TG: ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్, SSC పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యంగా హాజరుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. పరీక్షలో అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.