క్రికెట్లో పలు నిబంధనలను మార్చేందుకు ఐసీసీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టెస్టు మ్యాచ్ మధ్యలో గులాబీ బంతిని మార్చాలని, అలాగే టీ20 ఇన్నింగ్స్ బ్రేక్ సమయాన్ని 15 నిమిషాలకు కుదించాలని ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ కీలక మార్పులపై మే 30న జరిగే ఐసీసీ సమావేశంలో చర్చించి, ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ కొత్త రూల్స్ ఆటలో మరిన్ని మార్పులకు దారితీయనున్నాయి.