T20 WCలో ఆల్ రౌండర్ శివమ్ దూబె బౌలర్గా పెద్ద ప్రభావం చూపలేకపోయాడు. అంతేకాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వెస్టిండీస్తో మ్యాచ్లో దూబేకు బౌలింగ్ కూడా ఇవ్వలేదు. దీనిపై తాజాగా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ.. దూబెపై నమ్మకం ఉందని, అతడిని ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసన్నాడు. సెమీస్లో దుబే బౌలింగ్ సేవలను ఉపయోగించుకుంటామని తెలిపాడు.
సౌతాఫ్రికాతో సెమీస్లో న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరి ధాటికి సఫారీ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 10.2 ఓవర్లలోనే 77 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. మార్క్రమ్(18), మిల్లర్ (6)లను రవీంద్ర పెవిలియన్ చేర్చగా.. దూకుడుగా ఆడుతున్న బ్రెవిస్(34)ను నీషమ్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో స్టబ్స్, యాన్సన్ ఉన్నారు.
సంజూ శాంసన్ పట్టుదలను భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కొనియాడాడు. ‘సంజూ నెట్స్లో ఎప్పుడూ కష్టపడి ప్రాక్టీస్ చేస్తాడు. అవకాశం వచ్చినప్పుడు కీలక మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. కష్టకాలంలోనూ ఆశ కోల్పోకుండా, పట్టుదలగా శ్రమించినందుకే ఈ విజయం దక్కింది’ అని మోర్కెల్ పేర్కొన్నాడు. వెస్టిండీస్పై సంజూ ఆడిన ఇన్నింగ్స్ అతనిలోని అసలైన క్లాస్ను చూపించిందన్నాడు.
టీ20 ప్రపంచకప్ సెమీస్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన రికెల్టన్ తర్వాతి బంతికే డకౌట్గా వెనుదిరిగాడు. స్పిన్నర్ కోల్ మెక్కాంచీ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి కివీస్కు శుభారంభం అందించాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండనుండటంతో కెప్టెన్ శాంట్నర్ ఛేజింగ్కే మొగ్గుచూపాడు. ఇప్పటివరకు T20 WCల్లో కివీస్తో జరిగిన 5 మ్యాచ్ల్లోనూ సఫారీలే గెలిచారు. అయితే, ICC నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం కివీస్దే పైచేయిగా ఉంది.
సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో, భారత్-వెస్టిండీస్ మ్యాచ్ తరహాలోనే ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, రాత్రి వేళ మంచు ప్రభావం ఎక్కువగా ఉండనుండటంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్కే మొగ్గుచూపే ఛాన్స్ ఉంది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. గత కొన్ని మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవడం విశేషం. ఇషాన్ కిషన్ 4వ స్థానంలో, తిలక్ 6వ స్థానంలో, సూర్య 7వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు, సంజూ శాంసన్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంకుకు చేరుకోవడం గమనార్హం.
టీ20 ప్రపంచకప్లో మరికాసేపట్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ పోరు మొదలుకానుంది. ఇప్పటివరకు T20 WCలో వీరిద్దరి మధ్య జరిగిన 5 మ్యాచ్ల్లోనూ సఫారీలే గెలిచారు. అయితే, ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం కివీస్దే పైచేయిగా ఉంది. మరి ఈసారి ఆ నాకౌట్ ఫోబియాను దాటి సౌతాఫ్రికా ఫైనల్ చేరుతుందా? లేక కివీస్ మరోసారి ఆధిపత్యాన్ని చాటుతుందా? కామెంట్ చేయండి.
టీ20 ప్రపంచకప్లో మరికాసేపట్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ పోరు మొదలుకానుంది. ఇప్పటివరకు T20 WCల్లో వీరిద్దరి మధ్య జరిగిన 5 మ్యాచ్ల్లోనూ సఫారీలే గెలిచారు. అయితే, ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం కివీస్దే పైచేయిగా ఉంది. మరి ఈసారి ఆ నాకౌట్ ఫోబియాను దాటి సౌతాఫ్రికా ఫైనల్ చేరుతుందా? లేక కివీస్ మరోసారి ఆధిపత్యాన్ని చాటుతుందా? కామెంట్ చేయండి.
వెస్టిండీస్పై ఆడిన ఇన్నింగ్స్తో సంజూ శాంసన్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన దినేష్ కార్తీక్.. సంజూకు ఉన్న క్రేజ్ సామాన్యమైంది కాదన్నాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్లకు ఏమాత్రం తగ్గకుండా సంజూకు అభిమానులున్నారని పేర్కొన్నాడు. కెరీర్లో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా.. అభిమానులు మాత్రం సంజూను గుండెల్లో పెట్టుకున్నారని కొనియాడాడు.
WCలో పాకిస్తాన్ వైఫల్యంపై దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు కొలంబోలోనే ఉంటూ అక్కడి పిచ్లపై పట్టు సాధించినప్పటికీ సెమీస్కు చేరుకోకపోవడం ఆశ్చర్యకరమని అన్నాడు. గత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఒకే గ్రౌండ్లో ఆడటం వల్ల అద్భుతంగా రాణించిందని కొందరు చేసిన విమర్శలను గుర్తు చేశాడు. అదే సూత్రం ప్రకారం పాక్ కూడా ఈ టోర్నీలో రాణించాల్సిందని విమర్శించాడు.
MS ధోనీకి రాంచీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు రూ. 1,000 జరిమానా విధించారు. రాంచీలో తన నివాసం సమీపంలో ధోనీ ప్రయాణిస్తున్న వాహనం అతివేగంగా వెళ్లినట్లు ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించింది. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 183 కింద ట్రాఫిక్ పోలీసులు ధోనీ పేరు మీద ఈ-చలాన్ జారీ చేశారు. ధోనీ ప్రస్తుతం IPL 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నారు.
T20 వరల్డ్ కప్ భారత్లో వ్యూయర్షిప్ రికార్డ్ సృష్టించినట్లు ICC ఛైర్మన్ జైషా ప్రకటించారు. భారత్లో ఇప్పటికే 500 మిలియన్లు దాటిందని, T20 WCను గతంలో ఎన్నడూ ఇంతమంది చూడలేదని పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి నాకౌట్ మ్యాచులు జరగనున్న నేపథ్యంలో మరిన్ని రికార్డ్లు బ్రేక్ అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.
T20 WCలో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ప్లేయర్లకు PCB ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్లేయర్లంతా హెడ్ కోచ్ మైక్ హెసన్పై బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కనీసం తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఆరోపించినట్లు సమాచారం. కాగా కోచ్ నిర్ణయాలు తీసుకుంటూ కెప్టెన్ ఆఘాను డమ్మీ చేశారని ఇటీవల పాక్ జర్నలిస్టులు కూడా ఫైరయ్యారు.