26న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి.

April 23, 2026 / 04:58 PM IST

BREAKING: CSKలోకి కొత్త ప్లేయర్

ఇవాళ ముంబైతో జరగనున్న మ్యాచ్‌లో CSK జట్టులోకి కొత్త ప్లేయర్ రానున్నాడు. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయపడి టోర్నీ నుంచి వైదొలిగడంతో అతడి స్థానంలో ఆకాష్ మధ్వాల్‌కు అవకాశం వచ్చింది. ఇతడు 2023, 24 సీజన్లలో ముంబై జట్టులో ఉన్నాడు. డెత్ ఓవర్లలో కీలక బౌలర్‌గా రాణించాడు. కాగా, ఈ నెల 18న SRHతో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే గాయపడ్డ విషయం తెలిసిందే.

April 23, 2026 / 04:46 PM IST

‘ప్లేయర్లను గాడిదల్లా చూస్తున్నారు’

IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ BCCIపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. IPL-2026 షెడ్యూల్, ఆ తర్వాత భారత్ ఆడబోయే సిరీస్‌ల మధ్య తగినంత విరామం లేకపోవడం దారుణమని మండిపడ్డాడు. BCCI కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టిందని, ఆటగాళ్ల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నాడు. ప్లేయర్లకు వారి కుటుంబాలతో గడిపే సమయం ఇవ్వాలని.. కేవలం డబ్బు సంపాదించే యంత్రాల్లా(గాడిదల్లా) చూడటం ఆపాలన్నాడు.

April 23, 2026 / 04:35 PM IST

‘ఆ కుర్రాడు ఆడటమే ఒక అద్భుతం’

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 56 పరుగులు ఇచ్చిన మయాంక్ యాదవ్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌ను ఇయాన్ బిషప్ ఖండించారు. దాదాపు ఏడాది తర్వాత గాయం నుంచి కోలుకుని, మళ్లీ 150 కి.మీల వేగంతో బౌలింగ్ చేయడమే ఒక అద్భుతమని అన్నారు. ఆ కుర్రాడిపై విమర్శలు చేయడం దారుణమని, అతని కంట్రోల్ కాలక్రమేణా వస్తుందని, ప్రస్తుతం అతని ఫిట్‌నెస్ కోసం ప్రార్థించాలని బిషప్ పేర్కొన్నారు.

April 23, 2026 / 04:16 PM IST

రాజస్థాన్ కీలక ప్లేయర్‌కు జరిమానా

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంలో బౌలర్ నాండ్రీ బర్గర్ కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తేలడంతో ఈ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు బర్గర్‌కు 10 శాతం మ్యాచ్‌ ఫీజులో జరిమానా విధిస్తూ ఐపీఎల్ ప్రకటన జారీ చేసింది. అలాగే అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది.

April 23, 2026 / 04:01 PM IST

‘థలా’ ఎంట్రీ ఖాయమేనా..?

మరికాసేపట్లో ముంబై వేదికగా CSK, MI జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ధోనీ ఆడనున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. దీంతో ఎంతో కాలంగా ధోనీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే CSK కీలక ప్లేయర్ ఆయుష్ మాత్రే గాయపడగా.. అతడి స్థానంలో ధోనీ వస్తాడని ‘థలా’ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

April 23, 2026 / 03:49 PM IST

మయాంక్‌కు మద్దతుగా కామెంటేటర్

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో పేసర్ మయాంక్ యాదవ్ భారీగా పరుగులు ఇవ్వడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై దిగ్గజ కామెంటేటర్ ఇయాన్ బిషప్ స్పందిస్తూ అతడికి మద్దతుగా నిలిచారు. ‘కేవలం ఒక్క మ్యాచ్‌ ఆధారంగా ఆ కుర్రాడిని నెగెటివ్‌గా జడ్జ్ చేయడం సరికాదు. అతడి వేగాన్ని, ప్రతిభను గుర్తించాలి’ అని పేర్కొన్నాడు.

