IPL 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా RCB vs SRH మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కానీ.. వర్షం పడే అవకాశం ఉందనే వార్త ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ వరుణుడు కరుణిస్తే అభిమానులకు పైసా వసూల్ మ్యాచ్ గ్యారెంటీ. మరి ఈ ఉత్కంఠభరిత పోరులో విజయం ఎవరిని వరిస్తుందో కామెంట్ చేయండి.
IPL 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా RCB, SRH మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కానీ.. వర్షం పడే అవకాశం ఉందనే వార్త ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ వరుణుడు కరుణిస్తే అభిమానులకు పైసా వసూల్ మ్యాచ్ గ్యారెంటీ. మరి ఈ ఉత్కంఠభరిత పోరులో విజయం ఎవరిని వరిస్తుందో కామెంట్ చేయండి.
ఐపీఎల్-2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన SRH.. ఇవాళ టేబుల్ టాపర్ RCBతో తలపడనుంది. అయితే సన్రైజర్స్ టాప్-2లో నిలవాలంటే ఈ మ్యాచ్లో భారీ విజయం తప్పనిసరి. మొదట బ్యాటింగ్ చేస్తే RCBపై 83-89 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్కు దిగితే ప్రత్యర్థి లక్ష్యాన్ని 11 ఓవర్లలోపే ముగించాలి. ఈ పోరులో నెట్ రన్ రేట్ కీలకం కానుంది.
ఉప్పల్ వేదికగా ఇవాళ SRH, RCB జట్లు తలపడబోతున్నాయి. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో SRH ఆధిక్యంలో ఉంది. ఇరుజట్లు ఇప్పటివరకు 26 సార్లు తలపడగా.. SRH 14 మ్యాచ్ల్లో RCB 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఇవాళ్టి మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పాయింట్స్ టెబుల్లో టాప్-2గా నిలవాలని SRH భావిస్తోంది.
IPLలో ధోనీ కొనసాగడంపై CSK కోచ్ మైఖేల్ సిమన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ భవిష్యత్పై అతడే తుది నిర్ణయం తీసుకుంటాడన్నాడు. నెట్స్లో ధోనీ భారీ షాట్లు కొడుతున్నాడని, అయితే గాయం కారణంగా పరుగెత్తేందుకు కాస్త ఇబ్బంది పడ్డాడని తెలిపాడు. ఆటపై పూర్తి అవగాహన ఉన్న ధోనీ, తన ఫిట్నెస్ను బట్టి జట్టుకు ఏది మంచిదో ఆలోచించి సరైన నిర్ణయమే తీసుకుంటాడని స్పష్టం చేశాడు.
తన అన్న అంత్యక్రియలు ముగిసిన వెంటనే, ‘భారత్-ఆసిస్ మ్యాచ్కు కామెంటరీ చేస్తావా?’ అని ఓ BCCI అధికారి అడిగారని మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుణెలో కామెంటేటర్గా చేస్తున్న సమయంలో.. తన తల్లి మరణించినప్పుడు కూడా ఇలాగే జరిగిందని గుర్తుచేసుకున్నాడు. బోర్డు ప్రతినిధులు అమానవీయంగా, సున్నితత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
నిన్న GTతో జరిగిన మ్యాచ్లో CSK ఘోర పరాభవం పాలై IPLనుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు జట్టు మొత్తానికి BCCI జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా గైక్వాడ్కి రూ.24 లక్షలు, మిగతా ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కొత విధించింది. ఈ సీజన్లో CSK ఇలా స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి.
RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మే 19న LSGతో జరిగిన మ్యాచ్లో, వరుస ఓటములతో టెన్షన్లో ఉన్న కోచ్ కుమార సంగక్కరకు “టెన్షన్ వద్దు.. నేనున్నాగా” అంటూ ఈ చిన్నోడు భరోసా ఇచ్చాడు. అన్నట్టుగానే అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించడంతో సంగక్కర క్లిష్ట సమయంలో అతడు చూపిన ధైర్యాన్ని మెచ్చుకున్నాడు.
