T20 WC ఫైనల్ అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా జరగనుండటం భారత అభిమానులను కలవరపెడుతోంది. ఎందుకంటే, ఇదే స్టేడియంలో భారత్ 2023 ODI WC ఫైనల్లో ఓడింది. అలాగే, ప్రస్తుత T20 WC S-8 దశలో కూడా సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. గత 30 ICC మ్యాచ్ల్లో భారత్ ఓడిన 2 మ్యాచ్లు కూడా ఇదే స్టేడియంలో కావడం గమనార్హం. మొత్తంగా ఈ స్టేడియంలో 10 మ్యాచ్లు ఆడితే.. 7W, 3L.
భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌటైంది. జెమిమా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, షఫాలీ వర్మ (35), కాశ్వీ గౌతమ్ (34) పర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 96/3 పరుగులు చేసింది. పెర్రీ(43), సదర్లాండ్(20) క్రీజులో ఉన్నారు.
సెమీఫైనల్లో తాము ఓడిపోవడానికి అక్షర్ పటేల్ అందుకున్న రెండు అద్భుతమైన క్యాచ్లే కారణమని ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్ అభిప్రాయపడ్డాడు. అక్షర్ పట్టుకున్న బ్రూక్, జాక్స్ క్యాచ్లే మ్యాచ్ను తమ నుంచి దూరం చేశాయని వ్యాఖ్యానించాడు. ఒత్తిడి సమయాల్లో అక్షర్ అసాధారణమైన ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. తాము ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండాల్సిందని పేర్కొన్నాడు.
భారత్తో సెమీస్లో ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బెథల్ (22 ఏళ్లు) తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఒంటరి పోరాటం చేస్తూ దాదాపు ఇంగ్లండ్ను గెలిపించినంత పని చేశాడు. ఇంగ్లండ్ ఓడిపోయినప్పటికీ, బెథల్ పోరాటం అభిమానుల మనసులను గెలుచుకుంది. అయితే, 2022లో IND-ENG సెమీస్ను బెథల్ స్టేడియంలో కూర్చుని ప్రేక్షకుడిలా చూశాడు. కేవలం నాలుగేళ్లలోనే స్టార్గా ఎదగడం విశేషం.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 198 పరుగులకే ఆలౌటైంది. జెమిమా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, షఫాలీ వర్మ (35), కాశ్వీ గౌతమ్ (34) పర్వాలేదనిపించారు. అయితే స్టార్ ప్లేయర్లు స్మృతి (4), హర్మన్ప్రీత్ (19), దీప్తి (7) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 4, హామిల్టన్ 3, డార్సీ బ్రౌన్ 2 వికెట్లు పడగొట్టారు.
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో బ్రూక్ వికెట్ తీయడం ద్వారా బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఈ మైలురాయిని చేరుకున్న 8వ భారత బౌలర్గా నిలిచాడు. టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టీ20Iల్లో 117 వికెట్లు పడగొట్టాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మొత్తం 34 సిక్సర్లు నమోదయ్యాయి. భారత బ్యాటర్లు 19 సిక్సర్లు బాదగా, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు వచ్చాయి. దీంతో టీ20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్గా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్లో నమోదైన 31 సిక్సర్ల రికార్డును ఈ మ్యాచ్ అధిగమించింది.
భారత్ చేతిలో ఎదురైన ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన తప్పిదం వల్లే ఈ మ్యాచ్లో ఓడిపోయామని బ్రూక్ భావోద్వేగానికి గురయ్యాడు. సంజూ శాంసన్ ఇచ్చిన సులువైన క్యాచ్ను తను జారవిడిచి ఉండాల్సింది కాదన్నాడు. అదే తాను చేసిన అతిపెద్ద తప్పని వ్యాఖ్యానించాడు. బ్రూక్ క్యాచ్ మిస్ చేయడంతో సంజూ 89 పరుగులతో మ్యాచ్ను భారత్ వైపు తిప్పేశాడు.
T20 WCలో అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్ల్లో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తొలగించాలనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ కోచ్ రవిశాస్త్రి అభిషేక్కు మద్దతుగా నిలిచాడు. ఫైనల్లో అతడిని ఆడించాలని, తుది జట్టులో మార్పులు అవసరం లేదని సూచించాడు. ఫైనల్లో అభిషేక్ రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పరుగుల వరద పారింది. రెండు జట్లు కలిసి ఏకంగా 499 పరుగులు సాధించాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. గతంలో ఈ రికార్డు 2016 WCలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ (459 పరుగులు) పేరిట ఉండేది. అయితే, ఈ మ్యాచ్ కూడా వాంఖడే స్టేడియంలోనే జరగటం గమనార్హం.
T20 WC 2026 టైటిల్ కోసం ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తుది పోరుకు అహ్మదాబాద్ వేదిక కావడం క్రికెట్ అభిమానులను కలవర పెడుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023లో అజేయంగా రాణించిన రోహిత్ సేన ఇక్కడే ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ ఓడింది. ICC టోర్నీల్లో వరుసగా 13 మ్యాచుల్లో గెలిచిన భారత్ విజయ పరంపరకు కూడా ఇక్కడే సౌతాఫ్రికా బ్రేక్ వేసింది.
T20 WC 2026 టైటిల్ కోసం ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తుది పోరుకు అహ్మదాబాద్ వేదిక కావడం క్రికెట్ అభిమానులను కలవర పెడుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023లో అజేయంగా రాణించిన రోహిత్ సేన ఫైనల్లో ఇక్కడే ఆసీస్ చేతిలో ఓడింది. ICC టోర్నీల్లో వరుసగా 13 మ్యాచుల్లో గెలిచిన భారత్ విజయ పరంపరకు కూడా ఇక్కడే సౌతాఫ్రికా బ్రేక్ వేసింది.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈ ఆదివారం న్యూజిలాండ్తోT20 WC 2026 టైటిల్ పోరులో తలపడనుంది. రోహిత్ సారథ్యంలో T20 WC 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజేతగా నిలిచిన టీమిండియా.. ఇప్పుడు సూర్య కెప్టెన్సీలో ఈ టోర్నీపై కన్నేసింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్పై గెలిస్తే.. 2013-2024 మధ్య ఒక్క ICC టైటిల్ కూడా గెలవలేకపోయిన భారత్కు ఇది హ్యాట్రిక్ ICC టైటిల్ అవుతుంది.
భారత మాజీ ప్లేయర్లు ద్రవిడ్, అశ్విన్ ఓ క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్(ETPL)లో గ్లాస్గో(స్కాట్లాండ్) బేస్డ్ ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు ఇండియన్ కన్సార్షియంలో వారూ భాగస్వాములు అవుతున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ETPLలో ఐర్లాండ్, నెదర్లాండ్స్, నార్తర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్ నుంచి మొత్తం 6 జట్లు తలపడనున్నాయి.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ బ్యాటర్లు తడబడుతున్నారు. దీంతో భారత్ టీ బ్రేక్ సమయానికి 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 99 రన్స్ చేసింది. దీప్తి శర్మ(4), జెమీమా(15) క్రీజులో ఉండగా.. అంతకుముందు స్మృతి(4), షఫాలీ(35), ప్రతిక(18), కెప్టెన్ హర్మన్(19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ 2, డార్సీ, ల్యూసీ చెరో వికెట్ తీశారు.