T20 WCలో రన్స్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతున్న అభిషేక్పై క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫామ్లో లేనప్పుడు నెట్ ప్రాక్టీస్ కంటే విరామం తీసుకోవడం మంచిదని.. అప్పుడే మానసికంగా బలం చేకూరుతుందని సూచించాడు. ఒత్తిడిని అధిగమించేందుకు బ్యాటింగ్ ప్రాక్టీస్ బదులు బైలింగ్, ఫీల్డింగ్ కోసం సాధన చేయాలని.. అంతమాత్రానికే బ్యాటింగ్ స్కీల్స్ ఏటూ పోవన్నాడు.
T20 WC వేళ ఓ పాక్ క్రికెటర్ శ్రీలంకలోని గోల్డెన్ క్రౌన్ హోటల్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. లంకతో సూపర్-8 పోరుకు ముందు ఆ ప్లేయర్.. హౌస్ కీపింగ్ మహిళను వేధించాడు. గమనించిన తోటి సిబ్బంది ఆమెను రక్షించి.. హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై యాజమాన్యం పాక్ టీమ్ మేనేజర్ నవైద్ చీమాకు చెప్పగా.. ఆయన క్షమాపణలు కోరి, సదరు ఆటగాడికి భారీగా ఫైన్ విధించాడు.
T20 WCలో టీమిండియా ఫీల్డింగ్ ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 13 క్యాచులు చేజార్చింది. ఇంగ్లండ్తో సెమీస్ ముంగిట దీనిపై బౌలింగ్ కోచ్ మోర్కెల్ మాట్లాడుతూ.. ఎవరూ కావాలని క్యాచులు వదిలేయరని, టోర్నీ ముందు నుంచే ఫీల్డింగ్పై టీమ్ చాలా ఫోకస్ చేసిందని పేర్కొన్నాడు. అనుకోకుండా చేజార్చిన క్యాచులపై సమాధానం ఇవ్వడం కూడా కష్టమేనని చెప్పుకొచ్చాడు.
అన్ని మ్యాచులను ఒకే మైదానం(దుబాయ్)లో ఆడటమే CT-2025లో భారత్కు కలిసొచ్చిందంటూ.. ఆ విజయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నజిర్ హుసేన్, మైఖేల్ అథర్టన్ గతంలో తక్కువ చేసి మాట్లాడారు. దీనిపై తాజాగా దినేష్ కార్తీక్.. T20 WCలో లంక స్వదేశంలో, పాక్ దాదాపు అన్ని మ్యాచులూ కొలంబోలో ఆడిందని, మరి ఈ 2 జట్లు ఎందుకు సరైన ప్రదర్శన చేయలేకపోయాయని వారిని నిలదీశాడు.
T20 WC సెమీస్లో ఓటమి చెప్ప దెబ్బలా అనిపిస్తోందని సౌతాఫ్రికా కెప్టెన్ ఐడన్ మార్క్రమ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్పై తమ ఆట నిరుత్సాహపరిచిందని, మళ్లీ బలంగా తిరిగొస్తామని చెప్పాడు. కాగా ఈ టోర్నీ గ్రూప్, సూపర్-8 దశ నుంచి వరుస విజయాలతో అజేయంగా సెమీస్కు చేరిన సౌతాఫ్రికాకు ఇదే తొలి ఓటమి. గత టోర్నీలోనూ అజేయంగా ఫైనల్కు చేరిన ప్రొటీస్ భారత్ చేతిలో ఓడింది.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు MS ధోనీ కారుకు రాంచీ పోలీసులు రూ.1000 ఫైన్ విధించారు. ఈ నెల 1న కాంకే రింగ్ రోడ్లోని బిర్సా వ్యవసాయ వర్సిటీ సమీపంలో అతని లగ్జర్ కార్ ఓవర్ స్పీడ్తో వెళ్లింది. దీన్ని గుర్తించిన ఆటోమేటిక్ కెమెరాలు ధోనీ కారుపై చలానా జారీ చేశాయి. అయితే ఆ సమయంలో ధోనీ కారులో ఉన్నాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
సంజూ శాంసన్ ఎంతో ఆదరణ గల క్రికెటర్ అని, కీలక మ్యాచ్లో విండీస్పై అతని ఇన్నింగ్స్(97*) అద్భుతమని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. అతనికీ కోహ్లీ, రోహిత్, ధోనీ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని.. కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులు చూశాడని DK చెప్పుకొచ్చాడు. చాలా టాలెంటెడ్ ప్లేయర్ అని, ఈడెన్ గార్డెన్స్లో అదే చూయించాడని అన్నాడు.
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ ఆలెన్ T20 WC నాకౌట్స్లో సెంచరీ(100*) చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అలాగే అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ 17 ఏళ్ల నాటి తిలకరత్నే దిల్షాన్(2009లో 96* vs WI) రికార్డ్ బ్రేక్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ(2016లో 89* vs WI), ఆలెక్స్ హేల్స్(2022లో 86* vs IND) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
T20 WC సెమీస్: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ ఆలెన్ 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో విధ్వంసకర అజేయ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతను ఒకే ఎడిషన్ T20 WCలో అత్యధికంగా 20* సిక్సర్లు బాదిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్మెయిర్(19) రికార్డ్ బ్రేక్ చేశాడు. షాహిబ్జాదా ఫర్హాన్(18) మూడో స్థానంలో ఉన్నారు. ఈ 3 రికార్డులూ ఈ టోర్నీలోనే నమోదవడం విశేషం.
సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే (100*) అద్భుత శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని అలెన్ నమోదు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్కు న్యూజిలాండ్ దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో సెమీఫైనల్లో కివీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. సీఫెర్ట్ (58), ఫిన్ అలెన్(100*) మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగారు. రేపు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో.. ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ తలపడనుంది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. కేవలం 8.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (28 బంతుల్లో), ఫిన్ అలెన్ (19 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించారు. న్యూజిలాండ్ విజయానికి ఇంకా 62 పరుగుల దూరంలో ఉంది.
రేపు భారత్తో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత స్పిన్నర్ల నుంచి తమ జట్టుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందన్నాడు. నెంబర్ వన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం తమ బ్యాటర్లకు సవాలేనని, అతని బౌలింగ్లో పరుగులు రాబట్టడం కష్టమని చెప్పాడు. స్పిన్నర్లను ఆడటంలో తమకు మంచి రికార్డు లేదని గుర్తు చేశాడు.
న్యూజిలాండ్తో జరుగుతున్న T20 WC సెమీస్లో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. కివీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 169/8 పరుగులు చేసింది. ఒక దశలో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును స్టబ్స్ (29), యాన్సన్(55) ఆదుకున్నారు. బ్రెవిస్ 34 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో మెక్కాంచీ, రవీంద్ర, హెన్రీ తలో 2 వికెట్లు తీశారు.