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్, కోహ్లీ (రో-కో) ఫిట్నెస్గా ఉన్నంత కాలం వన్డేలు ఆడాలని మాజీ క్రికెటర్ కిరణ్ మోరే అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి ఆటను తాను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తానని, ప్రస్తుతం వారి రిటైర్మెంట్ గురించి చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అలాగే, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీతో భవిష్యత్తులో భారత క్రికెట్కు మరింత కీర్తి లభిస్తుందన్నాడు.
GTతో జరిగిన మ్యాచ్లో ఓటమిపై CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ‘GT అద్భుత ప్రదర్శనతో మమ్మల్ని చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్లో మా కంటే మెరుగైన ప్రదర్శన చేశారు. 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం సులువు కాదు. వారి ఓపెనర్లను కట్టడి చేయలేకపోయాం. టోర్నీ ప్రారంభంలోనే వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోవడంతో ఈ సీజన్ మాకు చాలా కష్టంగా సాగింది’ అని అన్నాడు.
CSKతో జరిగిన మ్యాచ్లో విజయం అనంతరం GT బౌలర్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రాక్టీస్ సమయంలో.. నేను నా రిథమ్ను మెరుగుపరుచుకోవడానికి కొత్త బంతితో బౌలింగ్ చేస్తా. తర్వాత యార్కర్ల కోసం ప్రయత్నిస్తా. ఇది ఎర్రమట్టి పిచ్ కాబట్టి బ్యాటర్లు కవర్స్ దిశగా షాట్లు ఆడేలా బంతులు వేశా. సంజూ శాంసన్ వికెట్ విషయంలో నేను అనుకున్న ఈ ప్లాన్ వర్కవుట్ అయింది’ అని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లో టాప్-2 బెర్త్ కోసం హైదరాబాద్లో SRH, RCB మధ్య ఇవాళ ఉత్కంఠ పోరు జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు క్వాలిఫై అయినా, ఫైనల్కు చేరేందుకు రెండో అవకాశం ఇచ్చే టాప్-2 స్థానం కోసం ఈ మ్యాచ్ కీలకం. ప్రస్తుతం 18 పాయింట్లతో RCB అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ క్వాలిఫయర్ 1లో చోటు దక్కించుకోగా, RCBని ఓడిస్తేనే SRHకు టాప్-2 దక్కే అవకాశం ఉంది.
భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్కు తప్పకుండా ఎంపిక చేయాలని కోరాడు. కోహ్లీ ఆట తీరు, రోహిత్ ఫిట్నెస్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. కాగా, జూన్లో అఫ్గానిస్థాన్తో జరిగే వన్డే సిరీస్కు వీరిద్దరూ ఎంపికయ్యారు.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ప్లేఆఫ్స్ చేరాల్సిన కీలక మ్యాచ్లో గుజరాత్ చేతిలో 89 పరుగుల తేడాతో CSK ఘోర పరాజయం పాలైంది. 230 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో GT బౌలర్లు సిరాజ్, రషీద్ తలో 3 వికెట్లతో చెన్నైని కోలుకోలేని దెబ్బతీశారు. దూబే(47) ఒంటరి పోరాటం చేసినా.. CSK 140 పరుగులకే ఆలౌటై టోర్నీ నుంచి వెనుదిరిగింది.
CSKతో జరుగుతున్న మ్యాచ్లో GT బ్యాటర్లు చెలరేగిపోయారు. సాయి సుదర్శన్ (84) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. కెప్టెన్ గిల్ (64) మెరుపు హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో జోస్ బట్లర్ (57*) అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో GT 229/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. మరి 230 పరుగుల భారీ లక్ష్యాన్ని CSK ఛేజ్ చేస్తుందా..? కామెంట్ చేయండి.