పార్వతీపురం ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థుల చదువును రాత్రి సమయాలలో ఉపాధ్యాయులు గమనించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా టెన్త్ ఉత్తీర్ణత రాష్ట్ర స్థాయిలో జిల్లాను తొలి స్థానంలో నిలపాలన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో 2025 జనవరి 4న జరగనున్న పలు పరీక్షలు వాయిదాపడ్డాయి. 3,4వ తేదీలలో మచిలీపట్నంలో “యువకెరటాలు” కార్యక్రమం జరగనున్నందున జనవరి 4న జరగాల్సిన PG, MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలను జనవరి 21న నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలు జనవరి 20న నిర్వహిస్తామన్నారు.
VZM: వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఆసక్తి గల అబ్యర్దులు జనవరి 2 లోగా దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం మునిసిపల్ కమీషనర్ పి.నల్లనయ్య ఆదివారం సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలాక్టిషియన్, టీవీ, వాషింగ్ మిషన్, గ్రీజర్, రిఫ్రిజిరేటర్, ప్లంబింగ్, కార్పెంటర్స్కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
SKLM: పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి యు సాయికుమార్ ప్రకటనలో తెలిపారు. AP రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా SSC , INTER, DEGREE పూర్తిచేసిన 18 – 35ఏళ్లు గల M/F లు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.
ఈ ఏడాది మరో 2 రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే వారంలో రెండు కొత్త IPOలు రాబోతున్నాయి. దీంతోపాటు 6 కంపెనీల IPOలు మొదలుకానున్నాయి. ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ IPO మెయిన్బోర్డ్ సెగ్మెంట్ చివరి పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 31న మొదలవుతుంది.
కియా మోటార్స్ 2024 జనవరిలో కొత్త ‘సోనెట్’ లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన కేవలం 11 నెలల్లో ఏకంగా లక్ష కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను పొందింది. కియా సోనెట్ మొత్తం అమ్మకాల్లో పెట్రోల్ మోడల్స్ 76 శాతం కాగా.. 24 శాతం మంది డీజిల్ కార్లు ఉన్నాయి. మరో 34 శాతం మంది ఆటోమాటిక్ IMT వేరియంట్స్ కొనుగోలు చేశారు.
యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జనవరి 3 నుంచి 16 వరకు ఆన్లైన్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డులపై ఫొటో, బార్కోడ్ లేకపోతే మరోసారి డౌన్లోడ్ చేసుకోవాలని యూజీసీ సూచించింది. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
NTR: మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. టెక్నో టాస్క్, బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోసోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు పాల్గొంటాయన్నారు.
KRNL: పోలీసు ఉద్యోగాల నియామకం విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ అభ్యర్థులకు సూచించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా, డిసెంబర్ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు PMT/PET పరీక్షలు జరగనున్నాయి.
NGKL: పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అతిథి అధ్యాపకులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఎస్ఓ సువర్ణ తెలిపారు. ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించేందుకు ఆసక్తి ఉండి, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. బీఈడీ, సంబంధించిన సబ్జెక్టుల్లో పీజీ పూర్తి చేసిన వారు అర్హులని ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవలన్నారు.
MBNR: ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు ఫిబ్రవరి 1వ తేదీ లోపు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సంక్షేమ అధికారులు తెలిపారు. 2025-26 సంవత్సర 5వ తరగతి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు గానూ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు రూ.100 చెల్లించాలని తెలిపారు.
E.G: జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో రాజానగరంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీన ఉద్యోగమేళా నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరిచంద్రప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పెరుమాళరావు శనివారం ఒక ప్రకటలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో మూడు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. వివరాలకు నెంబర్9988853335 ద్వారా సంప్రదించాలన్నారు.
JN: జిల్లాలోని ఏబీవీ ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల దరఖాస్తుల గడువును పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్, పొలిటికల్ సైన్స్ బోధించేందుకు 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ATP: మాజీ సైనికుల పిల్లలకు ప్రధానమంత్రి ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించినట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి. తిమ్మప్ప తెలిపారు. దరఖాస్తు గడువును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని మాజీ సైనికుల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రకాశం: ఒంగోలు నగరంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతి ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థుల హాల్ టికెట్లు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని ప్రిన్సిపల్ వీకే గీతాలక్ష్మి తెలిపారు. జనవరి 18న ఉదయం 11 గంటలకు ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 9951091988 నంబరును సంప్రదించాలని సూచించారు.