IPL 2026: చెన్నై విసిరిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై తడబడుతోంది. పవర్ ప్లే ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 29 పరుగులే చేసింది. ప్రస్తుతం క్రీజులో తిలక్(9), సూర్య(11) ఉన్నారు. అంతకుముందు డీకాక్ 7 రన్స్ చేయగా.. డానిష్ మలేవార్, నమన్ ధిర్ డకౌట్ అయ్యారు. చెన్నై బౌలర్లలో అకీల్ హుసేన్ 2, ముకేష్ చౌదరి ఓ వికెట్ పడగొట్టారు.
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై కేవలం 2.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయింది. డికాక్ 10 బంతుల్లో కేవలం 7 పరుగులు చేసి ఔట్ అవగా.. డానిష్ మాలేవార్, నమన్ ధీర్ డకౌట్గా వెనుదిరిగారు. CSK బౌలర్లు హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ చౌదరి ఒక వికెట్ తీశాడు. 3 ఓవర్లు పూర్తయ్యేసరికి క్రీజులో తిలక్ వర్మ(0), సూర్యకుమార్(5) ఉన్నారు.
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై కేవలం 2.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయింది. డికాక్ 10 బంతుల్లో కేవలం 7 పరుగులు చేసి ఔట్ అవగా.. డానిష్ మాలేవార్, నమన్ ధీర్ డకౌట్గా వెనుదిరిగారు. CSK బౌలర్లు హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ చౌదరి ఒక వికెట్ తీశాడు. 3 ఓవర్లు పూర్తయ్యేసరికి క్రీజులో తిలక్ వర్మ(0), సూర్యకుమార్(5) ఉన్నారు.
ఐపీఎల్లో ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో CSK 207/6 పరుగులు చేసింది. సంజూ శాంసన్ అద్భుత సెంచరీ(101*)తో అదరగొట్టి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. కెప్టెన్ రుతురాజ్(22), బ్రెవిస్ (21) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లు AM ఘజన్ఫర్ రెండు వికెట్లు పడగొట్టగా.. సాంట్నర్, అశ్వనీ కుమార్, బుమ్రా తలో వికెట్ తీశారు.
ముంబైతో జరగుతున్న మ్యాచ్లో CSK బ్యాటర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ (53*) చేశాడు. కేవలం 26 బంతుల్లోనే అర్థ శతకం నమోదు చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అదరగొట్టాడు అతడితో పాటు క్రీజులో బ్రెవిస్(17*) ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ 22 పరుగులకే ఔటయ్యాడు. 10.3 ఓవర్లకు CSK స్కోర్ 117/3.
సన్ రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్కు మద్దతు పెరుగుతోంది. ప్యాట్ కమిన్స్ జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ.. కిషన్నే కెప్టెన్గా కొనసాగించాలని మాజీ క్రికెటర్లు సంజయ్ బంగర్, హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. జట్టులో కిషన్కు మంచి సమన్వయం ఉందని, యువ కెప్టెన్ను ప్రోత్సహిస్తే జట్టుకు మేలు జరుగుతుందని వారు విశ్లేషించారు.
వాంఖడే వేదికగా చెన్నైతో జరగనున్న మ్యాచ్లో ఆతిథ్య ముంబై జట్టు టాస్ గెలిచింది. దీంతో MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఇరుజట్లూ ఇప్పటికే చెరో 6 మ్యాచ్లాడగా.. CSK 2, MI 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇప్పటి వరకు IPLలో ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన MI, CSK జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
IPL-2026లో ఇంగ్లండ్ ప్లేయర్ బెతెల్ను RCB కొనుగోలు చేసింది. అతడికి ఇప్పటి వరకు ఆడే అవకాశం రాకపోవడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ స్పందిస్తూ.. ఇంగ్లండ్ వెళ్లిపోవాలని సూచించాడు. కానీ, దీనిపై మరో మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. బెతెల్ను ఇక్కడే ఉండమని చెప్పాడు. అంతర్జాతీయ ఆటగాళ్లతో ఉండే అవకాశం IPLతో సాధ్యమని, ఈ విషయంలో కుక్కు ఏమీ తెలియదని అన్నాడు.
ముంబైతో ఇవాళ జరిగే మ్యాచ్లో ధోనీ ఆడతాడని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మ్యాచ్లో ధోనీ ఆడట్లేదని క్రీడా వర్గాలు వెల్లడించాయి. గాయం నుంచి కోలుకుంటున్నాడని, ఇవాళ్టి మ్యాచ్లో అందుబాటులో ఉండడని పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 26న గుజరాత్తో జరిగే మ్యాచ్లో అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి.
ఇవాళ ముంబైతో జరగనున్న మ్యాచ్లో CSK జట్టులోకి కొత్త ప్లేయర్ రానున్నాడు. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయపడి టోర్నీ నుంచి వైదొలిగడంతో అతడి స్థానంలో ఆకాష్ మధ్వాల్కు అవకాశం వచ్చింది. ఇతడు 2023, 24 సీజన్లలో ముంబై జట్టులో ఉన్నాడు. డెత్ ఓవర్లలో కీలక బౌలర్గా రాణించాడు. కాగా, ఈ నెల 18న SRHతో జరిగిన మ్యాచ్లో ఆయుష్ మాత్రే గాయపడ్డ విషయం తెలిసిందే.
IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ BCCIపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. IPL-2026 షెడ్యూల్, ఆ తర్వాత భారత్ ఆడబోయే సిరీస్ల మధ్య తగినంత విరామం లేకపోవడం దారుణమని మండిపడ్డాడు. BCCI కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టిందని, ఆటగాళ్ల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నాడు. ప్లేయర్లకు వారి కుటుంబాలతో గడిపే సమయం ఇవ్వాలని.. కేవలం డబ్బు సంపాదించే యంత్రాల్లా(గాడిదల్లా) చూడటం ఆపాలన్నాడు.
రాజస్థాన్తో మ్యాచ్లో 56 పరుగులు ఇచ్చిన మయాంక్ యాదవ్పై నెటిజన్ల ట్రోలింగ్ను ఇయాన్ బిషప్ ఖండించారు. దాదాపు ఏడాది తర్వాత గాయం నుంచి కోలుకుని, మళ్లీ 150 కి.మీల వేగంతో బౌలింగ్ చేయడమే ఒక అద్భుతమని అన్నారు. ఆ కుర్రాడిపై విమర్శలు చేయడం దారుణమని, అతని కంట్రోల్ కాలక్రమేణా వస్తుందని, ప్రస్తుతం అతని ఫిట్నెస్ కోసం ప్రార్థించాలని బిషప్ పేర్కొన్నారు.
లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించడంలో బౌలర్ నాండ్రీ బర్గర్ కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాళ్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తేలడంతో ఈ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు బర్గర్కు 10 శాతం మ్యాచ్ ఫీజులో జరిమానా విధిస్తూ ఐపీఎల్ ప్రకటన జారీ చేసింది. అలాగే అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను కూడా చేర్చింది.
మరికాసేపట్లో ముంబై వేదికగా CSK, MI జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ధోనీ ఆడనున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. దీంతో ఎంతో కాలంగా ధోనీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే CSK కీలక ప్లేయర్ ఆయుష్ మాత్రే గాయపడగా.. అతడి స్థానంలో ధోనీ వస్తాడని ‘థలా’ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.