తొలి ఏడు మ్యాచుల్లో ఆరు విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత వరుస ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. LSGతో చివరి మ్యాచ్కు ముందు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ..KKRతో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం తమ జట్టు దూకుడును దెబ్బతీసిందని అన్నాడు. చివరి మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశాడు.