ఇరాన్ కరెన్సీ ‘ఇరానియన్ రియాల్’ విలువ భారీగా పతనమైంది. డాలరుతో పోలిస్తే మరకపు విలువ నవంబర్లోనే 10 పడిపోయింది. దీంతో ప్రస్తుతం ఒక డాలురు మారకపు విలువ 7,77,000 రియాల్స్. ఇబ్రహీం రైసీ మరణం, ఈ ఏడాదిలో ఆ దేశ అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ బాధ్యలు స్వీకరించటం, ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం.. ఇరాన్ కరెన్సీ పడిపోవటానికి కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
MDK: ఉమ్మడి మెదక్ విద్యార్థులకు అలర్ట్. OU పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షల టెంటేటీవ్ (తాత్కాలిక) తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. M.SC, MA, M.COM, MSW, BLIBSC, BCJ, M.LIBISC, MJ&MC, M.COM(IS) అన్ని సెమిస్టర్ల వన్ టైం చాన్స్ బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 17 నుంచి నిర్వహించనున్నామని చెప్పారు.
కర్నూలు జిల్లాలో 16 మంది డిగ్రీ విద్యార్థులు డిబార్ అయ్యారు. మాస్ కాపీయింగ్కు పాల్పడటంతో డిబార్ చేసినట్లు ఇన్ఛార్జి వీసీ ఎన్టీకే నాయక్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన మొదటి సెమిస్టర్ పరీక్షకు 10,504 మందికి గానూ 9,125 మంది, ఐదో సెమిస్టర్ పరీక్షకు 62 మందికి గానూ 48 మంది హాజరయ్యారు.
KRNL: టెన్త్ పరీక్షల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవడం జరిగిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అందుకు అనుకూలంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు మెరుగైన ఫలితాలు ఈ విద్యా సంవత్సరం సాధించనున్నారని తెలిపారు.
MBNR: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ 2 వ, 3 వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు ఈనెల 28 లోపు చెల్లించాలని ఎంవిఎస్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి బుధవారం తెలిపారు. డిగ్రీలో 2018 నుంచి పీజీలో 2020 నుంచి 2023 వరకు అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
E.G: యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈనెల 21న కొవ్వూరు ఏబీఎన్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. 34 కంపెనీల ప్రతినిధులు ముఖాముఖీ నిర్వహించి 1,200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. పది నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 21న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, ప్రగతి, పాఠశాల అభివృద్ధిపై చర్చించాలని, దీనికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.
MDK: ఐటీఐలో ఉత్తీర్థులైన అభ్యర్థులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెదక్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. పలు విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవకాశం ఉందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 26వ తేదీ లోగా https:/// www.iict.res.in దరఖాస్తు చేసుకోవాలన్నారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉర్దూ మీడియంలో చరిత్ర సబ్జెక్టు బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ వేణు ప్రసాద్ తెలిపారు. పీజీలో 55% ఉత్తీర్ణత, నెట్, సెట్, పీహెచ్డీ పట్టా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈనెల 20వ తేదీలోపు కళాశాలలో సమర్పించాలన్నారు.
NLG: ఈ నెల 30న టైలరింగ్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ.అనిత తెలిపారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలు అప్లై చేసుకోవాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండి యోగ్యతా పత్రం కలిగిన వారు అర్హులన్నారు. టైలరింగ్లో 30 సీట్లు ఉన్నాయని, శిక్షణ 45 రోజులు ఉంటుందని చెప్పారు.
HNK: ప్రభుత్వ ఐటీఐల్లో 60 శాతం మార్కులతో రెండేళ్ల కాల పరిమితి కోర్సులు ఉత్తీర్ణులైన వారు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు బ్రిడ్జి కోర్సు 2025-26 కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఐటీఐ ప్రిన్సిపల్ M.చందర్ తెలిపారు. బ్రిడ్జి కోర్సుల ప్రవేశాల కోసం డిసెంబర్ 18 నుంచి 2025 జనవరి 30 వరకు ప్రభుత్వ ఐటీఐ, వరంగల్ నందు దరఖాస్తులు అందజేయాలని కోరారు.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో వాటర్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కోర్సులో పీజీ డిప్లొమా(Y19) చదివిన విద్యార్థుల కోసం ‘వన్ టైం ఆపర్చునిటీ’ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2025 జనవరి 2 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, లేట్ ఫీ లేకుండా ఈనెల 26లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది.
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా జాతీయ, అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి టికెట్ ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్తోపాటు 10 కిలోల వరకు అదనపు లగేజి తీసుకెళ్లడానికి అవకాశం ఇచ్చింది. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ ...
HYD: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జీ.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ (ఇయర్ వైజ్) అన్ని సంవత్సరాల బ్యాక్ లాగ్ పరీక్లను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
HYD: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జీ.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ (ఇయర్ వైజ్) అన్ని సంవత్సరాల బ్యాక్ లాగ్ పరీక్లను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.