టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి బెంగాల్ ప్రభుత్వం భద్రతను తగ్గించింది. ఇటీవల జరిగిన సమీక్ష తర్వాత ఆయన సెక్యూరిటీని ‘జెడ్’ కేటగిరీ నుండి ‘వై’ కేటగిరీకి మారుస్తూ కొత్త సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023లో పెంచిన భద్రతను ఇప్పుడు మళ్లీ తగ్గించారు. అయితే వీఐపీ ప్రోటోకాల్ ప్రకారం గంగూలీకి అవసరమైన పోలీస్ ప్రొటెక్షన్ మాత్రం కొనసాగుతుంది.