టెలికాం యూజర్లకు కేంద్రం కీలక సూచన చేసింది. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు టెలికాం విభాగం(డాట్) ఓ ప్రకటన విడుదల చేసింది. 24గంటల్లోనే 1.35కోట్ల ఫోన్ నంబర్లను టెలికాం ప్రొవైడర్లు బ్లాక్ చేశారని డాట్ తెలిపింది. ముఖ్యంగా +8, +85, +65 వంటి అంతర్జాతీయ నంబర్ల నుంచి ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేసి మోసగిస్తున్నారని చెప్పింది.
ఆకాశ ఎయిర్లైన్స్కు ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA జరిమానా విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 6న ఆకాశ విమానం ఒకటి బెంగళూరు నుంచి పుణెకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే, బోర్డింగ్కు పలువురు ప్రయాణికులను అనుమతించకపోగా.. వారికి పరిహారం అందజేయడంలో విఫలమైంది. దీంతో ఆ సంస్థకు డీజీసీఏ రూ.10 లక్షలు జరిమానా విధించింది.
అమెరికన్ ఎయిర్లైన్స్ సేవలకు ఆటంకం ఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా ఆ సంస్థకు చెందిన విమాన సేవలు దాదాపు గంటకు పైగా నిలిచిపోయాయి. క్రిస్మస్ వేళ విమాన సేవలు నిలిచిపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు నెటిజన్లు అమెరికన్ ఎయిర్లైన్స్పై నెట్టింట పోస్టులు పెట్టారు. దీంతో స్పందించిన సంస్థ.. విమాన సేవలు తిరిగి అందుబాటులోకి తెచ్చింది.
భారత్ మార్కెట్లో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో.. Vivo Y29 5G కొత్త మొబైల్ను విడుదల చేసింది. 4GB+128GB రూ.13,999, 6GB+128GB రూ.15,499, 8GB+128GB రూ.16,999, 8GB+256GB రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. డైమండ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, టైటానియం గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. కంపెనీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని వివో తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొంతమేర తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గగా రూ.70,900 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గడంతో రూ.77,350 ఉంది. ఇక కిలో వెండి ధర స్థిరంగా రూ.98,900 ఉంది.
KDP: రెవెన్యూ అధికారులు భూ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బోరెడ్డిగారిపల్లిలోని స్వగృహంలో మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లాలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని, వీఆర్ నుండి తహసీల్దార్ వరకు గ్రామాలలో పర్యటించి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు.
VSP: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు NYK ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు కడపలో జరిగే అంతర జిల్లాల యువజన సమ్మేళనంలో పాల్గొంటున్నట్లు ప్రిన్సిపాల్ డా. నాయక్ తెలిపారు. యువ సమ్మేళనంలో విద్యార్ధులు పాల్గొనటం వలన వివిధ అంశాలపై అవగాహన కలుగుతుందని వైస్ ప్రిన్సిపాల్స్ డా పుష్పరాజు అన్నారు. ఎన్వైకే అధికారులకు కృతజ్ఞత తెలిపారు.
టాటా గ్రూప్ నుంచి మరో ఐపీఓ రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోనే టాటా క్యాపిటల్ను ఐపీఓకి తీసుకురానున్నట్లు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ ఐపీఓ ద్వారా రూ.15 వేల కోట్లు సమీకరించనున్నట్లు సమాచారం. టాటా టెక్నాలజీస్ బంపర్ లిస్టింగ్ తర్వాత ఈ గ్రూప్ నుంచి రానున్న మరో సంస్థ ఇదే కావటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓపై మదుపర్లలో ఆసక్తి నెలకొంది.
KRNL: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు అధికారులు తెలిపారు. ‘నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించారు. వివిధ కారణాల వల్ల పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సూచించారు.
SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 2015, 2016, 2017, 2018 అడ్మిట్ విద్యార్థుల 1వ, 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలకు గాను స్పెషల్ డ్రైవు నేడు యూనివర్సిటీ డీన్ విడుదల చేశారు. ఈ పరీక్షలకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా జనవరి 18వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటాయని డీన్ పేర్కొన్నారు.
SKLM: ఎచ్చెర్ల లో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి ఈ నెల 24 నుంచి జనవరి 17 వరకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ పి.సుజాత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 18 నుంచి తరగతులు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
SKLM: టెక్కలిలో యురేకా సైన్స్ ఎక్స్పో-2025 పేరిట జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కె.కామేశ్వర రావు తెలిపారు. 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం-సుస్థిరాభివృద్ది, మూఢ నమ్మకాలు-శాస్త్రీయ దృక్పథం అనే అంశాలపై ప్రయోగాలను చేసి వీడియో రూపంలో 8500960840 పంపించాలని సూచించారు.
SKLM: ఎచ్చెర్లలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయానికి ఈ నెల 24 నుంచి జనవరి 17 వరకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ పి.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 18 నుంచి తరగతులు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు.
జియో, వొడాఫోన్ ఐడియాకు మరోసారి షాక్ తగిలింది. జూలైలో చేపట్టిన ధరల పెంపు కారణంగా.. ఆ కంపెనీలు అక్టోబర్లోనూ మరోసారి పెద్దసంఖ్యలో యూజర్లను కోల్పోయాయి. ఎయిర్టెల్ మాత్రం కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకోగలిగింది. అలాగే, BSNL మరోసారి స్వల్పంగా సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంది. అక్టోబర్ నెలకు గానూ ట్రాయ్ వెలువరించిన డేటాలో ఈ విషయం వెల్లడైంది.
SKLM: ఎచ్చెర్లలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో మూడేళ్ల ఎల్.ఎల్.బిలో 13 మిగులు సీట్లకు ఈ నెల 20న స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. 52 మంది దరఖాస్తు చేసుకోగా వీసీ కె.ఆర్. రజిని సోమవారం సీట్లు ఎలాట్ చేశారు. 13 సీట్లలో ఈడబ్ల్యూఎస్ సీట్లు రెండు ఉన్నాయి. లాసెట్ 2024 ర్యాంకు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారం గా ప్రవేశాలు కల్పించారు.