TG: వసంత పంచమి వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో పలు హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే స్కూళ్లకు నేడు సెలవు ఉండనుంది. అలాగే, సెలవు ఇవ్వాలా లేదా అనేది స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. మరోవైపు ఏపీలో ఎలాంటి హాలీడే ప్రకటించలేదు.
NTR: కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో LLM పీజీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ శనివారం విడుదలైంది. ఫిబ్రవరి 10, 12 తేదీలలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్లో చూడవచన్నారు.
MDK: హవేలిఘనపూర్ మండలం బ్యాతోల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
MDK: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణతను సాధించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృషి చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ప్రతి విద్యార్థి సబ్జెక్టుల వారీగా అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు.
NTR: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగించారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఫిబ్రవరి 5లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28తో గడువు ముగియగా.. వచ్చే నెల 5 వరకు పొడిగించామన్నారు.
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 2015, 2016, 2017, 2018 డిగ్రీలో ఫెయిల్ అయిన విద్యార్థులకి మరొక అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ వీసీ నాయక్ తెలిపారు. అభ్యర్థులకి ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగంచుకోవాలన్నారు.
ఫోన్ పే యాప్ ‘హ్యాపీ మహాకుంభ్, మహాశుగున్’ పేరుతో క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ పేలో మొదటి ట్రాన్సక్షన్పై రూ.144 క్యాష్బ్యాక్ పొందవచ్చు. కేవలం రూ.1 పేమెంట్ చేసినా వినియోగదారులకు రూ.144 క్యాష్బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 26 వరకే అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ ఆఫర్ యూపీలోని ప్రయాగ్రాజ్ నగరానికే పరిమితం.
కృష్ణా: ఈనెల 28న గన్నవరం రోటరీ క్లబ్లో ఎమ్మెల్యే యార్లగడ్డ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది. 10th,(Pass/Fail), Inter, ITI వారు అర్హులన్నారు. ఉచిత భోజనం వసతి పాటు రూ.12వేలుకు పైగా వేతనం ఉంటుందన్నారు.
ఏలూరు: కొయ్యలగూడెం ప్రకాశం డిగ్రీ కళాశాలలో జనవరి 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్ర తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్లో సుమారు 180 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తున్నామన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదివి వయసు 18-35 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు.
TG: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్పై 10 గ్రాములకు రూ. 750 పెరిగి రూ. 75250కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.860 పెరిగి రూ.82090కి చేరింది. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. కిలో వెండి ధర రూ.104000గా కొనసాగుతోంది.
AP: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్ల్లో ఇవ్వాలని నిర్ణయించింది.
ATP: నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్ష రాసే 9, 11వ తరగతుల విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకోవలని నవోదయ ప్రధాన ఆచార్యులు నాగరాజు సోమవారం తెలిపారు. 9వ తరగతి ప్రవేశానికి 1,084 మంది, ఇంటర్ (11) ప్రవేశానికి 1,225 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. హాల్ టికెట్లు www.navodaya.nic.inలో పొందవచ్చని తెలిపారు.
ప్రకాశం: జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహిస్తున్నట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో 4,547 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు.
VSP: చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగే నవోదయలో ఆరో తరగతి ప్రవేశానికి జరిగే పరీక్షలకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవి తెలిపారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఒక కేంద్రానికి తను, రెండవ కేంద్రానికి పాఠశాల టీచర్ స్వామి ఇన్చార్జిగా వ్యవహరిస్తామన్నారు.