April 23, 2026 / 03:36 PM IST

వారు మా జట్టులో ఉండడం అదృష్టం: కెప్టెన్

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. అయితే ఈ విజయంపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ సంతృప్తిగా లేకపోవడం గమనార్హం. తమ జట్టు బ్యాటింగ్ విభాగంలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. పవర్ ప్లేలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ వంటి బౌలర్లు తమ జట్టులో ఉండటం అదృష్టం అని పేర్కొన్నాడు.

April 23, 2026 / 02:43 PM IST

ఈ అవార్డు ఆ స్పెషల్ వ్యక్తికి అంకితం: జడేజా

LSGతో జరిగిన మ్యాచ్‌లో RR ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ అవార్డును గుజరాత్ విద్యాశాఖ మంత్రి, తన భార్య రివాబాకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తాను అద్భుతాలు చేస్తానని ఆమె చెప్పినట్లు జడ్డూ వెల్లడించాడు. అలాగే, పూరన్‌ను ఔట్ చేసిన తర్వాత చేసుకున్న ‘పాకెట్’ సంబరాలు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనే అని చెప్పుకొచ్చాడు.

April 23, 2026 / 01:03 PM IST

మ్యాచ్‌కు ముందు కార్టూన్స్ చూస్తాను: వైభవ్

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పటికీ టీవీలో కార్టూన్స్‌ చూస్తానని తెలిపాడు. ప్రతి మ్యాచ్‌కు ముందు ఇలా కార్టూన్లు చూసే అలవాటు ఉందన్నాడు. దీంతో చాలా రిలాక్స్ అవుతానని చెప్పుకొచ్చాడు. ఇలా ఆడాలి.. అలా ఆడాలని బుర్ర బద్దలు కొట్టుకోనని, మ్యాచ్‌లోకి దిగితే తన దృష్టి అంతా గేమ్ పైనే ఉంటుందని వెల్లడించాడు.

April 23, 2026 / 12:39 PM IST

కోహ్లీ టీమ్‌మేట్.. ఇప్పుడు IPLలో అంపైర్

విరాట్ కోహ్లీ సహచరుడు, 2008 అండర్-19 ప్రపంచకప్ సభ్యుడు అజితేష్ అర్గల్ అంపైర్ అవతారం ఎత్తాడు. IPL 2026లో భాగంగా LSG, RR జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో డెబ్యూ చేశాడు. ప్రపంచకప్ తర్వాత అతడిని పంజాబ్ కింగ్స్ తీసుకున్నప్పటికీ ఒక్క IPL మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా, జనవరి 22న GT, UP మధ్య జరిగిన WPL 2026లోనూ అర్గల్ అంపైర్‌గా వ్యవహరించాడు.

April 23, 2026 / 10:46 AM IST

రోహిత్‌ను క్షమించమని అడిగా: మాజీ చీఫ్ సెలక్టర్

BCCI సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ జట్టుకు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై విచారం వ్యక్తం చేశాడు. గతేడాది అతడిని కలిసినప్పుడు ‘నన్ను క్షమించు’ అని అడిగినట్లు పేర్కొన్నాడు. కావాలని తాము నిర్ణయం తీసుకోలేదని.. బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్లను తీసుకోవాలని భావించినట్లు వెల్లడించాడు.

April 23, 2026 / 08:53 AM IST

భారత్‌కు 3 రజతాలు, కాంస్యం 

ISSF జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో రెండో రోజు భారత్‌కు మూడు రజతాలు, ఒక కాంస్యం వరించాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ పురుషుల ఈవెంట్లో రోహిత్ కన్యన్ భారత్‌కు తొలి రజతం అందించాడు. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సెజల్ కాంబ్లే రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రాజ్‌చంద్ర, అభినవ్ దేశ్వాల్ రజతం, కాంస్యం సాధించారు.

April 23, 2026 / 06:37 AM IST